Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
- జూలై 6 నుంచి అప్రెంటిస్షిప్-కమ్-జాబ్ మేళా
- నెలకు రూ.9,600 స్టైపెండ్ అవకాశం
- ఐదు జిల్లాల్లో ఇంటర్వ్యూలు నిర్వహణ
- ఫ్రెషర్స్కు ప్రముఖ కంపెనీల్లో అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Job Mela : తెలంగాణ ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా శాఖ, RDSDE సహకారంతో రాష్ట్రంలోని నిరుద్యోగ వృత్తి విద్యార్థులు, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జూలై 6 నుండి జూలై 14 వరకు ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో “అప్రెంటిస్షిప్-కమ్-జాబ్ మేళా–2026” నిర్వహించనుంది. స్కిల్ ఇండియా మిషన్ , నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS–2) ఆధ్వర్యంలో “Your Skills, Your Future, Our Mission” అనే థీమ్తో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా కొత్తగా ఉత్తీర్ణులైన అభ్యర్థులను ప్రముఖ పరిశ్రమలతో అనుసంధానం చేయనున్నారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, విద్యా శాఖ డైరెక్టర్ శ్రీమతి అభిలాషా అభినవ్ (IAS), , RDSDE ప్రాంతీయ డైరెక్టర్ శ్రీ చ. రవి మార్గదర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ఉపాధి వేదిక ఏర్పాటు కాబోతోంది.
ఆకర్షణీయమైన స్టైపెండ్ , అర్హతలు
ఈ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు పారామెడికల్, నాన్-పారామెడికల్ రంగాల్లోని ప్రముఖ కంపెనీల్లో తక్షణ ఇంటర్వ్యూలు, నిపుణుల కెరీర్ మార్గదర్శకత్వంతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇందులో ఎంపికైన వారికి అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం నెలకు Rs. 9,600/- స్టైపెండ్తో పాటు అద్భుతమైన శిక్షణ అందుతుంది. ఈ సువర్ణావకాశం కేవలం IPE మార్చ్ లేదా IPASE జూన్ 2026 లో ఉత్తీర్ణులైన ఫ్రెషర్లకు , గత మూడు విద్యా సంవత్సరాల్లో పాసైన అభ్యర్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, ఇప్పటికే ఏదైనా సంస్థలో అప్రెంటిస్షిప్ శిక్షణ పొందుతున్న లేదా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరవడానికి అర్హులు కారని అధికారులు స్పష్టం చేశారు.
Also Read
జిల్లా వారీ షెడ్యూల్ , అవసరమైన పత్రాలు
ఈ జాబ్ మేళా జూలై 6న మేడ్చల్-మల్కాజ్గిరి (కుత్బుల్లాపూర్) లో ప్రారంభమై, జూలై 7న సికింద్రాబాద్ (మరిడ్పల్లి), జూలై 13న హన్మకొండ, , జూలై 14న మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోని ప్రభుత్వ వృట్టి జూనియర్ కళాశాలల్లో జరగనుంది. ప్రతిరోజూ ఉదయం సెషన్లో పారామెడికల్ విభాగం, మధ్యాహ్నం సెషన్లో నాన్-పారామెడికల్ విభాగం ఇంటర్వ్యూలు జరుగుతాయి. యువత ఒకే వేదికపై విభిన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుని సార్థకమైన కెరీర్ వైపు అడుగులు వేయడానికి ఈ మేళా ఎంతో దోహదపడుతుందని డైరెక్టర్ అభిలాషా అభినవ్ పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తమ వెంట రెండు ప్రతుల బయోడేటా (రెజ్యూమ్), విద్యా అర్హతల సర్టిఫికేట్లు, , ఆధార్ కార్డు ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!