Ramesh Nalam
Author- NTV Telugu-
CM Jagan: రేపు సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్
శ్రీసత్యసాయి జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆయన పర్యటన షెడ్యూల్ను వ్యక్తిగత కార్యదర్శి విడుదల చేశారు. మంగళవారం నాడు సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు 14వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సీఎం జగన్ బయలుదేరుతారు. ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10:20 గంటలకు […] -
Major Movie: మహారాష్ట్ర సీఎంను కలిసిన ‘మేజర్’ టీమ్
అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. జూన్ 3న విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్గా రన్ అవుతోంది. 2011లో ముంబైలో జరిగిన పేలుళ్లలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన పోరాట యోధుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ మూవీని శశికిరణ్ తిక్కా తెరకెక్కించాడు. ఈ […] -
Drugs Case: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడి అరెస్ట్.. కారణం ఇదే..!!
సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు కకావికలం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ఖాన్ను డ్రగ్స్ కేసు ఎంతో ఇబ్బంది పెట్టింది. ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ వ్యవహారంలో అనేక తలనొప్పులను షారుఖ్ చవిచూశారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఓ పార్టీలో సిద్ధాంత్ డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. క్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు పార్టీ నిర్వహిస్తున్న […] -
Tirumala: టీటీడీ ఖజానాకు రూ.1100 కోట్ల విరాళాలు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారు ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేవుడు. భక్తుల నుంచి కానుకలు, విరాళాల రూపంలో శ్రీవారికి వందల కోట్లు చేరుతున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా శ్రీవారి హుండీ ఆదాయం ఆశించిన మేరకు రాలేదు. దాతల సహకారం మాత్రం టీటీడీకి భారీగానే లభించింది. కోవిడ్ సమయంలోనూ టీటీడీ కార్యక్రమాలకు రూ.వందల కోట్ల విరాళాలు లభించాయి. టీటీడీ పథకాలకు 2019లో రూ.308 కోట్ల విరాళాలు వచ్చాయి. 2020లో రూ.232 కోట్లు, 2021లో రూ.564 కోట్ల విరాళాలు టీటీడీ ఖజానాకు […] -
Telugu Desam Party: టీడీపీ ఆధ్వర్యంలో ‘ఛలో కంతేరు’.. మాజీ మంత్రి హౌస్ అరెస్ట్
ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో వెంకాయమ్మ కుటుంబంపై వైసీపీ నేతలు పలు మార్లు దాడి చేశారని ఆరోపిస్తూ టీడీపీ నిరసనలు చేపట్టింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. వెంకాయమ్మ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక కుటుంబంపై పదేపదే దాడులు జరుగుతుంటే అడ్డుకోలేకపోవడం పోలీసుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. బాధితురాలు వెంకాయమ్మతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు […] -
IPL Media Rights: బాబోయ్.. ఒక్కో మ్యాచ్కు రూ.100 కోట్లా..?
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐపై కాసుల వర్షం కురుస్తోంది. కళ్లు చెదిరే రీతిలో రూ.కోట్ల సొమ్ము బీసీసీఐ ఖజానాలో చేరుతోంది. డిజిటల్, టీవీ ప్రసార హక్కుల కోసం పలు ప్రముఖ కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ వేలం నిర్వహించడం ద్వారా రూ.45వేల కోట్లు వస్తాయని తొలుత బీసీసీఐ అంచనా వేయగా ఎ, బి ప్యాకేజీలకు కలిపి బిడ్డింగ్ విలువ రూ.43,050 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. సోమవారం కూడా బిడ్డింగ్ కొనసాగనుంది. మరోవైపు సి, […] -
Kurnool: యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన యువతి కుటుంబీకులు.. లవ్స్టోరీనే కారణమా?
ఇటీవల కాలంలో వరుసగా యువతీయువకుల ప్రేమ పలు వివాదాస్పద ఘటనలకు కారణమవుతోంది. తాజాగా ఇలాంటి ఉదంతం మరొకటి వెలుగు చూసింది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఓ ప్రేమజంట ప్రేమించుకున్నారనే కారణంగా వారి కుటుంబాల మధ్య వైరం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రీజ, శివాజీ అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీజ కుటుంబసభ్యులు ఆమెకు మూడురోజుల క్రితం రచ్చమర్రికి చెందిన భీమతో […] -
Krishna Vrinda Vihari: వాయిదా మీద వాయిదా.. నాగశౌర్య సినిమా రిలీజ్ ఎప్పుడు?
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన నటన, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో నాగశౌర్య. వైవిద్యభరితమైన పాత్రలను ఎంచుకంటూ సినీరంగంలో తనకంటూ నాగశౌర్య పత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఛలో’ విజయం తర్వాత నాగశౌర్య కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒకే జోనర్లో సినిమాలు చేయకుండా విభిన్న కథలతో రొటీన్కు భిన్నంగా సినిమాలను చేస్తున్నాడు. లేటెస్ట్గా నాగశౌర్య నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా […] -
Andhra Pradesh: అల్లూరి జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా.. నలుగురు మృతి
ఏపీలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఓ మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటంతో బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను స్థానికులు వెంటనే చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
★ నేడు తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. ఇప్పటికే గోవా, కొంకణ్, కర్ణాటకకు విస్తరించిన రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ★ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేంద్రమంత్రి జయశంకర్ పర్యటన.. పాడేరు ఏజెన్సీలో పర్యటించనున్న జయశంకర్.. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు, కాఫీ ప్లాంటేషన్ల పరిశీలన ★ తిరుమల: ఇవాళ జ్యేష్ఠాభిషేకంలో రెండో రోజు.. ముత్యపు కవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ★ నేటి నుంచి […]
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!