ICC USA: అమెరికా (USA) క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ తక్షణమే సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 23న వర్చువల్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ఐసీసీ కమిటీ. 2024లో జరిగిన T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ను ఓడించి అద్భుత ఆరంభం చేసిన అమెరికా జట్టుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) గట్టి షాక్ ఇచ్చింది. అయితే, ఈ చర్యతో చేపట్టినా USA జట్టు వచ్చే ఏడాది జరగనున్న T20 వరల్డ్ కప్లో మాత్రం ఆడనుంది. Crime […]
Crime News: మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో ఒక సినిమా స్టోరీకి మించిన దారుణ ఘటన వెలుగుచూసింది. సెప్టెంబర్ 21న అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను షాక్కు గురి చేసింది. మొదట్లో ఇది దోపిడీ హత్యలా కనిపించినా.. చివరికి భర్తే అని తెలిసి అందరి గుండెల దడ పుట్టించింది. మరి ఈ హత్య గల పూర్తి వివరాలను చూస్తే.. పద్మనగర్ థానా పరిధిలోని డిగరిస్ గ్రామంలో మహిళపై రాత్రివేళ దాడి జరిగింది. ఆ దాడిలో భర్తకు స్వల్ప […]
CM Revanth: మేడారంలో శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ఆలయ అభివృద్ధి, విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లను అధికారులు పూజారులకు, ఆదివాసీ సంఘాలకు వివరించారు. ఈ ప్రణాళికలపై ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం, వారి ఏకాభిప్రాయం పొందిన తర్వాతనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. మేడారంలో ఆలయ […]
Hong Kong Sixes 2025: భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ రాబోయే హాంకాంగ్ సిక్సర్స్ (Hong Kong Sixes) టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియాకు కెప్టెన్గా ఎంపికయ్యారు. టోర్నమెంట్ నిర్వాహకులు ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 7 నుండి ప్రారంభమయ్యే ఈ షార్ట్ ఫార్మాట్ టోర్నమెంట్లో ఆయన కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అనుభవం, కచ్చితమైన నాయకత్వ నైపుణ్యాలు, అలాగే బ్యాటింగ్ స్టైల్తో కార్తీక్ అభిమానులకు ప్రేరణగా నిలుస్తారని నిర్వాహకులు […]
BSNL FTTH: ప్రభుత్వరంగ టెలికాం సర్కిల్ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత సరసమైన ధరలలో ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) ట్రిపుల్ ప్లే సేవలను ప్రారంభించింది. ఈ సేవలు డిజిటల్ కనెక్టివిటీలో ఒక విప్లవాన్ని తీసుకువస్తాయని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ సీ.జి.ఎం. రత్నకుమార్ తెలిపారు. ఈ రకమైన సేవలు ఇంత తక్కువ ధరలో దేశంలో మరెక్కడా అందుబాటులో లేవని ఆయన పేర్కొన్నారు. Ranveer Singh : మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం వేస్ట్ చేసిన రణవీర్.. ఎవరంటే? బీఎస్ఎన్ఎల్ […]
Uttam Kumar Reddy: కృష్ణా జలాల వివాదంపై ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలను వినిపిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ వాదనల వివరాలను వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచే అంశాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ఏ ప్రభుత్వం ఉన్నా తమ రాష్ట్ర వాటా […]
Ponnam Prabhakar: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తు, సేవల పన్ను(GST) విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. GSTని ప్రవేశపెట్టినప్పుడే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దానిని “గబ్బర్ సింగ్ ట్యాక్స్”గా అభివర్ణించారని, ఇది దేశ ప్రజలకు దోచుకునే ఆయుధంగా మారిందని ప్రభాకర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని GST పరిధిలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ సూచించినా.. మోదీ ప్రభుత్వం దానిపై స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. Most Wanted […]
PMUY Scheme: కేంద్ర ప్రభుత్వం ఉజ్జ్వలా యోజనను మరింత విస్తరించాలన్న నేపథ్యంలో కొత్తగా 25 లక్షల మహిళలకు ఉచిత LPG కనెక్షన్లు అందించనుంది. మహిళా సాధికారతకు తోడ్పడే ఈ నిర్ణయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా.. నవరాత్రి పవిత్ర సందర్భంలో, ఉజ్జ్వల కుటుంబానికి చెందిన తల్లులు, అక్కచెల్లలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పని వల్ల వారు ఈ పండుగ రోజు ఆనందాన్ని పొందడమే కాక, మహిళా […]
PPF Scheme: ప్రతి ఒక్కరు వారు సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని సురక్షితంగా ఉండే మంచి రాబడిని పొందే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ నిర్వహించే అన్ని పథకాలు బాగా ప్రాచూర్యం పొందాయి. అలాగే భారీ రాబడిని కూడా బాగా ఇస్తున్నాయి కూడా. అలాంటి ఒక పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF Scheme). ఇది తక్కువ రిస్క్ పన్ను రహిత పెట్టుబడి రాబడిని కోరుకునే పెట్టుబడిదారుల్లో అత్యంత ప్రజాధరణ […]
Vivek Venkataswamy: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని B1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, అరెస్టులతో కేసీఆర్ రాచరిక పాలన సాగించారని వివేక్ ఆరోపించారు. తెలంగాణను 60 వేల కోట్ల అప్పుల నుంచి 8 లక్షల […]