AP deputy CM Pawan Kalyan Tweet: యాక్సిడెంట్లో జనసేన కార్యకర్త మృతి చెందారు. ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలం, చందాల గ్రామానికి చెందిన జనసైనికుడు చందూ వీర వెంకట వసంతరాయలు గాయపడి బ్రెయిన్ డెడ్ కు గురయ్యారన్న వార్త తీవ్ర బాధాకరమని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ లో జరిగిన స్కామ్పై దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందని.. ఢిల్లీ కన్నా పది రెట్లు ఎక్కువ స్కామ్ ఏపీలో జరిగిందని మంత్రి పార్థసారథి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు వెళితే.. గత ప్రభుత్వం మాత్రం లిక్కర్లో 98 శాతం నగదు లావాదేవీలు జరిపిందన్నారు. ప్రజల నుంచి ఎందుకు నగదు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
హైందవం ఒక మతం కాదు. అది జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం కానీ, నిత్యనవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ప్రపంచ మతాలు అన్నిటిలో హిందూ మతమే అతి పురాతనమైనది. నేడు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. అమెరికా, రష్యా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాల పౌరులు ఆధ్యాత్మిక శాంతి, సమతుల్య జీవితం కోసం దీనిని అవలంబిస్తున్నారు.
Spanish MBBS Doctor Became Sanyasi: నేటి ప్రపంచంలో చాలా మంది డబ్బు, హోదా, విలాసాల కోసం పోటీ పడుతున్నారు. కానీ.. ఆత్మ శాంతి, జీవితానికి నిజమైన అర్థాన్ని వెతుక్కుంటూ భౌతిక సుఖాలను వదులుకునే వారు కొందరు ఉన్నారు. తాజాగా ఓ విదేశీ మహిళ విలాసవంతమైన జీవితం విడిచి సాధ్విగా మారింది. వృత్తిరీత్యా వైద్యురాలైన స్పానిష్ అమ్మాయి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. తమ దేశంలో అన్నీ వదిలి భారతదేశానికి వచ్చి సనాతన ధర్మాన్ని స్వీకరించి సాధ్విగా జీవిస్తోంది.
మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు క్రమంగా మన ప్రవర్తనలో భాగమవుతాయి. ఇది మానసిక సమస్యకు సంకేతం కావచ్చని అర్థం చేసుకోలి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) కూడా అలాంటి ఒక మానసిక స్థితి. ఇది కూడా ఒక యాంగ్జైటీ డిజార్డర్ అని వైద్యులు చెబుతుంటారు. అంటే ప్రతిదీ శుభ్రంగా ఉండాలి. ప్రతిదీ పద్ధతిగా సర్ది ఉండాలి. ఏది ఉండాల్సిన చోట అది ఉండాలి. ఇలాంటి చాలా రూల్స్ వీరికి ఉంటాయి. అలా లేకపోతే వీరు ఒక విధమైన ఒత్తిడికి లోనైపోతారు. ఆందోళన కలుగుతుంది. దాన్ని…
Senior Army Officer Assaults SpiceJet Staff: శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లే స్పైస్జెట్ విమానం SG-386 బోర్డింగ్ గేట్ వద్ద ఒక సీనియర్ ఆర్మీ అధికారి నలుగురు స్పైస్జెట్ ఉద్యోగులను దారుణంగా కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూలై 26న అదనపు క్యాబిన్ బ్యాగేజీని తీసుకెళ్లడానికి ఎక్స్ట్రా ఛార్జీలు చెల్లించమని సిబ్బందికి కోరగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Fake Export Contract Scam: వ్యాపార అవకాశాలు కల్పిస్తాం.. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పిస్తామని మాయ మాటలు చెప్తూ కోట్ల రూపాయలు కాజేస్తున్న ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు... లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించిన కేటుగాళ్లు.. హైదరాబాద్కి చెందిన ఓ వ్యాపారవేత్తను నిండా ముంచారు. B2B ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పేరుతో ఓ వ్యాపారి నుంచి విడతల వారీగా కోటి పది లక్షలు కాజేశారు. మోసపోయాను అని…
Woman Constable Suicide: ఓ మహిళా కానిస్టేబుల్గా.. ఆమె క్రిమినల్స్తో పోరాడింది.. కానీ సొంత ఇంట్లో సమస్యలతో పోరాడేందుకు ధైర్యం సరిపోలేదు. అలా అని పోలీసు ఉన్నతాధికారులతోనూ తన సమస్యను చెప్పుకోలేదు. ఫలితంగా సమస్యకు తలొగ్గి జీవితాన్ని త్యజించింది. హైదరాబాద్లో ఓ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి ట్రాప్ అయ్యాడు..!! అదృష్టం బాగుండి కొన్నాళ్లకు తిరిగొచ్చాడు. తనలా మరొకరు మోసపోకుండా ఉండాలని కోరుకోవాల్సింది పోయి.. ఉద్యోగాల ఆశ చూపి అమాయకులను విదేశాలకు పంపాడు. ఇదీ చాలదన్నట్టు స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నాడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో అడ్డంగా బుక్కై.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు.
ఏ ప్రాజెక్ట్ అడిగినా గడ్కరీ అడ్డు చెప్పరని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. మహారాష్ట్ర రవాణా శాఖమంత్రిగా ఉన్నపుడు గడ్కరీ ముంబై, పూణే హైవే నిర్మాణం చేశారని గుర్తు చేశారు. 1997 సమయంలో గొప్ప ప్రాజెక్ట్ నిర్శించారని గుర్తు చేశారు. అభివృద్ధికి నాగరికతకు చిహ్నం రోడ్లు.. వాజ్పెయి రోడ్లను అభివృద్ధి చేస్తే మోడీ కొనసాగించారన్నారు.