Aarogyasri: రాష్ట్రంలోని దవాఖానల్లో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా యాజమాన్యాలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి సేవలు నిలిపివేశాయి. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించపోవడంతో రూ.1400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని యూనియన్ నాయకులు పేర్కొన్నారు.
ITR Filing Extension: ట్యాక్స్ పేయర్స్కి గుడ్న్యూస్ వచ్చింది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ మరో రోజు పొడిగించింది. నిన్నటితో చివరితేదీ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా సెప్టెంబర్ 16న ITR దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఈ సమాచారాన్ని అందించింది. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యల కారణంగా కొందరు రిటర్న్లను దాఖలు చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారని, అందుకోసమే ఈ…
Hair Fall: జుట్టు రాలడం చాలామంది ప్రధాన సమస్యగా మారుతోంది. జుట్టు అందంగా, పొడుగ్గా పెరగాలని కోరుకునే ప్రతి అమ్మాయి కలను ఈ జుట్టు రాలడం అనే సమస్య చిదిమేస్తూ ఉంటుంది. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, జుట్టుకు వాడే ఉత్పత్తులు, మానసిక ఒత్తిడి, తలస్నానానికి వాడే నీరు.. ఇలా చాలా విషయాలు జుట్టు రాలడానికి కారణం అవుతాయి. అయితే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దానికి కారణం.. హ్యాండ్షేక్. ఎందుకంటే టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సల్మాన్ అలీ అఘాతో కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా.. శివం దుబేతో కలిసి కెప్టెన్ సూర్య పాకిస్థాన్ జట్టును పట్టించుకోలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 'హ్యాండ్ షేక్ వివాదం' అంశాన్ని ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ముందు లేవనెత్తింది.
PM Modi: సిగరెట్, పొగాకు, బీడీలపై కేంద్రం నిర్ణయించిన జీఎస్టీలను విమర్శిస్తూ.. కాంగ్రెస్ పెట్టిన పోస్టు వివాదానికి దారి తీసింది. బీడీ, బిహార్ ‘బి’తోనే మొదలవుతాయని పేర్కొనడంపై ఇప్పటికే బీజేపీ మండిపడింది. తాజాగా బీడీ-బీహార్ వివాదంపై కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)పై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం విమర్శలు గుప్పించారు. పూర్ణియా విమానాశ్రయంలో తాత్కాలిక టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థా;ఉనలు చేశారు. పూర్ణియాలో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఓవైపు.. బీహార్ పురోగతి సాధిస్తుంటే.. మరోవైపు రాష్ట్రాన్ని అవమానించడంలో…
Supreme Court: చికిత్స తర్వాత రోగి కోలుకోకపోయినా లేదా మరణిస్తే వైద్యుడు బాధ్యత వహించలేడని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రసవం అనంతరం ఓ మహిళ మరణానికి వైద్యుడే(గైనకాలజిస్ట్) బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో విచారణ సందర్భంగా, జస్టిస్ సంజయ్ కుమార్, సతీష్ చంద్రలతో కూడిన ధర్మాసనం.. సంచలన వ్యాఖ్యలు చేసింది. శస్త్రచికిత్స విజయవంతం కాకపోతే లేదా ఆశించిన ఫలితం సాధించకపోతే ఆ వైద్యుడిని నిందించడం సరికాదని పేర్కొంది. ఏ వివేకవంతమైన ప్రొఫెషనల్ వైద్యుడు ఉద్దేశపూర్వకంగా […]
Rising Political Violence Among U.S. Youth: అమెరికన్ యువతలో కోపం పెరుగుతుందా? ఆ దేశంలో రాజకీయ హత్యలు పెరుగుతన్నాయా? ప్రస్తుతం ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి, గత వారం డొనాల్డ్ ట్రంప్కు దగ్గరగా ఉన్న మితవాద నాయకుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యాడు. హంతకుడు టైలర్ రాబిన్సన్ 22 ఏళ్ల యువకుడు. రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో ట్రంప్ మిత్రుడైన చార్లీ కిర్క్ వ్యవహార శైలి అతడికి నచ్చలేదు. అందుకే హత్య చేసినట్లు తెలుస్తోంది. యూఎస్లో ఇదొక్కటే కాదు..…
CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మత మార్పిడులపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వివాదం చెలరేగింది. హిందూ సమాజంలో సమానత్వం ఉంటే, ఎవరైనా ఎందుకు మతం మారుతారు? అని ఆయన అన్నారు. సమానత్వం ఉంటే, అంటరానితనం ఎందుకు వచ్చింది? మనం అంటరానితనాన్ని సృష్టించామా? అని ప్రశ్నించారు. ఇస్లాం, క్రైస్తవ మతం లేదా ఏ మతంలోనైనా అసమానతలు ఉండవచ్చని.. తాము లేదా బీజేపీ ఎవరినీ మతం మారమని అడగలేదన్నారు. కానీ ప్రజలు మతం మారుతున్నారని.. అది వారి హక్కు అన్నారు.
Country With Zero Muslim Population: భారత్ మతపరంగా అత్యంత వైవిధ్య భరిత దేశం. పురాతన హిందూ మతం, ఆధునిక భావాలతో స్థానికంగా పుట్టిన బౌద్ధం, జైనంతోపాటు వలసలతో వచ్చిన ఇస్లాం, క్రైస్తవం సహా అనేక ఇతర మతాలు ఇక్కడ ఉన్నాయి. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు మతాల ద్వారానే మనుగడలోకి వచ్చి విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఫలితంగా భారతీయుల దైనందిన జీవితంలో మతం, మత నియమాలు ప్రధాన భాగాలుగా మారిపోయాయి. భిన్నత్వంలో ఏకత్వానికి సూచికగా, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది […]
Mauritius: భారత ప్రధాని నరేంద్ర మోడీ, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్గూలం ఇటీవల వారణాసిలో ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహించారు. విదేశీ వ్యవహారాల శాఖ, ఇతర పారిశ్రామిక సమాఖ్యలతో కలిసి ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన మారిషన్ ఇండియా వ్యాపార సదస్సు (బిజినెస్ కాంక్లేవ్)లో ఆ దేశ ప్రధాని పాల్గోన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి మారిషస్ నాయకుడిని ఆహ్వానించడం తనకు గర్వకారణమని మోడీ అన్నారు. "శతాబ్దాలుగా కాశీ భారతదేశ నాగరికత, సంస్కృతికి ప్రతీకగా…