Asaduddin Owaisi: భారత్- పాకిస్థాన్ మ్యాచ్పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఆసియా కప్లో భాగంగా ఆదివారం రాత్రి జరగనున్న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్పై రాజకీయ, సామాజిక వివాదం ముదురుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించిన నేపథ్యంలో ఈ మ్యాచ్ను బహిష్కరించాలని ప్రతిపక్షాలు, బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏఐఎంఐఎం చీఫ్, లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఓ మీడియా సంస్థతో ఒవైసీ మాట్లాడుతూ.. పహల్గాం దాడి తర్వాత పాక్తో మ్యాచ్ ఎలా ఆడుతారని ప్రశ్నించారు. మతాన్ని అడిగి మరీ 26 మందిని దారుణంగా కాల్చి చంపారని గుర్తు చేశారు.. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన మోడీ మాటలను గుర్తు చేశారు.. క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో చెప్పాలని నిలదీశారు. 26 మంది పౌరుల ప్రాణాల కంటే డబ్బే ఎక్కువ విలువైందా? అని ప్రశ్నించారు. దీనికి కేంద్రంలోని బీజేపీ సమాధానం చెప్పాలని.. పాకిస్థాన్తో అన్ని సంబంధాలు తెంచుకున్నప్పుడు.. నీటి ఒప్పందాలు కూడా రద్దు చేసుకున్నప్పుడు మ్యాచ్ మాత్రం ఎందుకు ఆడుతున్నారన్నారు. పహల్గాం బాధితులకు మోడీ ఏం సమాధానం చెబుతారు? అని అడిగారు.
READ MORE: Social Media Reels Addiction: రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు మీతోనే!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
మరోవైపు.. ఇటీవల వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో టీమ్ఇండియా లెజెండ్స్ పాకిస్థాన్తో రెండుసార్లు మ్యాచ్ను బాయ్కాట్ చేశారు. దీంతో టీమ్ఇండియా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆసియా కప్లోనూ పాక్తో మ్యాచ్ను టీమ్ఇండియా బాయ్కాట్ చేస్తుందని అనుకున్నారంతా. కానీ వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్షిప్ అనేది ఓ ప్రైవేటు ఈవెంట్, ఆసియా కప్ మాత్రం అలా కాదు. దీనిని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ జూలైలో షెడ్యూల్ ప్రకటించేసింది. అయితే ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకే పాక్తో భారత్ ఆడుతుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. మల్టీనేషనల్ టోర్నీల్లో ఆడినప్పటికీ, ద్వైపాక్షిక సిరీస్లో నిషేధం కొనసాగుతుందని చెప్పింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!