Google Notice: గూగుల్కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సృష్టించే నకిలీ వీడియోలు, ఫోటోలు (డీప్ఫేక్స్) సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటిని అరికట్టడానికి బలమైన చట్టాలు కావాలని దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై గుజరాత్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మెటా, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి దిగ్గజ సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
అక్రమ కంటెంట్ను వెంటనే తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ‘సహయోగ్’ అనే వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాట్ఫామ్లో అన్ని టెక్ సంస్థలు చేరాలని, పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. మే 8వ తేదీలోగా దీనిపై స్పందించాలని స్పష్టం చేసింది. గూగుల్, మెటా వంటి సంస్థలు కొంతవరకు సహకరిస్తున్నప్పటికీ, ‘ఎక్స్’ (X) సంస్థ మాత్రం సరిగ్గా స్పందించడం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో 94 సార్లు ఫిర్యాదులు చేసినా.. కేవలం 13 సార్లు మాత్రమే వారు సమాధానం ఇచ్చారని ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
- Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
- IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
- Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
Also Read:Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! అసలు కారణం అదేనా..?
అభ్యంతరకర వీడియోలను తొలగించమని నోటీసులు ఇచ్చినా.. కొన్ని సంస్థలు ఆలస్యం చేస్తున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు వివరించాయి. దీనివల్ల నేరస్తులను పట్టుకోవడం, తప్పుడు సమాచారాన్ని ఆపడం కష్టమవుతోందని తెలిపాయి. ప్రస్తుతమున్న ఐటీ చట్టాలు ఈ కొత్త రకం ‘డీప్ఫేక్’ టెక్నాలజీని ఎదుర్కోవడానికి సరిపోవని వికాస్ నాయర్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. ప్రజాస్వామ్యానికి, సామాజిక శాంతికి ఇవి ముప్పుగా మారకముందే కఠినమైన నియమాలు తీసుకురావాలని ఆయన కోరారు.
సాంకేతికత వేగంగా మారుతున్న తరుణంలో, అందుకు తగ్గట్టుగా కొత్త నిబంధనలు ఉండాలని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది. సోషల్ మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టపరమైన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించింది. ప్రభుత్వం, ఈ టెక్ సంస్థల మధ్య సమన్వయం ఉంటేనే ఇలాంటి నకిలీ ముప్పులను అరికట్టడం సాధ్యమవుతుంది.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: యూపీలో బీజేపీని ఓడిద్దాం.. అఖిలేష్కు ఓవైసీ ఆఫర్..
-
AP Rain Alert: ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
-
BJP: బీజేపీ పెద్ద లక్ష్యాల కోసం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చిన్న తాగ్యమా.?
-
Ishan Kishan: బ్యాటింగ్లో విధ్వంసం, కీపింగ్లో మిస్టేక్.. ధోనీలా ట్రై చేసి ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్..
-
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
ట్రెండింగ్
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!