Gudivada Amarnath: గూగుల్కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే లక్ష 80 వేలు ఉద్యోగులు.. ఏపీలో రెండు లక్షలు ఎలా ఇస్తారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: గూగుల్ డేటా సెంటర్లపై వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా లోకేష్ వ్యక్తిగత విమర్శలు చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన నన్ను గుడ్డు అంటారు.. నేను పప్పు అంటాను. ఈ వ్యక్తిగత వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఉండదని తెలిపారు.. ఏపీలో గూగుల్ రాకను తాము స్వాగతిస్తుమన్నానిచెబితే కూటమి అనుకూల
మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రైడన్ 1గిగా వాట్ డేటా సెంటర్ వల్ల 200మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారని గుర్తు చేశారు…
READ MORE: Preeti Reddy: మేడం సార్.. మేడం అంతే.. డాన్స్ తో అదరగొట్టిన మల్లారెడ్డి కోడలు.!
Also Read
- UK: తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో బర్న్హామ్! భారత్కు లాభమా? నష్టమా?
- 120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
- CM Revanth Reddy: రాజ్నాథ్ సింగ్తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
- Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
గూగుల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులే లక్ష 80 వేలు అయితే ఒక్క వైజాగ్ డేటా సెంటర్ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. లక్ష 88 వేల ఉద్యోగాలు వస్తాయని గూగుల్ ప్రకటిస్తే ఒక విశాఖ వ్యక్తిగా లోకేష్కు తాను సన్మానం చేస్తానని తెలిపారు.. డేటా సెంటర్లకు పునాదులు వేసింది వైసీపీ ప్రభుత్వమని మాజీ మంత్రి పేర్కొన్నారు.. ఉద్యోగాలపై క్లారిటీ అడిగితే ట్రోలింగ్ గురించి మాట్లాడతారని.. అసలు ట్రోలింగ్ కు పితామహుడు లోకేష్ అని వ్యాఖ్యానించారు.
“అమెరికాలోని ఎల్ పాసాలో మెటా నిర్మిస్తున్న డేటా సెంటర్ వల్ల 100 – 150 మందికి ఉద్యోగులు వస్తాయి.. డేటా సెంటర్కు నిర్మాణ సమయంలో అవసరం అయ్యే మానవ వనరులు 5 వేల లోపే ఉంటాయి. వచ్చే రెండు వందల ఉద్యోగాలకు మీరు చెబుతున్న రెండు లక్షల ఉద్యోగాల ప్రచారానికి మధ్య 950శాతం వ్యత్యాసం ఉంది. ఉద్యోగాల కల్పనపై కూటమి చేస్తున్న ప్రచారాలపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలనేది మా డిమాండ్.. డేటా సెంటర్ల చుట్టూ ఐటీ ఎకో సిస్టం అభివృద్ధి చెందినట్టు స్టడీ ఏదైన ఉంటే బయట పెట్టండి. డేటా సెంటర్ల మీద ప్రచారం చేసుకోండి కానీ ప్రజలనే మోసం చేయవద్దు. లోకేష్ లా నా తండ్రి ముఖ్యమంత్రి కాదు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం చేసి కష్టపడి రాజకీయంగా ఎదిగాను.. వ్యక్తిగత చరిత్రలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు గురించి మాట్లాడండి..” అని మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Allu Arjun : సంధ్య థియేటర్ కేసు విచారణలో ట్విస్ట్.. హాజరైన అల్లు అర్జున్
-
UK: తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో బర్న్హామ్! భారత్కు లాభమా? నష్టమా?
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి సినిమా పేరుతో భారీ మోసం.. నిర్మాతల సంచలన ప్రకటన!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!