Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
- జూలై 6 బోర్డు మీటింగ్పైనే అందరి కళ్లు
- 5 ఏళ్లలో 3,847 శాతం బంపర్ రిటర్న్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apollo Micro Systems: షేర్ మార్కెట్లో రక్షణ రంగానికి (డిఫెన్స్) చెందిన కంపెనీల షేర్లు వరుస రికార్డులతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డిఫెన్స్ అండ్ ఎరోస్పేస్ కంపెనీ ‘అపోలో మైక్రో సిస్టమ్స్’ (Apollo Micro Systems) ఇన్వెస్టర్లకు ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. జూలై 6 (సోమవారం) న జరగబోయే కంపెనీ బోర్డు సమావేశం వార్తల నేపథ్యంలో.. శుక్రవారం ట్రేడింగ్లో ఈ షేరు 2.39 శాతం వృద్ధితో ముగిసింది. ప్రెఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కంపెనీ భారీగా కొత్త నిధులను సేకరించాలని ప్లాన్ చేస్తుండటమే ఈ జోష్కు ప్రధాన కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
జూలై 6 బోర్డు మీటింగ్పైనే అందరి కళ్లు
హైదరాబాద్లోని తమ రిజిస్టర్డ్ ఆఫీస్లో జూలై 6వ తేదీన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కీలక సమావేశం జరగనుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సమావేశంలో ప్రెఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్లు, కన్వర్టిబుల్ సెక్యూరిటీస్ లేదా వారెంట్ల జారీ ద్వారా ఫండ్స్ సేకరించడంపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. సెబీ (ICDR) రెగ్యులేషన్స్-2018 నిబంధనల ప్రకారం షేర్ల ధర, నిధుల సేకరణ షరతులు ఖరారు కానున్నాయని తెలుస్తోంది. దీనికి షేర్ హోల్డర్లతో పాటు రెగ్యులేటరీ అనుమతులు కూడా తప్పనిసరి కానున్నాయి.
Also Read
- LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
- BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
- Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
- EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
5 ఏళ్లలో 3,847 శాతం బంపర్ రిటర్న్స్
గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ డిఫెన్స్ స్టాక్ ఇన్వెస్టర్లకు ఏకంగా 3,847 శాతం మేర మైండ్ బ్లాకింగ్ రిటర్న్స్ అందించింది. అంటే ఐదేళ్ల క్రితం ఇందులో పెట్టిన రూ.1 లక్ష పెట్టుబడి.. ఇప్పుడు ఏకంగా రూ.39 లక్షలకు పైగా మారింది. కేవలం గత 3 నెలల్లో 128 శాతం, ఏడాదిలో 136 శాతం, మూడేళ్లలో 803 శాతం లాభాలను అందించి ఈ షేరు టాప్ మల్టీబ్యాగర్గా నిలిచింది. కంపెనీ భవిష్యత్తుపై నమ్మకంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) తమ వాటాను మార్చి త్రైమాసికంలోని 3.63 శాతం నుంచి జూన్ నాటికి ఏకంగా 6.21 శాతానికి పెంచుకున్నారు. ప్రస్తుతం ప్రమోటర్ల వద్ద 50.27 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ ప్రధానంగా రక్షణ శాఖ, డీఆర్డీఓ (DRDO), ఇస్రో (ISRO), బెల్ (BEL), హెచ్ఏఎల్ (HAL) వంటి ప్రభుత్వ సంస్థలకు కీలకమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.1,432 కోట్ల భారీ ఆర్డర్ బుక్ ఉండటం వల్ల భవిష్యత్తులో రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫండ్ రైజింగ్ వంటి సున్నితమైన సమాచారం లీక్ కాకుండా ఉండేందుకు, జూలై 1 నుంచి కంపెనీ ఉద్యోగులు, అధికారుల ట్రేడింగ్ విండోను యాజమాన్యం పూర్తిగా మూసివేసింది. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం, రూ.16,336 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ కంపెనీ పీఈ (P/E) రేషియో 152.11 వద్ద ఉంది. అయితే, డెట్-టు-ఈక్విటీ రేషియో కేవలం 0.41 మాత్రమే ఉండటం.. కంపెనీపై అప్పుల భారం చాలా స్వల్పంగా ఉందనే విషయానికి సంకేతం.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!