Pakistan: పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదం.. ఇప్పుడు ఆదేశానికే ముప్పుగా మారిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ప్రపంచ రాజకీయాలు తరచుగా ద్వంద్వ ప్రమాణాలను ప్రదర్శిస్తాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ పాకిస్థాన్. ఒకప్పుడు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే దేశంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్లో అపఖ్యాతి పాలైన పాకిస్థాన్, ఇప్పుడు SCO-RATS (ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక నిర్మాణం) కు ఛైర్మన్గా మారింది. ఉగ్రవాదంపై పోరాడటానికి సృష్టించిన సంస్థకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఛైర్మన్గా మారింది. ఇది దొంగ చేతికి తాళాలు అనే సామేతను గుర్తు చేస్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్ కొత్త నటకానికి తెరలేపింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన దేశం నేడు తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటోంది. ప్రపంచం దేశాల నుంచి సానుభూతిని పొందాలని ప్రయత్నిస్తోంది.
READ MORE: World Cup 2025: ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.. అందరూ మహిళలే!
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
ఇటీవలి సంవత్సరాలలో పాకిస్థాన్ తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చిత్రీకరించుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం పాకిస్థాన్ తాలిబన్ (TTP) ఆ దేశంలో దాడులను పెంచుతున్నారు. దీంతో తాము ఉగ్రవాదంలో చిక్కుకున్నామని పాక్ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. పాకిస్థాన్ కపటత్వంపై అమెరికా మాజీ రాయబారి రిచర్డ్ హోల్బ్రూక్ చెప్పిన ఓ వ్యాక్యం ఇప్పుడు గుర్తుకు వస్తోంది. “పాకిస్థాన్ ఉగ్రవాద బాధిత దేశంగా నటిస్తోంది. కానీ ఉగ్రవాదానికి స్పాన్సర్ పాకిస్థాన్ ఏ. పాక్ కుందేళ్ళతో పరిగెడుతుంది. వేటగాళ్ళతో కలిసి వేటాడుతుంది.” అని మాజీ అమెరికా రాయబారి స్పష్టం చేశారు. అంటే, పాకిస్థాన్ దృష్టిలో భారత్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే ఉగ్రవాదులు మంచివాళ్లు. పాకిస్థాన్పై దాడి చేసేవారు చెడ్డ ఉగ్రవాదలు అని చెబుతోంది.
READ MORE: Pawan Kalyan : ఇండస్ట్రీ హిట్ మూవీని మిస్ చేసుకున్న పవన్ కల్యాణ్..
పాకిస్థాన్ తనను తాను ఉగ్ర బాధిత దేశంగా ఎంత చిత్రీకరించుకున్నా.. అది పెంచి పోషించిన ఉగ్రవాద నెట్వర్క్లు భారతదేశంపై నిరంతరం దాడి చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. గతంలో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా అన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నవారు. ఇతర దేశాలను మాత్రమే కాకుండా తమను తాము కూడా ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ఉగ్రవాదం మొత్తం మానవాళికి ముప్పు అని పేర్కొన్నారు. మోడీ మాటనే నిజాలుగా మారతాయా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏది ఏమైనప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం ఉగ్ర బాధిత దేశం అని ప్రకటించుకోవడం హాస్యస్పదం. ఇదో బూటకం.
- Tags
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!