KTR: బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతుల చేతులకు సంకెళ్లు వేసి, వారి పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్భందించడం రేవంత్ ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనమని తెలిపారు.
HCA Funds Misuse: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిధుల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఆడిట్ నిర్వహిస్తేనే నిధుల దుర్వినియోగంపై సీఐడీకి క్లారిటీ రానుంది. జగన్ మోహన్ రావు అధ్యక్షుడు అయిననాటి నుంచి బీసీసీఐ నుంచి హెచ్సీఏకు రూ. 240 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి.
Karnataka: పిలిచి పిల్లనిస్తే.. అత్తను దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడైన అల్లుడు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా కోలాలలో జరిగింది. మర్డర్ చేసిన తర్వాత ఆమె శరీర భాగాలను ఖండఖండాలుగా నరికేశాడు దుర్మార్గుడు. అంతటితో ఆగకుండా పోలీసులకు దొరక వద్దనే ఉద్దేశ్యంతో వాటిని కవర్లలో ప్యాక్ చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. కానీ పాపం పండడంతో డాక్టర్ అల్లుడు దొరికేశాడు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా కోలాలలో జరిగిన మహిళ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మహిళను మర్డర్ చేసింది అల్లుడు డాక్టర్…
Adilabad: హనీ ట్రాప్లో ఇదో రకం. కేవలం బైక్ మీద లిఫ్ట్ అడిగిన లేడీ కిలాడీ.. తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి నుంచే డబ్బులు గుంజింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహిళతోపాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. బైక్ మీద వెళ్లే వాళ్లు.. సాధారణంగా ఎవరైనా లిఫ్ట్ అడిగితే.. కాదనకుండా ఇస్తారు.. అందులోనూ మహిళలు ఎవరైనా లిఫ్ట్ అడిగితే.. వారు ఇబ్బంది పడకూడదని.. మానవత్వంతో వారు దిగాల్సిన చోటు వరకు తీసుకు వెళ్తుంటారు. కానీ అలా ఓ…
AP Heavy Rains Holiday: ఏపీలోని పలు జిల్లా్ల్లో వర్షం దంచికొడుతోంది. అకాల వర్షానికి జనా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కారణంగా పాఠశాలలకు సెలవు ఇచ్చారు. ఇళ్లలోనే ఉండాలని తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్లు సూచించారు.
VinFast Minio Green EV: వియత్నామీస్(వియత్నం) కార్ల తయారీ సంస్థ విన్ఫాస్ట్ జూలై 15న తన మొదటి షోరూమ్ను ప్రారంభిస్తూ.. భారత్లోకి అధికారికంగా ప్రవేశించినట్లు ప్రకటించింది. కంపెనీ తన రెండు ఎలక్ట్రిక్ కార్లు VF6, VF7 లను స్థానిక మార్కెట్లో ప్రదర్శించింది. వీటి బుకింగ్ ఇప్పటికే ప్రారంభయ్యాయి. తాజాగా కంపెనీ భారత్లో మరో ఎలక్ట్రిక్ కారు
Vijayawada Lashed by Heavy Rains: బెజవాడను ముంచెత్తిన వర్షం ముంచెత్తింది. 2 గంటలుగా దంచికొడుతోంది. నిన్న రాత్రి, ఇవాళ సాయంత్రం బెజవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం తో నగరంలో ఉన్న ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. సింగ్ నగర్, వన్ టౌన్ వాసులు ఆందోళనలో ఉన్నారు. గత ఏడాది మాదిరి బుడమేరు పొంగుతుందని నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బుడమేరు వల్ల ఇబ్బంది లేదని బుడమేరు ప్రవాహం నిలకడ గా ఉందని అధికారులు చెబుతున్నారు. కంట్రోల్ రూమ్…
Former Jammalamadugu MLA Sudheer Reddy was arrested : జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చేసి ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్లో నమోదు అయిన ఓ కేసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసు కానిస్టేబుల్పై దాడి చేసిన కేసులో అరెస్టు చేసినట్టు సమాచారం.
Asaduddin Owaisi Slams Pakistan PM: ఇస్లామాబాద్లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా భారత్పై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. తమకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా గుంజుకునేందుకూ భారత్కు అవకాశం ఇవ్వబోమన్నారు. నదీ జలాలను నిలిపివేసేందుకు తీసుకునే ఏ చర్య అయినా యుద్ధానికి కవ్వింపుగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకుంటే.. మరికొంతమంది భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ లేదా సొంత వాహనాలతో తిరుమలకు వస్తుంటారు. అయితే సొంత వాహనాలలో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య గమనిక జారీ చేసింది.