Google Notice: గూగుల్కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సృష్టించే నకిలీ వీడియోలు, ఫోటోలు (డీప్ఫేక్స్) సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటిని అరికట్టడానికి బలమైన చట్టాలు కావాలని దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై గుజరాత్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మెటా, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి దిగ్గజ సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
అక్రమ కంటెంట్ను వెంటనే తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ‘సహయోగ్’ అనే వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాట్ఫామ్లో అన్ని టెక్ సంస్థలు చేరాలని, పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. మే 8వ తేదీలోగా దీనిపై స్పందించాలని స్పష్టం చేసింది. గూగుల్, మెటా వంటి సంస్థలు కొంతవరకు సహకరిస్తున్నప్పటికీ, ‘ఎక్స్’ (X) సంస్థ మాత్రం సరిగ్గా స్పందించడం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో 94 సార్లు ఫిర్యాదులు చేసినా.. కేవలం 13 సార్లు మాత్రమే వారు సమాధానం ఇచ్చారని ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ".. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
Also Read:Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! అసలు కారణం అదేనా..?
అభ్యంతరకర వీడియోలను తొలగించమని నోటీసులు ఇచ్చినా.. కొన్ని సంస్థలు ఆలస్యం చేస్తున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు వివరించాయి. దీనివల్ల నేరస్తులను పట్టుకోవడం, తప్పుడు సమాచారాన్ని ఆపడం కష్టమవుతోందని తెలిపాయి. ప్రస్తుతమున్న ఐటీ చట్టాలు ఈ కొత్త రకం ‘డీప్ఫేక్’ టెక్నాలజీని ఎదుర్కోవడానికి సరిపోవని వికాస్ నాయర్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. ప్రజాస్వామ్యానికి, సామాజిక శాంతికి ఇవి ముప్పుగా మారకముందే కఠినమైన నియమాలు తీసుకురావాలని ఆయన కోరారు.
సాంకేతికత వేగంగా మారుతున్న తరుణంలో, అందుకు తగ్గట్టుగా కొత్త నిబంధనలు ఉండాలని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది. సోషల్ మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టపరమైన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించింది. ప్రభుత్వం, ఈ టెక్ సంస్థల మధ్య సమన్వయం ఉంటేనే ఇలాంటి నకిలీ ముప్పులను అరికట్టడం సాధ్యమవుతుంది.
తాజావార్తలు
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!