Secunderabad: కోచ్ వేధింపులతో విద్యార్థిని బలి.. కీచక కోచ్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad: ప్రేమ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనను ప్రేమించమంటూ వెంటపడి, వేధించి, చివరకు యువతి మృతికి కారణమైన వాలీబాల్ కోచ్ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్ కోచ్ పారిపోయాడు. పరారీలో ఉన్న కోచ్కు సంబంధించిన పక్కా సమాచారం రావడంతో రైళ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అంబాజీ నాయక్. వాలీబాల్ కోచ్గా పని చేస్తున్నాడు. ఇతని ప్రేమ వేధింపుల కారణంగా.. సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్యే డిగ్రీ కాలేజీలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న మౌనిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది..
READ MORE: Fake Notes: కామారెడ్డిలో తీగలాగితే.. బీహార్లో దొరికిన దొంగనోట్ల ముఠా
Also Read
కాలేజీ నుంచి ఆమె సోదరుడు ఇంటికి తీసుకొని వచ్చిన.. అరగంటకే ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమనాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. మరుసటి రోజు పోస్టుమార్టం పూర్తయిన తరువాత మౌనిక, స్నేహితులు కొన్ని విషయాలను కుటుంబసభ్యులకు తెలిపారు. ప్రేమ పేరుతో కొత్తగా వచ్చిన వాలీబాల్ కోచ్ అంబాజీనాయక్, వేధింపులకు గురి చేస్తున్నాడని మౌనిక తండ్రి ప్రమోద్, తల్లి హరితలకు చెప్పారు. దీంతో మౌనిక మృతికి ప్రేమ పేరుతో వేధింపులే కారణమని, వాలీబాల్ కోచ్ అంబాజీనాయక్ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన మౌనిక ఆత్మహత్య చేసుకుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మౌనిక ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్ కోచ్ అంబాజీ నాయక్ పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంబాజీ స్వగ్రామానికి పోలీసులు వెళ్లి అతని వివరాలు ఆరా తీశారు.
READ MORE: Juice: జ్యూస్ తాగి 15 గంటల పాటు నిద్రపోయిన పలువురు వ్యక్తులు.. ఆ ముస్లిం యువకుడు ఎవరు?
నిజామాబాద్ నుంచి అంబాజీ తిరుపతికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతిలో ఓ అడ్వకేట్ను సంప్రదించి.. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినట్లుగా గుర్తించారు. తిరుపతి నుంచి తిరిగి వెళ్తుండగా.. పక్కా సమచారంతో అంబాజీని ట్రైన్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కచి నుండి నేరుగా లాలాగూడా పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి విచారిస్తున్నారు. మౌనికను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశారంటూ ఆమె తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుపై అంబాజీని విచారిస్తున్నారు పోలీసులు. అంబాజీ నాయక్.. సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ ఫోన్లో ఉన్నడేటాను డిలీట్ చేసినట్లుగా భావిస్తున్నారు. మౌనికతో జరిపిన చాటింగ్ మొత్తాన్ని అంబాజీ తన ఫోన్లో డిలీట్ చేశాడని గుర్తించారు. దీంతో డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఫోన్ డేటా ఈ కేసులో కీలకంగా మారనుంది. అంబాజీ, మౌనికను ఎలా వేధింపులకు గురి చేశాడో పక్కా ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!