హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎస్ అధికారి పేరుతో మహిళను వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… మ్యాట్రీమోనీలో హరిప్రసాద్ అనే యువకుడు ఐపీఎస్ పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఐపీఎస్ అధికారి అని ప్రొఫైల్ కనిపించడంతో ఆసక్తి కనపరిచిన మహిళలను హరిప్రసాద్ ట్రాప్ చేయడం ప్రారంభించాడు. అయితే ఓ మహిళకు అనుమానం వచ్చి ఐడీ కార్డు చూపించమని అడిగింది. దీంతో హరిప్రసాద్ […]
హైదరాబాద్ మియాపూర్లో యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బ్రహ్మానందం (22) మిస్సింగ్ మిస్టరీగా మారింది. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం బయటకు వెళ్లి తమ కుమారుడు తిరిగిరాలేదని తల్లిదండ్రులు నరసింహారావు, నాగలక్ష్మీ దంపతులు ఆరోపిస్తున్నారు. 2019 జూలై 3న ఆఫీసుకు వెళ్లి అదృశ్యమయ్యాడని… అప్పటి నుంచి ఇంటికి రాలేదని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఫీసులో మధ్యాహ్నం నుంచి బయటకు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డు అయిందని… ఆ తర్వాత బ్రహ్మానందం ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందని.. దీంతో పోలీసుల […]
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతోందని వార్తలు వస్తున్నాయి. కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలని ఈ సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు. భారత్పై ఈ వేరియంట్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై అధికారులతో మోదీ చర్చించారు. Read […]
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న దేశాలు కొత్త వేరియంట్ కారణంగా భయపడుతున్నాయి. దీని ప్రభావం క్రీడారంగంపైనా పడింది. ఈ నేపథ్యంలో మహిళల వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీని అర్థాంతరంగా రద్దు చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. జింబాబ్వేలో జరుగుతున్న ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎందుకంటే దక్షిణాఫ్రికా దేశానికి పక్కనే జింబాబ్వే ఉంటుంది. అందువల్ల కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి భయంతోనే […]
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీ 12 అంకెల UAN నంబరును ఆధార్ కార్డుకు లింకు చేసుకున్నారా? ఇంకా చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. నవంబర్ 30లోగా మీ UAN నంబరును ఆధార్ కార్డుతో లింకు చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్రం విధించిన గడువు కొద్దిరోజుల్లో ముగియనుంది. ఒకవేళ మీ UAN నంబరును ఆధార్తో లింకు చేయకపోతే మీరు పని చేసే కంపెనీ మీ ఖాతాలో జమ చేసే మొత్తం […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ మూవీలో మెగాపవర్స్టార్ రామ్చరణ్ కూడా కనిపించనున్నాడు. అతడు ఈ సినిమాలో ‘సిద్ధ’గా అభిమానులకు కనిపించనున్నాడు. ఇప్పటివరకు రామ్చరణ్ లుక్స్ మాత్రమే సినిమా యూనిట్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు చెర్రీని ‘సిద్ధ’గా పరిచయం చేస్తూ టీజర్ను విడుదల చేయనుంది. ఈ టీజర్ ఎప్పుడు ఏ సమయానికి విడుదల చేస్తున్నామో తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. Read Also: సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా […]
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పలు జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతుంటే టాలీవుడ్ హీరోలు స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల అభిమానం వల్లే హీరోలు అయిన వాళ్లు.. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో, బాధల్లో ఉంటే స్పందించకపోవడం బాధాకరమన్నారు. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా ఒక్కరు కూడా వరద ప్రజల గురించి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదని […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బొత్స స్పష్టం చేశారు. లేనిది ఉన్నట్లుగా చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆడపడచుల ఆత్మగౌరవం పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని బొత్స ఆరోపించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే సంస్కృతి టీడీపీ నేతలకే ఉందన్నారు. ఆనాడు వైసీపీ ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టినప్పుడు చంద్రబాబుకు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా అని బొత్స ప్రశ్నించారు. Read […]
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్సులో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ శుభ్మన్ గిల్(1)ను న్యూజిలాండ్ బౌలర్ జేమీసన్ బౌల్డ్ చేశాడు. క్రీజులో మయాంక్ అగర్వాల్ (4), పుజారా (9) ఉన్నారు. మన బ్యాట్స్మెన్ నాలుగో రోజు ఆటలో ఎంత సేపు బ్యాటింగ్ చేస్తారన్న దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికి భారత్ […]