IND vs SA: భారత్ పర్యటనకు సిద్ధమవుతున్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టు తమ 15 మంది టెస్టు జట్టును అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో సఫారీలు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లతో టీమిండియాను ఎదుర్కోనున్నారు. ఈ సుదీర్ఘ సిరీస్ సుమారు నెల రోజులపాటు జరగనుంది. గాయం కారణంగా ఇటీవల పాకిస్థాన్ సిరీస్కు దూరమైన కెప్టెన్ బావుమా ఈసారి తిరిగి జట్టులోకి చేరి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆయన రీ-ఎంట్రీతో […]
Riaz Encounter Case: ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC)ను ఆశ్రయించారు. తన కొడుకు ఎన్కౌంటర్కు దారి తీసిన పరిస్థితులు, ఆ తరువాత పోలీసులు తమను వేధిస్తున్న తీరుపై రియాజ్ తల్లి, భార్య, పిల్లలు కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రియాజ్ కుటుంబ సభ్యులు తమను స్వగ్రామంలోకి కూడా రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, తీవ్రంగా వేధింపులకు […]
Viral Video: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దీక్షల్లో అయ్యప్ప మాల ధారణ ఒకటి. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రారంభమయ్యే 41 రోజుల ఈ కఠిన వ్రతం భక్తులు స్వామి అయ్యప్పపై తమకు ఉన్న భక్తిని, నిష్టను చాటుకునేందుకు చేపడతారు. మాల ధరించిన ప్రతి భక్తుడు శారీరక, మానసిక పవిత్రతను పాటిస్తూ.. మద్యపానం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి పవిత్రమైన అయ్యప్ప మాలను ధరించి ఉన్న ఓ వ్యక్తి.. […]
KTR: శంషాబాద్లో జరిగిన బీఆర్ఎస్ మైనార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన అనేది బీజేపీతో కుమ్మక్కై నడుస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మైనార్టీలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ‘మైనార్టీ డిక్లరేషన్’ పేరుతో కాంగ్రెస్ మైనారిటీలను మోసం చేసింది. మైనార్టీల కోసం రూ. 4 వేల కోట్ల బడ్జెట్ […]
Mecturing MopX2: ఇంటి పనులను సులభతరం చేసేందుకు మెక్చరింగ్ (Mecturing) సంస్థ భారతదేశంలో సరికొత్త MopX2 రోబోట్ వాక్యూమ్ క్లీనర్ను విడుదల చేసింది. ఇది అత్యాధునిక AI ఫీచర్లతో పాటు.. శక్తివంతమైన క్లీనింగ్ సొల్యూషన్స్తో ఇది సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. మరి దీని పూర్తి ఫీచర్లను చూసేద్దామా.. అత్యాధునిక AI సాంకేతికతతో పాటు శక్తివంతమైన క్లీనింగ్ సొల్యూషన్స్తో ఈ MopX2 రోబోట్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఇందులో ఉన్న డ్యూయల్ రోటేటింగ్ మాప్స్ నేలపై గట్టిగా […]
OnePlus Turbo: వన్ప్లస్ సంస్థ ‘ప్యూర్ పర్ఫార్మెన్స్’ లక్ష్యంగా సరికొత్త సిరీస్ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే OnePlus 15, OnePlus Ace 6 (OnePlus 15R) మోడల్స్తో పాటుగా.. ఇప్పుడు OnePlus Turbo పేరుతో ఒక అల్ట్రా-పవర్ఫుల్ హ్యాండ్సెట్ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అభివృద్ధి చేస్తున్న సమయంలో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఈ వివరాల ప్రకారం.. ఈ OnePlus Turbo ఫోన్ అతిపెద్ద చెప్పుకోతగ్గ విషయం 8,000mAh బ్యాటరీ. ఇప్పటివరకు […]
Harish Rao: తెలంగాణ భవన్లో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, అనైతిక మార్గాల్లో డబ్బు సంపాదిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హరీష్ రావు మాట్లాడుతూ.. “మంత్రి కూతురు చెప్పిన ‘తుపాకీ కథ’ ఇప్పటికీ తేలలేదని.. ఆ తుపాకీ […]
Abdullahpurmet: ఈ మధ్య కొందరు కరెంటు పోల్స్ ఎక్కి వారి నిరసనను వ్యక్తం చేయడం కామన్ గా మారింది. తాజాగా ఇలాంటి ఘటన అబ్దుల్లాపూర్ మెట్ లో చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో విద్యుత్ టవర్ ఎక్కిన ఓ వ్యక్తి చేసిన సాహసం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కిన ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించేందుకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, విద్యుత్ శాఖ […]
Emergency Landing: మదురై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం (SG23) సోమవారం మధ్యాహ్నం గగనతలంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. వెంటనే స్పందించిన పైలట్లు విమానాన్ని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి, అక్కడ అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 160 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది (మొత్తం 167 మంది) ఉన్నారు. ప్రయాణం మధ్యలో సమస్యను గుర్తించిన పైలట్లు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా […]
Fake Babas Gang: దుండిగల్ ప్రాంతంలో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దొంగ బాబాల అవతారమెత్తి అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని చూసిన ఓ ముఠా ఆట కట్టించారు పోలీసులు. పూజల పేరుతో ప్రజలను మోసం చేస్తూ, ఆ తర్వాత మత్తుమందు చల్లి అపస్మారక స్థితిలో ఉన్న వారి నుంచి నగదు దోచుకుంటున్న ఈ కేటుగాళ్లను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే… సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ వ్యక్తి దొంగ ‘బాబా’ […]