Secunderabad: కోచ్ వేధింపులతో విద్యార్థిని బలి.. కీచక కోచ్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad: ప్రేమ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనను ప్రేమించమంటూ వెంటపడి, వేధించి, చివరకు యువతి మృతికి కారణమైన వాలీబాల్ కోచ్ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్ కోచ్ పారిపోయాడు. పరారీలో ఉన్న కోచ్కు సంబంధించిన పక్కా సమాచారం రావడంతో రైళ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అంబాజీ నాయక్. వాలీబాల్ కోచ్గా పని చేస్తున్నాడు. ఇతని ప్రేమ వేధింపుల కారణంగా.. సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్యే డిగ్రీ కాలేజీలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న మౌనిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది..
READ MORE: Fake Notes: కామారెడ్డిలో తీగలాగితే.. బీహార్లో దొరికిన దొంగనోట్ల ముఠా
Also Read
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
కాలేజీ నుంచి ఆమె సోదరుడు ఇంటికి తీసుకొని వచ్చిన.. అరగంటకే ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమనాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. మరుసటి రోజు పోస్టుమార్టం పూర్తయిన తరువాత మౌనిక, స్నేహితులు కొన్ని విషయాలను కుటుంబసభ్యులకు తెలిపారు. ప్రేమ పేరుతో కొత్తగా వచ్చిన వాలీబాల్ కోచ్ అంబాజీనాయక్, వేధింపులకు గురి చేస్తున్నాడని మౌనిక తండ్రి ప్రమోద్, తల్లి హరితలకు చెప్పారు. దీంతో మౌనిక మృతికి ప్రేమ పేరుతో వేధింపులే కారణమని, వాలీబాల్ కోచ్ అంబాజీనాయక్ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన మౌనిక ఆత్మహత్య చేసుకుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మౌనిక ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్ కోచ్ అంబాజీ నాయక్ పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంబాజీ స్వగ్రామానికి పోలీసులు వెళ్లి అతని వివరాలు ఆరా తీశారు.
READ MORE: Juice: జ్యూస్ తాగి 15 గంటల పాటు నిద్రపోయిన పలువురు వ్యక్తులు.. ఆ ముస్లిం యువకుడు ఎవరు?
నిజామాబాద్ నుంచి అంబాజీ తిరుపతికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతిలో ఓ అడ్వకేట్ను సంప్రదించి.. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినట్లుగా గుర్తించారు. తిరుపతి నుంచి తిరిగి వెళ్తుండగా.. పక్కా సమచారంతో అంబాజీని ట్రైన్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కచి నుండి నేరుగా లాలాగూడా పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి విచారిస్తున్నారు. మౌనికను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశారంటూ ఆమె తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుపై అంబాజీని విచారిస్తున్నారు పోలీసులు. అంబాజీ నాయక్.. సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ ఫోన్లో ఉన్నడేటాను డిలీట్ చేసినట్లుగా భావిస్తున్నారు. మౌనికతో జరిపిన చాటింగ్ మొత్తాన్ని అంబాజీ తన ఫోన్లో డిలీట్ చేశాడని గుర్తించారు. దీంతో డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఫోన్ డేటా ఈ కేసులో కీలకంగా మారనుంది. అంబాజీ, మౌనికను ఎలా వేధింపులకు గురి చేశాడో పక్కా ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..