Kurnool: యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన యువతి కుటుంబీకులు.. లవ్స్టోరీనే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో వరుసగా యువతీయువకుల ప్రేమ పలు వివాదాస్పద ఘటనలకు కారణమవుతోంది. తాజాగా ఇలాంటి ఉదంతం మరొకటి వెలుగు చూసింది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఓ ప్రేమజంట ప్రేమించుకున్నారనే కారణంగా వారి కుటుంబాల మధ్య వైరం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రీజ, శివాజీ అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీజ కుటుంబసభ్యులు ఆమెకు మూడురోజుల క్రితం రచ్చమర్రికి చెందిన భీమతో వివాహం జరిపించారు. ఈ పెళ్లి ఇష్టం లేని శ్రీజ తన ప్రియుడు శివాజీతో కలిసి గ్రామం నుంచి వెళ్లిపోయింది. దీంతో శ్రీజ కుటుంబం శివాజీ కుటుంబంపై వైరం పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు శివాజీ ఇంటిపై శ్రీజ కుటుంబసభ్యులు దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో శివాజీ ఇంటిలోని ధాన్యం, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో మాధవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. అయితే తమపై శ్రీజ బంధువులు దాడి చేస్తారన్న భయంతో శివాజీ కుటుంబీకులు పారిపోయినట్లు తెలుస్తోంది.
Also Read
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
తాజావార్తలు
-
KL Rahul IPL Record: ఐపీఎల్లో కోహ్లీకే సాధ్యం కాని ఘనత.. చరిత్ర సృష్టించిన రాహుల్!
-
Finn Allen: ఇది ‘ఫిన్ అలెన్ 2.0’.. 40 బంతులు నా టార్గెట్.. కేకేఆర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Sharwanand: శర్వానంద్ నెక్స్ట్ మూవీ కోసం ప్రామిసింగ్ ప్రొడ్యూసర్.. ఎవరంటే..?
-
Ajinkya Rahane: ఆ టార్చరే మా గెలుపునకు కారణం.. కెప్టెన్ రహానే షాకింగ్ కామెంట్స్