Hyderabad: పని చేస్తున్న సంస్థకే కన్నం.. ఏకంగా రూ.కోటిన్నర డైమండ్స్తో పరార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: పని చేస్తున్న సంస్థకే స్నేహితుడితో కలిసి కన్నం వేసి, డైమండ్స్ ఎత్తుకెళ్లిన ఇద్దరిని సైఫాబాద్, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. ముంబైకు చెందిన బంగారం వ్యాపారి విపుల్ షా తరుచూ హైదరాబాద్కు డైమండ్స్ , గోల్డ్ అర్నమెంట్స్ కొరియర్ లో పంపించేవాడు. అలాగే వారి ఎగ్జిక్యూటివ్స్ వాటిని తీసుకొని, హైదరాబాద్లో పలు బంగారు ఆభరణాల షాప్స్కు తిరుగుతూ… వాటిని అమ్మడం, ఆర్డర్స్ తీసుకునేవారు. ఇటీవల ముంబై నుంచి విపుల్ పార్సల్ను పంపించారు. వాటిని మార్కెటింగ్ చేయడానికి.. చడవ రోనక్ (24) ఎగ్జిక్యూటివ్ ముంబై నుంచి నగరానికి వచ్చాడు. మార్కెటింగ్ చేసిన తరువాత, డైమండ్స్, గోల్డ్ అర్నమెంట్స్ను బషీర్బాగ్లోని విజయ శంకర్ లాల్ జ్యూవెలర్స్లో భద్రపరిచారు. మరుసటి రోజు బ్యాగ్ చూడగా అందులో ఆభరణాలు కనిపించలేదు.
READ MORE: Hydra: మీ ఏరియాలో మ్యాన్హోల్ తెరిచి ఉందా..? ఈ నంబర్కి కాల్ చేయండి..
Also Read
దీంతో ఆ షాప్ యజమాని ముంబైలోని విపుల్కు సమాచారం ఇచ్చాడు. ముంబై నుంచి వచ్చిన విపుల్ కోటిన్నర విలువ చేసే డైమండ్స్, గోల్డ్ అర్నమెంట్స్ కనిపించడం లేదని.. 7వ తేదీన సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీఎస్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. ఆభరణాల బ్యాగ్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ చడవ రోనక్ తీరుపై పోలీసులకు అనుమానం కలిగింది. బ్యాగ్ పోయిందని తెలియగానే, అతని తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ముంబై వెళ్తున్నని యజమానికి చెప్పి వెళ్లడంతో పోలీసులు అతని కదలికలపై నిఘా పెట్టారు. గురువారం చడవ రోనక్ అతని స్నేహితుడు మహమ్మద్ హాసనైన్ (22) తో కలిసి పట్టుపడ్డాడు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తామే దొంగలించినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!