APJ Abdul Kalam: ఇఫ్తార్ విందు వద్దన్న కలాం.. ఆ డబ్బుతో ఏం చేశారో తెలుసా? మాజీ సెక్రటరీ చెప్పిన సీక్రెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APJ Abdul Kalam: మిసైల్ మ్యాన్గా, భారత రాష్ట్రపతిగా అంతకు మించి ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన వెళ్లిపోయినా, ఆయన తాలూకు స్ఫూర్తి మాత్రం చిరకాలం నిలిచిపోతుంది. శాస్త్రవేత్తగా మన దేశానికి అందించిన విజ్ఞానం అపారం. అందుకే ఆయనను భారతరత్న కూడా వరించింది. 2015లో జులై 27న ఆయన ఈ లోకం వదిలి వెళ్లిపోయారు. ఈ రోజు ఆయన జయంతి. అబ్దుల్ కలా జీవితంలోని ఓ కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అబ్దుల్ కలాం అక్టోబర్ 15, 1931న తమిళనాడు రామేశ్వరంలోని పంబన్ ద్వీపంలో తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జైనులాబ్దీన్ మారకయ్యర్ ఒక ఓడరేవు మాలికుడు. స్థానిక మసీదు ఇమామ్గా పని చేశాడు. తల్లి అషియమ్మ గృహిణి. ఆయన కుటుంబం మరకయ్యర్ వర్గానికి చెందినది.
READ MORE: PM Modi Tour Schedule: రేపు ఏపీకి ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
అయితే.. కలాం సెక్రటరీ నాయర్ అబ్దుల్ కలాం గురించి ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి పంచుకున్నారు. ఇఫ్తార్ విందును అబ్దుల్ కలాం ఎందుకు వద్దనుకున్నారో తెలిపారు. 2002 నవంబర్లో ఒకసారి కలాం తనను పిలిచి ఇఫ్తార్ విందు ఎందుకు నిర్వహించాలో చెప్పమని అడిగారట. ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చవుతుందో లెక్కలేయించారట. సుమారు రూ. 25 లక్షలు అవుతుందని నాయర్ చెప్పారట. ఇఫ్తార్ విందుకు బదులుగా మనం ఈ డబ్బును అనాథాశ్రమనికి ఎందుకు ఇవ్వకూడదు? అని కలా అడిగారట. ఈ డబ్బు వృథా కాకుండా చూడమని తనకు చెప్పినట్లు నాయర్ వెల్లడించారు. రాష్ట్రపతిభవన్ నుంచి పిండి వంటలు, పప్పులు, దుప్పట్లు, స్వెట్టర్లను 28 అనాథాశ్రమాలకు పంపించారు. ఇది ఇక్కడితో ఆగలేదని.. ఇప్పటి వరకు దానం చేసిన డబ్బు ప్రభుత్వానిదని.. తన సొంత డబ్బు నుంచి లక్ష రూపాయలు తీసి ఇచ్చారట. ఈ లక్షను కూడా ఇలాగే అనాథ పిల్లల కోసం ఖర్చు పెట్టండని కోరినట్లు నాయర్ తెలిపారు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అని అబ్దు్ల్ కలాం చెప్పినట్లు నాయర్ వివరించారు.
తాజావార్తలు
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!