-
గోదావరిఖనిలో బెదిరించి డబ్బులు వసూలు.. నలుగురు అరెస్ట్
కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురిని పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని గోదావరిఖని గంగా నగర్ ఏరియాలో లారీ డ్రైవర్ ను కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురిని డీసీపీ రవీందర్ అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 9 వేల నగదు, ఏటీఎం కార్డులు, కత్తి, బైక్ ను వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు చాకచక్యంగా చేధించిన వన్ టౌన్ సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్ […] -
తుది శ్వాస విడిచిన హాలీవుడ్ నిర్మాత, ఆస్కార్ విన్నర్ హెల్ మ్యాన్…
‘మిడ్ నైట్ కౌబాయ్’ సినిమా నిర్మించినందుకుగానూ ఆస్కార్ అందుకున్న సీనియర్ హాలీవుడ్ నిర్మాత జెరోమ్ హెల్ మ్యాన్ గత బుధవారం మరణించాడు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన 92వ ఏట అమెరికాలోని మసాచూసెట్స్ రాష్ట్రంలో తుది శ్వాస విడిచాడు. ‘మిడ్ నైట్ కౌబాయ్’ సినిమాతో ఆస్కార్ పొందిన హెల్ మ్యాన్ ‘కమింగ్ హోమ్’ మూవీకి అకాడమీ నామినేషన్ పొందాడు. ఆయన బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్ రాలేదుగానీ… ‘కమింగ్ హోమ్’ మూడు ఆస్కార్స్ స్వంతం చేసుకుంది. తన కెరీర్ […] -
ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం
దివంగత ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించే బాధ్యతను చేపట్టింది. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లును ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలోని టెక్కలి, కుప్పం, పాలకొల్లు, రేపల్లె పట్టణాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఏర్పాటుచేసిన కాల్ […] -
నయనతార ఫ్యాన్స్ కోసం… విఘ్నేశ్ శివన్ ఎగ్జైటింగ్ అప్ డేట్!
లేడీ సూపర్ స్టార్ నయనతార నెక్ట్స్ రిలీజ్ ‘నెట్రికన్’. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది ఈ సినిమా. అయితే, నయన్ కంటి చూపులేని అమ్మాయిగా నటిస్తోన్న ఈ సినిమా ఓ థ్రిల్లర్. ఒక సీరియల్ కిల్లర్ ని ఓ అంధురాలు ఎలా పట్టుకుందనేదే స్టోరీ. గత నవంబర్ లోనే టీజర విడుదలైంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో ‘నెట్రికన్’ ఓటీటీ బాట పట్టవచ్చని అంటున్నారు. అంతే కాదు, […] -
‘ఆ స్కూల్ ని మూసేయండి’ అంటూ విశాల్ ఆగ్రహం!
విశాల్ కి కోపం వచ్చింది. కారణం ఓ స్కూల్ టీచర్! చెన్నైలో ఉన్న పద్మశేషాద్రి బాల భవన్ (పీఎస్ బీబీ) స్కూల్ ఇప్పుడు పెద్ద దుమారానికి కేంద్రంగా మారింది. అందులోని ఓ కామర్స్ టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఓ స్టూడెంట్ ఆరోపించింది. ఆ తరువాత అదే స్కూల్ కి చెందిన అనేక మంది పూర్వ విద్యార్థినులు కూడా రాజగోపాల్ అనే టీచర్ తమని వేధించాడని సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. మొత్తంగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటోన్న […] -
మారిన వాతావరణం.. దట్టంగా కమ్ముకున్న మేఘాలు
విశాఖలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెలరేగింది. రాగల మూడు రోజులు ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరకోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ […] -
ఆ ‘హెల్త్ కేర్ సిస్టమ్’తో.. మనశ్శాంతిగా బతకొచ్చు: పూరీ
టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎలాంటి వివాదాలకు తావులేకుండా, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తూ ఆలోచనల్లో పడేస్తున్నాడు. తాజాగా ఆయన ‘హెల్త్ కేర్ సిస్టమ్’ గూర్చి తెలియజేస్తూ.. పూరీ మ్యూజింగ్స్ ద్వారా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కు తగ్గట్టు మాట్లాడారు. ‘మనందరం రాత్రి, పగలు కష్టపడి ఆస్తులు కూడబెట్టేది పిల్లల చదువుల కోసం.. అనారోగ్య సమస్యలకి, సొంత ఇంటికి, వృద్ధాప్యం కోసం దాచుకుంటాం. కాకపోతే వీటన్నింటికీ ఎంత డబ్బు కావాలో, ఎంత దాచిపెట్టుకోవాలో మనకు తెలియదు.అయితే యూరప్, కెనడా, […] -
ఆ సమయంలోనూ.. చాలా రిస్క్ చేశా: రాశి ఖన్నా
గ్లామర్ గర్ల్ రాశి ఖన్నా ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తుంది. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ‘థాంక్యూ’ మూవీ టీమ్ మాత్రం ఇటలీ వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చింది. తాజాగా ఈ సినిమా ఇటలీ షూటింగ్ కష్టాలను బయటపెట్టింది రాశి ఖన్నా. ఆమె మాట్లాడుతూ.. కరోనా వేవ్ తాకిడి ఎక్కువ అవుతున్న వేళ ఇండియా నుండి బయటకు వెళ్లాలంటే భయం […] -
పెళ్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సీజ్
తెలంగాణలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. నిబంధనలు పాటించని వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఓ పక్క వాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులు.. మరోపక్క ఆకతాయిలను ఐసోలేషన్ కు తరలిస్తున్నారు. చాలా చోట్ల డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే, తాజాగా నిబంధనలను విరుద్దంగా పెళ్ళికి ఎక్కువమందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు పోలీసులు.. వికారాబాద్ జిల్లాలోని కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. […] -
గుంటూరు జిల్లాలో సెంచరీ దాటిన పెట్రోల్ ధరలు
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ఏపీలోని గుంటూరులో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. గుంటూరులో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 100.06 కు చేరింది. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇంకా పెరుగుతూ పోతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?