UP: ఢిల్లీలో శ్రమించి తన కుటుంబాన్ని పోషించిన ఓ తండ్రికి అనుకోని ఘటన ఎదురైంది. 32 సంవత్సరాల పాటు ఇంటిని తన తొమ్మిది మంది పిల్లలను కష్టపడి పెంచిపోషించాడు. ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడికి వివాహం జరిపించాడు. అంతా సవ్యంగానే ఉందనుకునేలోపే విధి అతన్ని కాటేసింది. అతడి భార్య, తొమ్మిది మంది పిల్లలకు తల్లి అకస్మాత్తుగా తన ప్రేమికుడితో పారిపోయింది. పోతు పోతు నగలు, భూమి పత్రాలు, చిన్న కుమార్తెను తీసుకొని పారిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
CM Revanth Reddy: హైదరాబాద్ నగర ప్రజలను వర్షాలు వదలడం లేదు. ఇటీవల కురిసిన కుంభవృష్టి నుంచి తేరుకోకముందే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జీహెచ్ఎంసీ పరిధిలో కుండపోత వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం సుమారు 4 గంటలుగా కురుస్తోంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్లో రోడ్లు మునిగిపోయాయి.
Why Dogs Attack Humans: శునకాలు అంటేనే విశ్వాసానికి ప్రతిరూపమైన జంతువు అంటాం. ఇవి ఇంటిని, మనల్ని దొంగల నుంచి ఆపద సమయాల్లో రక్షిస్తాయని భావిస్తాం. కానీ ఆ కుక్కలే మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి. రక్తం రుచి మరిగినట్లుగా మనుషులపై దాడి చేసి కరుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వీధి కుక్కలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కల స్వైరవిహారం ఆగడం లేదు. నిత్యం ఏదో ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు…
Hyderabad: పని చేస్తున్న సంస్థకే స్నేహితుడితో కలిసి కన్నం వేసి, డైమండ్స్ ఎత్తుకెళ్లిన ఇద్దరిని సైఫాబాద్, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. ముంబైకు చెందిన బంగారం వ్యాపారి విపుల్ షా తరుచూ హైదరాబాద్కు డైమండ్స్ , గోల్డ్ అర్నమెంట్స్ కొరియర్ లో పంపించేవాడు. అలాగే వారి ఎగ్జిక్యూటివ్స్ వాటిని తీసుకొని, హైదరాబాద్లో పలు బంగారు ఆభరణాల షాప్స్కు తిరుగుతూ... వాటిని అమ్మడం,…
పాతబస్తీ యాకుత్పురా మౌలాకా చిల్లా ప్రాంతంలో మ్యాన్హోల్ లో పడిపోయిన చిన్నారి ఘటనపై హైడ్రా దర్యాప్తు చేసింది. బుధవారం మ్యాన్ హోల్ తెరిచినప్పటి నుంచి గురువారం ఉదయం వరకు సీసీ ఫుటేజ్లను పరిశీలించింది. అసలు ఏం జరిగిదంటే.. స్థానిక కార్పొరేటర్ ఆదేశాలతో మ్యాన్ హోల్ ఓపెన్ చేసి హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ మట్టి తొలగించారు. జలమండలికి చెందిన జెట్టింగ్ మెషిన్ తో సిల్ట్ తొలగించారు. సిల్ట్ తొలగించిన అనంతరం మూత వేయకుండానే మరో మ్యాన్ హోల్ క్లీన్ చేయడానికి సిబ్బంది వెళ్ళింది.
RBI: మీరు ఈఎంఐ పద్ధతిలో ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనను పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. ఒక కస్టమర్ వాయిదాల పద్ధతిలో మొబైల్ కొనుగోలు చేసి, సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆయా బ్యాంకులు, రుణ సంస్థలు ఆ ఫోన్ను రిమోట్గా లాక్ చేస్తాయి. ఈ నిర్ణయానికి ఆర్బీఐ తర్వలో అనుమతి ఇవ్వనుంది. వినియోగదారుల వాస్తవ ప్రయోజనాలను కాపాడుతూనే, బ్యాంకుల మొండి రుణాలను తగ్గించడానికి ఈ నిర్ణయం…
Shah Rukh Khan: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంజాబ్ అతాలకుతలమైంది. భారీ వరదలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలువురు చనిపోగా, వేలాది కుటుంబాలు నడిరోడ్డున పడ్డాయి. భారీ ఎత్తున ప్రజలు జీవనోపాధి కోల్పోయారు. పెద్ద సంఖ్యలో పశువులు మరణించాయి. వరదలతో పంజాబ్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ సంక్షోభం మధ్య, బాలీవుడ్ నటులు పెద్ద మనసు చాటుకున్నాడు. బాధితులకు సాయం చేసేందుకు నటుడు షారుఖ్ ఖాన్ మీర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. స్థానిక స్వచ్ఛంద…
Madhapur AV Technologies Scam: హైదరాబాద్లోని మాదాపూర్లో ఏవీ టెక్నాలజీస్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏవీ టెక్నాలజీ స్టాక్ మార్కెట్లో పెట్టు బడుల పేరుతో 1000 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. గడ్డం వెంకట్రావు, గడ్డం వేణుగోపాలు కలిసి డబ్బులు వసూలు చేశారని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల నుంచి 4500 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. ఏవీ టెక్నాలజీస్, ఐఐటీ టెక్నాలజీస్, ఏవీ రియాల్టీ పేరుతో కంపెనీలు ఏర్పాటు చేశారు. తమ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక…
Pakistan: ప్రపంచ రాజకీయాలు తరచుగా ద్వంద్వ ప్రమాణాలను ప్రదర్శిస్తాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ పాకిస్థాన్. ఒకప్పుడు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే దేశంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్లో అపఖ్యాతి పాలైన పాకిస్థాన్, ఇప్పుడు SCO-RATS (ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక నిర్మాణం) కు ఛైర్మన్గా మారింది. ఉగ్రవాదంపై పోరాడటానికి సృష్టించిన సంస్థకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఛైర్మన్గా మారింది. ఇది దొంగ చేతికి తాళాలు అనే సామేతను గుర్తు చేస్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్ కొత్త నటకానికి తెరలేపింది. ఉగ్రవాదాన్ని పెంచి…
Lanza-N 3D-Radar: టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), స్పానిష్ రక్షణ సంస్థ ఇంద్రాతో కలిసి భారత నావికాదళం కోసం మొట్టమొదటి 3D ఎయిర్ సర్వైలెన్స్ రాడార్ (3D-ASR) - లాంజా-N ను ప్రారంభించింది. ఈ రాడార్ను భారత నావికాదళ యుద్ధనౌకలో ఏర్పాటు చేశారు. ఇది రక్షణాయుధాల ఉత్పత్తిరంగంలో మన దేశం సాధించిన తొలి అడుగు. ఇక మన పొరుగున ఉన్న శత్రుదేశాలు పాకిస్థాన్, చైనాలకు ఇది ఓ చేదు వార్తల మిగిలిపోతుంది.