Gudivada Amarnath: గూగుల్ డేటా సెంటర్లపై వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా లోకేష్ వ్యక్తిగత విమర్శలు చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన నన్ను గుడ్డు అంటారు.. నేను పప్పు అంటాను. ఈ వ్యక్తిగత వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఉండదని తెలిపారు.. ఏపీలో గూగుల్ రాకను తాము స్వాగతిస్తుమన్నానిచెబితే కూటమి అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రైడన్ 1గిగా వాట్ డేటా సెంటర్ వల్ల 200మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారని గుర్తు చేశారు...
Khawaja Asif: భారత్పై ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్ తాజాగా మితిమీరిన ప్రకటనలు చేస్తోంది. ఓ వైపు ఆఫ్ఘనిస్థాన్ దాడులను ఎదుర్కొనేందుకు సత్తాలేని పాక్.. భారతదేశంపై యుద్ధానికి సిద్ధమంటూ వివాదాస్పద ప్రకటన చేసింది. తాజాగా ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆఫ్ఘన్పై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాలిబన్లకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమని.. అవసరమైతే భారతదేశంపై దాడులు చేస్తామని చెప్పాడు. పాకిస్థాన్ రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉందని అన్నారు.
Fake Liquor Lab Report: ములకలచెరువు నకిలీ మద్యానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు వెలువడింది. జనార్దన్ తయారు చేసిన నకిలీ మద్యం నాణ్యత లేనిదని రిపోర్టులో తేలింది. 45 నమూనాలపై పరీక్షలు చేసిన కాకినాడ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. స్త్రెంత్ ప్రమాణాలు పాటించకుండా మద్యం తయారు చేసినట్లు తేలింది. 25 ఉండాల్సిన అండర్ ప్రూఫ్ (యూపీ) 35గా నమోదైంది. 75 ఉండాల్సిన ఓవర్ ప్రూఫ్ 65గా ల్యాబ్ రిపోర్టులో తేలింది. ప్రమాణాలకు విరుద్ధంగా మద్యం తయారు చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. నకిలీ మద్యంలో నాణ్యత…
Gujarat cabinet: గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా వారంతా పదవిని వీడారు. అయితే.. గుజరాత్ ప్రభుత్వం ఈరోజు ఉదయం 11:30 గంటలకు మంత్రి వర్గాన్ని విస్తరించనుంది. కొత్త మంత్రివర్గంలో 15 మంది కొత్త వ్యక్తులు సహా 25 మంది సభ్యులు ఉంటారని చెబుతున్నారు. తాజాగా రాజీనామా చేసిన మంత్రుల్లో కొందరు కొత్త లిస్ట్లో చేరే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా […]
Kumuram Bheem Asifabad: భార్య మీద కోపంతో అత్తింటికి నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి... ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లా పటార్లో చోటు చేసుకుంది. ఎల్లాపటార్కు చెందిన షమాబీకి జైనూర్ మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్తో 9 నెలల కిందట వివాహం జరిగింది. తనకు పెళ్లి ఇష్టం లేదంటూ ముజాహిద్.. షమాబీతో తరుచూ గొడవ పడేవాడు. తాజాగా ఎల్లాపాటార్ వచ్చి మళ్ళీ భార్యతో గొడవపెట్టుకున్నాడు.. గొడవ ఒక్కసారిగా పెరిగింది. దీంతో అత్తింట్లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్…
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1లో డిమాండ్ చేసింది. గతేడాది జూలై-ఆగస్టులో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా 1,400 మంది మరణించారు. ఈ మరణాలను హత్యలుగా అభివర్ణించింది తాత్కాలిక ప్రభుత్వం.. హత్యలకు గాను హసీనాకు "1,400 మరణశిక్షలు" విధించాలని తాత్కాలిక ప్రభుత్వ న్యాయవాది ICT-1లో వాదించారు. గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సి వచ్చిన షేక్ హసీనా ప్రస్తుతం…
Hyderabad Fake Honey: తేనె తింటున్నారా అయితే జాగ్రత్త. నగరంలో కల్తీ తేనె తయారు చేస్తూ విక్రయిస్తున్న కేటుగాళ్లు ఎంతోమంది తయారయ్యారు. వాళ్ళనుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నగర పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా తేనే తయారీ చేస్తూ పట్టుబడ్డారు కేటుగాళ్లు. దీనిలో బెల్లం కలిపి తయారు చేసి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా నగర్ బ్లాక్ వద్ద వంద […]
Guntur Rape Case: గుంటూరు పరిధికి సంబంధించి రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. సత్రగంజ్- చర్లపల్లి రైలులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. రెండ్రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం సికింద్రాబాద్ లో కేసు నమోదైంది. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు రైల్వే పోలీసులు.. మహిళ వద్ద నుంచి దొంగిలించిన బ్యాగ్ లోని సెల్…
MLC Nagababu: జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ను పరిశీలించారు. వర్షం పడితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు రావడంతో పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నీటి మునక ఇష్యూ 20 ఏళ్లుగా ఉందని తెలిపారు. నేటికీ సొల్యూషన్ దొరకలేదన్నారు. ఈ సమస్యపై కౌన్సిల్లో మంత్రులను అడిగానన్నారు. రోజుకి 60 వేల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. బస్టాండ్ లో వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. బస్టాండ్ ఎత్తు పెంచాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్…
PM Modi Srisailam Visit: ప్రధాని మోడీ శ్రీశైలం పర్యటన కొనసాగుతోంది. తాజాగా ప్రధాని శ్రీశైలానికి చేరుకున్నారు. తొలిసారి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు.. ఆలయం వద్ద సీఎం డిప్యూటీ సీఎం, శివసేవకులు, కూటమి కార్యకర్తలు, బీజేపీ అభిమానులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.