Adireddy Vasu: మెడికల్ కాలేజీల వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఘాటుగా విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ అన్నట్లుగా రాజమండ్రి మెడికల్ కాలేజీ చూసి ఆహా అనలేమని.. రాజమండ్రిలో ఓహో అనిపించేలా వైసీపీ పార్టీ కార్యాలయం మాత్రం కట్టుకున్నారని ఆరోపించారు. గత జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని రూ. 5 వేల కోట్లు అప్పు చేసిందని, ఆ నిధులు ఎటు దారి మళ్లించాలో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణకు పీపీపీకి మధ్య…
Vijayawada: విజయవాడ BRTS రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫుడ్ జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యూట్యూబర్లతో కలిసి రీల్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించని యువకులను మందలిస్తున్నట్టు వీడియోలు చేస్తున్న క్రమంలో ఓ సీఐ బూతులు తిట్టారు. దీంతో యువకులు పోలీసులకు ఎదురు తిరిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి మిగతా వాహనదారులు మద్దతుగా నిలిచారు. దీంతో అదనపు సిబ్బందిని ఘటన స్థలానికి రప్పించారు పోలీసులు.. ఈ ఘటనపై సీఐ కిషోర్ యువకులకు క్షమాపణలు చెప్పారు. మద్యం సేవించి ఉన్నామంటూ…
Janasena: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశానుసారం మచిలీపట్నంలో చోటు చేసుకున్న పరిణామంపై అంతర్గత విచారణ ప్రారంభించనున్నట్లు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్, ఏపీ ఎం.ఎస్.ఐ.డి.సి. ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస రావు, మచిలీపట్నం జనసేన నాయకుడు వికృతి శ్రీనివాస్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణతోనూ మాట్లాడి […]
CM Chandrababu: టీటీడీ భక్తులకు సీఎం గుడ్న్యూస్ చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మిస్తున్నారు. నూతన బస్స్టాండ్ అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
Tomato Farmers in Crisis: ఆరుగాలం కష్టపడి లక్షల రూపాయల ఖర్చు చేసి టమాటా సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు.. ప్రస్తుతం ఏపీలో టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే టైంలో గిట్టుబాటు ధరలు లభించక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమోటా ధర దారుణంగా పడిపోయింది.
Nadendla Manohar: దేశ రాజకీయాలలో మార్పు తీసుకురావాలనేది జనసేన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేశామని తెలిపారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కులాలను కలపాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ దని.. జనసేన కమిట్మెంట్ తో పనిచేస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్ అవలంబిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. గతంలో వైసీపీ చేసిన అరాచక పాలన ఎవరూ మర్చిపోయారని.. అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన తీరు ఎవరూ మర్చిపోరన్నారు.
India vs Pakistan: ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో భారత్ పాకిస్థాన్తో క్రమంగా అన్ని సంబంధాలను తెంచుకుంది. కానీ.. తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్ను రద్దు చేయాలంటూ.. ఆదివారం శివసేన (UBT) మహారాష్ట్ర అంతటా వీధి నిరసనలు నిర్వహించింది. ఇది దేశ ప్రజల మనోభావాలను అవమానించడమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిరసనల్లో భాగంగా ముంబైలో యూబీటీ ప్రతినిధి ఆనంద్ దూబే..…
India vs China: నేడు భారత్, చైనా మహిళల ఆసియా కప్ హాకీ 2025 ఫైనల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చైనాలోని హాంగ్జౌలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు వచ్చే ఏడాది ఆగస్టు 14 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్లో జరగనున్న మహిళల హాకీ ప్రపంచ కప్కు నేరుగా ప్రవేశం పొందుతుంది. కాగా.. ఈ మ్యాచ్లో భారత్కు షాక్ తగిలింది. భారత జట్టు అనుభవజ్ఞులైన గోల్ కీపర్ సవితా పూనియా, డ్రాగ్ ఫ్లికర్ దీపికా జూనియర్ లేకుండానే బరిలోకి దిగనుంది. ఈ…
Asaduddin Owaisi: ఆసియా కప్లో భాగంగా ఆదివారం రాత్రి జరగనున్న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్పై రాజకీయ, సామాజిక వివాదం ముదురుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించిన నేపథ్యంలో ఈ మ్యాచ్ను బహిష్కరించాలని ప్రతిపక్షాలు, బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏఐఎంఐఎం చీఫ్, లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఓ మీడియా సంస్థతో ఒవైసీ మాట్లాడుతూ..
Osama Bin Laden: పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సన్నిహితుడు, అధికార ప్రతినిధి ఫర్హాతుల్లా బాబర్ తాను రాసిన కొత్త పుస్తకం ‘‘ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బీ టోల్డ్’’లో సంచలన విషయాలను పేర్కొన్నారు. అల్ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను తమ భూభాగంపై.. అదీ తమకు తెలియకుండా అమెరికా బలగాలు రహస్యంగా మట్టుబెట్టడం పాకిస్థాన్ నేతలను తీవ్ర అవమానానికి, అయోమయానికి గురిచేసిందని రాసుకొచ్చాడు.. అప్పటి 2011లో అబోటాబాద్లో లాడెన్ హత్యానంతరం స్థానికంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను వివరించారు.…