Bihar: నేడు మంత్రి వర్గం రద్దు.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 243 మంది సభ్యులు గల అసెంబ్లీలో 202 స్థానాలను గెలుచుకుని, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అఖండ మెజారిటీని సాధించింది. నూతన ప్రభుత్వం, మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఏ పార్టీల మధ్య ఢిల్లీ, పాట్నాలో సమావేశాలు జరుగుతున్నాయి. ఇంతలో ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ, ఎన్నికల కమిషన్ బృందం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పూర్తి జాబితాను గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కు సమర్పించింది.
READ MORE: Sree Leela : నడుము ఒంపులతో హీటెక్కిస్తున్న శ్రీలీల
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజ్యాల్, భారత ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ ఆనంద్ బృందంతో కలిసి రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్కు ఈ ముఖ్యమైన పత్రాన్ని అందించారు. దీంతో అక్టోబర్ 6 నుంచి అమలులో ఉన్న మోడల్ ప్రవర్తనా నియమావళి ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిష్ఫలమైంది. మోడల్ ప్రవర్తనా నియమావళి ఎత్తివేయడంతో ప్రభుత్వ, కొత్త పథకాల ప్రకటనలు, అధికారుల బదిలీలు ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతాయి. ఎన్నికల సమయంలో నిలిచిపోయిన అనేక ప్రాజెక్టులు ఇప్పుడు ఊపందుకుంటాయి.
READ MORE: Ai Courses: ఉచిత AI కోర్సులను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. పూర్తి వివరాలు ఇవే
NDA మెజారిటీ సాధించడంతో నితీష్ కుమార్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమైంది. అయితే, మంత్రివర్గంలో మిత్రపక్షాల భాగస్వామ్యం, మంత్రిత్వ శాఖల పంపిణీకి సంబంధించి ఢిల్లీలో తీవ్రమైన సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇంతలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు (సోమవారం) ఉదయం 11:30 గంటలకు క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రివర్గాన్ని రద్దు చేయాలనే నిర్ణయాన్ని ఆమోదిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కు తన రాజీనామాను సమర్పించి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పాట్నాలోని గాంధీ మైదానంలో జరుగుతుంది. ప్రధాని మోడీ కూడా హాజరవుతారు. భద్రతా కారణాలు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాల దృష్ట్యా పాట్నా జిల్లా యంత్రాంగం నవంబర్ 17 నుంచి 20 వరకు గాంధీ మైదాన్ను మూసివేయాలని నిర్ణయించింది. అంటే.. నవంబర్ 17, 20 మధ్య ఏ రోజునైనా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయవచ్చని అర్థం. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ప్రమాణ స్వీకారానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!