Breaking news Drone Attacks in Russia: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణలో.. తాజాగా కజాన్ నగరంలో 6 భవనాలపై డ్రోన్ దాడి జరిగింది. శనివారం ఉదయం, ఉక్రెయిన్ నుండి వచ్చే అనుమానిత డ్రోన్లు రష్యా కజాన్ నగరంలోని భారీ అంతస్తుల నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. రష్యాలోని కజాన్ నగరంలో కనీసం 6 భవనాలపై డ్రోన్ దాడులు జరిగాయి. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించి అనేక ఫోటోలు, వీడియోలు పెద్దెత్తున వైరల్ అవుతున్నాయి. […]
Range Rover Sport Launched: రేంజ్ రోవర్ తన తొలి మెడ్ ఇన్ ఇండియా రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రెండు పవర్ట్రైన్ ఆప్షన్లతో 2025 అప్డేట్లో విడుదలైన ఈ లగ్జరీ SUVకు కొత్త ఫీచర్లు, ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్ అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.45 కోట్లుగా నిర్ణయించారు. గత మోడల్తో పోలిస్తే దీని ధర రూ. 5 లక్షల మేర పెరిగింది. […]
Effect On Male Fertility: నేటి వేగవంతమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా, కొన్ని అలవాట్లు పురుషుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 25 నుంచి 30 ఏళ్ల యువకుల్లో సంతానోత్పత్తిపై సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానోత్పత్తిని కాపాడుకోవాలంటే ఈ 5 అలవాట్లను మానుకోవడం చాలా అవసరం. Also Read: Cinema Tickets : సగం సినిమా చూసి వెళ్లిపోతే టికెట్ డబ్బులు వాపస్.. బంపర్ ఆఫర్ కదూ అనారోగ్యకరమైన ఆహారం: […]
Gold and Silver Rates Today: గడిచిన రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారు ధరలు నేడు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. శుక్రవారం నాడు భారీగా తగ్గిన బంగారం, శనివారం నాడు మాత్రం ఏకంగా 10 గ్రాములకు 600 రూపాయలకు పైగా పెరిగి షాక్ ఇచ్చింది. ఇకపోతే, హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 650 రూపాయలు పెరిగి రూ. 77,450గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర […]
GST Council Meeting: రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈరోజు జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఇన్ష్యూరెన్స్, లగ్జరీ ప్రోడక్ట్స్, ఇంకా వాహన రంగాలకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నేటి జీఎస్టీ కౌన్సిల్ లో మొత్తం 148 అంశాలపై చర్చ జరగనునుంది. ఇందులో ముఖ్యంగా లైఫ్, హెల్త్ ఇన్ష్యూరెన్స్ అంశం చర్చనీయాంశంగా మారనుంది. […]
Cricketers Retirement in 2024: 2024 సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ ఆట జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది మొత్తం 12 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర […]
Hit And Run Accident: జర్మనీలో ఓ క్రిస్మస్ మార్కెట్లో జరిగిన ఘోర దాడి క్షణాలను చూపించే వీడియోలు వైరల్ అవుతుంది. ఈ ఘటనలో 50 ఏళ్ల సౌదీ వ్యక్తి, మెడికల్ ప్రాక్టీసు చేసే ఒక డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మన్ మీడియా విడుదల చేసిన వీడియోలో, ఒక పోలీస్ ఆఫీసర్ దాడి చేసిన వ్యక్తిపై తుపాకీ పట్టుకుని నిలుచున్నాడు. అక్కడ ఆఫీసర్, “నిలబడకు, కింద పడు, చేతులు వెనుకకు పెట్టు” అని ఆదేశిస్తున్నారు. ఆ […]
Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దేవుడిగా చెప్పుకునే సచిన్ టెండుల్కర్ రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ జిల్లా గ్రామం రామేర్ తలాబ్కి చెందిన 12 ఏళ్ల సుశీలా మీనాను ప్రశంసించారు. ఆ చిన్నారి బౌలింగ్ యాక్షన్ జహీర్ ఖాన్ను గుర్తుకు తెస్తుందని సచిన్ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Road Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్డెడ్ ప్రస్తుతం సుశీలా మీనా బౌలింగ్ చేస్తూ ఉన్న […]
Samsung Galaxy S25: సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ 2025 సంవత్సరంలో విడుదల కాబోయే అత్యంత ఆసక్తికరమైన స్మార్ట్ఫోన్ లాంచ్లలో ఒకటి. గెలాక్సీ S25, గెలాక్సీ S25+, గెలాక్సీ S25 అల్ట్రా మోడల్స్ 2024 జనవరి 22న విడుదల చేయబడతాయని సమాచారం. లాంచ్కు ముందు, టిప్స్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం ఈ సిరీస్లోని బేస్ మోడల్ రామ్లో గణనీయమైన అప్గ్రేడ్ను పొందుతుందని భావిస్తున్నారు. గెలాక్సీ S25 సిరీస్లోని మూడు మోడల్స్ కూడా 12GB రామ్తో అందుబాటులోకి రానున్నాయి. […]
Rahul Gandhi: గురువారం నాడు పార్లమెంట్లో చోటుచేసుకున్న సంఘటనలో గాయపడ్డ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజపుత్లను ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బండి సంజయ్ పరామర్శించారు. పార్లమెంట్లో జరిగిన తోపులాటలో ఇద్దరు ఎంపీలు గాయపడటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్లమెంట్లో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వరుస ఓటముల కారణంగా ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరిగిందని […]