Nadendla Manohar: జనసేన పార్టీ, పవన్ కల్యాణ్పై కుట్రలు.. రెచ్చగొట్టే పోస్టులపై మంత్రి ఫైర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: దేశ రాజకీయాలలో మార్పు తీసుకురావాలనేది జనసేన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేశామని తెలిపారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కులాలను కలపాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ దని.. జనసేన కమిట్మెంట్ తో పనిచేస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్ అవలంబిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. గతంలో వైసీపీ చేసిన అరాచక పాలన ఎవరూ మర్చిపోయారని.. అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన తీరు ఎవరూ మర్చిపోరన్నారు. పచ్చటి కోనసీమలో ఘర్షణ వాతావరణం వద్దని ధైర్యంగా నిలబడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనసేనను రెచ్చగొట్టేలా వైసీపీ ప్రవర్తిస్తుందని చెప్పారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను డోర్ డెలివరీ చేసినప్పుడు మీ ఫోన్ కాల్ రాలేదే? డాక్టర్ సుధాకర్ ను వేధించినప్పుడు జగన్ ఫోన్ కాల్ ఏది? అని ప్రశ్నించారు. ఇప్పుడు మేం అధికారంలోకి వచ్చినప్పుడు మీ సంగతి చూస్తామంటారా? వైసీపీ చేస్తున్న కుళ్లు, రాజకీయాలు, కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
“ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ బెదిరిస్తున్నారు. తెనాలికి వచ్చి గంజాయి బ్యాచ్ ను పరామర్శించారు. పిఠాపురంలో కూడా అదే చేశారు. మేం చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తాం. వైసీపీ కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టాలి. శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. దీని వెనుక కుట్ర ఉంది. కుటుంబంలో కలహాలు పెట్టేవిధంగా జగన్ రాజకీయాలు చేస్తున్నారు. ఒక్క జగన్ మాత్రమే ఇలాంటి రాజకీయాలు చెయ్యగలరు. సోషల్ మీడియాలో రాజకీయ కోణంలో మహిళలపై దుష్ప్రచారం చేస్తున్నారు. జనసేన ఓట్లకోసం రాజకీయాలు ఎప్పుడూ చెయ్యదు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం. మూడు పార్టీలు కలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పవన్ సంతోష్ ఆలోచించారు.
సమాజంలో చీలికలు తెచ్చేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. సమాజంలో చీలికలు తెచ్చేవారిని చట్టం ముందు నిలబెడదాం. చట్టం ముందు అందరూ సమానమే. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలి.” అని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!