KTR: కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్ భేటీ.. ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చాం.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు.. తీసుకురావాల్సిన సంస్కరణలు పై స్వేచ్ఛగా వివరించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.. ఈవీఎం ల విషయంలో అనుమానాలున్నాయన్నారు. ఓటింగ్ మిషన్లు వద్దని బ్యాలెట్ పేపర్ కి వెళ్ళాయి.. బీహార్ ఎన్నికల నుంచే బ్యాలెట్ పేపర్ ప్రవేశ పెట్టాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలు.. తెలంగాణలో వేలం పాట లాగా హామీలు ఇచ్చారని చెప్పారు. 420 హామీలు ఇచ్చారు.. చివరకు బాండ్ పేపర్ల పై రాసిచ్చారని.. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో కు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండక పోతే చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యత్వం రద్దు చెయ్యాలన్నారు..
READ MORE: YS Jagan: మూడేళ్ల తర్వాత అధికారం మనదే.. వారంతా జైలుకే..!
Also Read
- Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
- Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో 'పే లేటర్' సదుపాయం!
బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ పై కూడా ప్రశ్నించామని.. రివిజన్ చెయ్యాలి కానీ అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. “అన్ని పార్టీలను భాగస్వామ్యం చేసి పారదర్శకంగా చెయ్యాలని కోరాం. అవసరం అయితే బూత్ లెవెల్ కమిటీలతో అఖిల పక్షాలను ఏర్పాటు చెయ్యాలి. ఓట్లు ఎందుకు తీసి వేస్తున్నారో . కారణాలు తెలపాలి. అన్ని పార్టీల సమ్మతితో చెయ్యాలి. భారత దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాలి. ఖర్చు, దొంగ హామీలు.. వంటి అంశాలపై చర్చ జరిపాం. కార్ గుర్తును పోలిన 8, 9 సింబల్స్ ను తొలగించి ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా.. భువనగిరిలో రోడ్ రోలర్ గుర్తు వల్ల మేం ఓడి పోయాం. కార్ గుర్తును పోలిన వాటిని తక్షణమే తొలగించాలి.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Anil Ravipudi: త్రివిక్రమ్ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఎన్టీఆర్!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!