Nadendla Manohar: జనసేన పార్టీ, పవన్ కల్యాణ్పై కుట్రలు.. రెచ్చగొట్టే పోస్టులపై మంత్రి ఫైర్..!
Nadendla Manohar: దేశ రాజకీయాలలో మార్పు తీసుకురావాలనేది జనసేన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేశామని తెలిపారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కులాలను కలపాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ దని.. జనసేన కమిట్మెంట్ తో పనిచేస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్ అవలంబిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. గతంలో వైసీపీ చేసిన అరాచక పాలన ఎవరూ మర్చిపోయారని.. అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన తీరు ఎవరూ మర్చిపోరన్నారు. పచ్చటి కోనసీమలో ఘర్షణ వాతావరణం వద్దని ధైర్యంగా నిలబడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనసేనను రెచ్చగొట్టేలా వైసీపీ ప్రవర్తిస్తుందని చెప్పారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను డోర్ డెలివరీ చేసినప్పుడు మీ ఫోన్ కాల్ రాలేదే? డాక్టర్ సుధాకర్ ను వేధించినప్పుడు జగన్ ఫోన్ కాల్ ఏది? అని ప్రశ్నించారు. ఇప్పుడు మేం అధికారంలోకి వచ్చినప్పుడు మీ సంగతి చూస్తామంటారా? వైసీపీ చేస్తున్న కుళ్లు, రాజకీయాలు, కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
Also Read
- Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
- Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
“ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ బెదిరిస్తున్నారు. తెనాలికి వచ్చి గంజాయి బ్యాచ్ ను పరామర్శించారు. పిఠాపురంలో కూడా అదే చేశారు. మేం చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తాం. వైసీపీ కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టాలి. శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. దీని వెనుక కుట్ర ఉంది. కుటుంబంలో కలహాలు పెట్టేవిధంగా జగన్ రాజకీయాలు చేస్తున్నారు. ఒక్క జగన్ మాత్రమే ఇలాంటి రాజకీయాలు చెయ్యగలరు. సోషల్ మీడియాలో రాజకీయ కోణంలో మహిళలపై దుష్ప్రచారం చేస్తున్నారు. జనసేన ఓట్లకోసం రాజకీయాలు ఎప్పుడూ చెయ్యదు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం. మూడు పార్టీలు కలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పవన్ సంతోష్ ఆలోచించారు.
సమాజంలో చీలికలు తెచ్చేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. సమాజంలో చీలికలు తెచ్చేవారిని చట్టం ముందు నిలబెడదాం. చట్టం ముందు అందరూ సమానమే. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలి.” అని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!