ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ ఓటమి ఇంగ్లండ్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు టెస్టులకు కాకుండా టీ20లకు ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరం కావాలని పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్ మెగా వేలానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది ఐపీఎల్ అరంగేట్రం చేయాలని అతడు భావించినా యాషెస్ సిరీస్ ఓటమి కారణంగా తన జాతీయ జట్టుకు […]
ఏపీలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం సీనియర్ కేటగిరీలో అసిస్టెంట్, స్టెనో, అకౌంటెంట్, ట్రాన్స్లేటర్ తదితరులకు రూ.17,500 నుంచి రూ.21,500కు జీతం పెరిగింది. మరోవైపు జూనియర్ విభాగంలో అసిస్టెంట్, స్టెనో, డ్రైవర్, టైపిస్ట్, మెకానిక్, ఫిట్టర్ తదితరులకు జీతాన్ని రూ.15వేల నుంచి 18,500కి పెంచుతున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరితో […]
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో అన్నదాతలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లాలో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకుందామని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన […]
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్న చంద్రబాబుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. Read Also: […]
ఒక్క సిలిండర్తో అష్టకష్టాలు పడుతున్న ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఒక్క గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తత్కాల్ సేవ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ఇండేన్ గ్యాస్ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా గ్యాస్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే వినియోగదారులు సిలిండర్ పొందవచ్చని కంపెనీ జనరల్ మేనేజర్ వి.వెట్రీ సెల్వకుమార్ వెల్లడించారు. అయితే తత్కాల్ సేవ సౌకర్యం వినియోగించుకున్న కస్టమర్లు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. Read Also: రిపబ్లిక్ […]
కొత్త పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు. హెచ్ఆర్ఏలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురుచూసిన ఉద్యోగులకు షాకిస్తూ… ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. సచివాలయం, హెచ్వోడీ ఉద్యోగుల హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 16 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో 20 శాతం, పురపాలిక సంఘాలు, 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12 శాతం ఇస్తున్నారు. కొత్త విధానంలో […]
విడాకులు తీసుకుంటున్న జాబితాలో మరో ప్రముఖ జంట చేరింది. తమిళ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 2004లో వీరి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి విడాకులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గత 18 ఏళ్ల నుంచి స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రయాణం కొనసాగించామని… కానీ ఇప్పుడు వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యామని హీరో […]
★ ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ… కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం★ నేడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 26వ వర్థంతి… ఏపీ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం… ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్న టీడీపీ శ్రేణులు★ నేడు ఏపీలోని 37 గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం… క్యాంప్ […]
ఐర్లాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ గడ్డపై ఆశ్చర్యకర రీతిలో వన్డే సిరీస్ విజయాన్ని సాధించింది. సబీనా పార్కులో ఆదివారం రాత్రి జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్పై రెండు వికెట్ల తేడాతో ఐర్లాండ్ గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్లో తొలి వన్డేలో వెస్టిండీస్ గెలవగా… రెండు, మూడు వన్డేల్లో ఐర్లాండ్ గెలిచి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా విదేశీ గడ్డపై తొలిసారి ఐర్లాండ్ వన్డే సిరీస్ గెలిచింది. Read Also: ఐపీఎల్ 2022: […]