Pakistan: పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదం.. ఇప్పుడు ఆదేశానికే ముప్పుగా మారిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ప్రపంచ రాజకీయాలు తరచుగా ద్వంద్వ ప్రమాణాలను ప్రదర్శిస్తాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ పాకిస్థాన్. ఒకప్పుడు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే దేశంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్లో అపఖ్యాతి పాలైన పాకిస్థాన్, ఇప్పుడు SCO-RATS (ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక నిర్మాణం) కు ఛైర్మన్గా మారింది. ఉగ్రవాదంపై పోరాడటానికి సృష్టించిన సంస్థకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఛైర్మన్గా మారింది. ఇది దొంగ చేతికి తాళాలు అనే సామేతను గుర్తు చేస్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్ కొత్త నటకానికి తెరలేపింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన దేశం నేడు తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటోంది. ప్రపంచం దేశాల నుంచి సానుభూతిని పొందాలని ప్రయత్నిస్తోంది.
READ MORE: World Cup 2025: ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.. అందరూ మహిళలే!
Also Read
- Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. వైట్ హౌస్లో యూఎఫ్సీ ఫైట్ నైట్ నిర్వహించిన ట్రంప్!
- Chintamaneni Prabhakar: ఏలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. ఎమ్మెల్యే చింతమనేని హల్చల్, శ్రీనివాస్ సస్పెండ్!
- Shadi Mubarak Scam: 'షాదీ ముబారక్' పేరుతో భారీ దోపిడి.. రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులు స్వాహా.!
- Vaibhav Sooryavanshi: ఇలా అయితే కష్టమే.. మరోసారి నిరాశపరిచిన వైభవ్.!
ఇటీవలి సంవత్సరాలలో పాకిస్థాన్ తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చిత్రీకరించుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం పాకిస్థాన్ తాలిబన్ (TTP) ఆ దేశంలో దాడులను పెంచుతున్నారు. దీంతో తాము ఉగ్రవాదంలో చిక్కుకున్నామని పాక్ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. పాకిస్థాన్ కపటత్వంపై అమెరికా మాజీ రాయబారి రిచర్డ్ హోల్బ్రూక్ చెప్పిన ఓ వ్యాక్యం ఇప్పుడు గుర్తుకు వస్తోంది. “పాకిస్థాన్ ఉగ్రవాద బాధిత దేశంగా నటిస్తోంది. కానీ ఉగ్రవాదానికి స్పాన్సర్ పాకిస్థాన్ ఏ. పాక్ కుందేళ్ళతో పరిగెడుతుంది. వేటగాళ్ళతో కలిసి వేటాడుతుంది.” అని మాజీ అమెరికా రాయబారి స్పష్టం చేశారు. అంటే, పాకిస్థాన్ దృష్టిలో భారత్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే ఉగ్రవాదులు మంచివాళ్లు. పాకిస్థాన్పై దాడి చేసేవారు చెడ్డ ఉగ్రవాదలు అని చెబుతోంది.
READ MORE: Pawan Kalyan : ఇండస్ట్రీ హిట్ మూవీని మిస్ చేసుకున్న పవన్ కల్యాణ్..
పాకిస్థాన్ తనను తాను ఉగ్ర బాధిత దేశంగా ఎంత చిత్రీకరించుకున్నా.. అది పెంచి పోషించిన ఉగ్రవాద నెట్వర్క్లు భారతదేశంపై నిరంతరం దాడి చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. గతంలో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా అన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నవారు. ఇతర దేశాలను మాత్రమే కాకుండా తమను తాము కూడా ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ఉగ్రవాదం మొత్తం మానవాళికి ముప్పు అని పేర్కొన్నారు. మోడీ మాటనే నిజాలుగా మారతాయా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏది ఏమైనప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం ఉగ్ర బాధిత దేశం అని ప్రకటించుకోవడం హాస్యస్పదం. ఇదో బూటకం.
- Tags
తాజావార్తలు
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. వైట్ హౌస్లో యూఎఫ్సీ ఫైట్ నైట్ నిర్వహించిన ట్రంప్!
-
Peddi : మున్నా భయ్యాకు హ్యాండిచ్చిన ‘పెద్ది ‘… వెంకీ మామ సినిమా అయినా కలిసొచ్చేనా ?
-
CM Vijay Divorce Case: సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. ఫ్యామిలీ కోర్ట్ కీలక నిర్ణయం
-
Chintamaneni Prabhakar: ఏలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. ఎమ్మెల్యే చింతమనేని హల్చల్, శ్రీనివాస్ సస్పెండ్!
ట్రెండింగ్
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!