KTR: కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్ భేటీ.. ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చాం.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు.. తీసుకురావాల్సిన సంస్కరణలు పై స్వేచ్ఛగా వివరించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.. ఈవీఎం ల విషయంలో అనుమానాలున్నాయన్నారు. ఓటింగ్ మిషన్లు వద్దని బ్యాలెట్ పేపర్ కి వెళ్ళాయి.. బీహార్ ఎన్నికల నుంచే బ్యాలెట్ పేపర్ ప్రవేశ పెట్టాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలు.. తెలంగాణలో వేలం పాట లాగా హామీలు ఇచ్చారని చెప్పారు. 420 హామీలు ఇచ్చారు.. చివరకు బాండ్ పేపర్ల పై రాసిచ్చారని.. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో కు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండక పోతే చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యత్వం రద్దు చెయ్యాలన్నారు..
READ MORE: YS Jagan: మూడేళ్ల తర్వాత అధికారం మనదే.. వారంతా జైలుకే..!
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ పై కూడా ప్రశ్నించామని.. రివిజన్ చెయ్యాలి కానీ అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. “అన్ని పార్టీలను భాగస్వామ్యం చేసి పారదర్శకంగా చెయ్యాలని కోరాం. అవసరం అయితే బూత్ లెవెల్ కమిటీలతో అఖిల పక్షాలను ఏర్పాటు చెయ్యాలి. ఓట్లు ఎందుకు తీసి వేస్తున్నారో . కారణాలు తెలపాలి. అన్ని పార్టీల సమ్మతితో చెయ్యాలి. భారత దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాలి. ఖర్చు, దొంగ హామీలు.. వంటి అంశాలపై చర్చ జరిపాం. కార్ గుర్తును పోలిన 8, 9 సింబల్స్ ను తొలగించి ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా.. భువనగిరిలో రోడ్ రోలర్ గుర్తు వల్ల మేం ఓడి పోయాం. కార్ గుర్తును పోలిన వాటిని తక్షణమే తొలగించాలి.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!