Google Notice: గూగుల్కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సృష్టించే నకిలీ వీడియోలు, ఫోటోలు (డీప్ఫేక్స్) సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటిని అరికట్టడానికి బలమైన చట్టాలు కావాలని దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై గుజరాత్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మెటా, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి దిగ్గజ సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
అక్రమ కంటెంట్ను వెంటనే తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ‘సహయోగ్’ అనే వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాట్ఫామ్లో అన్ని టెక్ సంస్థలు చేరాలని, పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. మే 8వ తేదీలోగా దీనిపై స్పందించాలని స్పష్టం చేసింది. గూగుల్, మెటా వంటి సంస్థలు కొంతవరకు సహకరిస్తున్నప్పటికీ, ‘ఎక్స్’ (X) సంస్థ మాత్రం సరిగ్గా స్పందించడం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో 94 సార్లు ఫిర్యాదులు చేసినా.. కేవలం 13 సార్లు మాత్రమే వారు సమాధానం ఇచ్చారని ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
- Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
- 243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
- Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
Also Read:Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! అసలు కారణం అదేనా..?
అభ్యంతరకర వీడియోలను తొలగించమని నోటీసులు ఇచ్చినా.. కొన్ని సంస్థలు ఆలస్యం చేస్తున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు వివరించాయి. దీనివల్ల నేరస్తులను పట్టుకోవడం, తప్పుడు సమాచారాన్ని ఆపడం కష్టమవుతోందని తెలిపాయి. ప్రస్తుతమున్న ఐటీ చట్టాలు ఈ కొత్త రకం ‘డీప్ఫేక్’ టెక్నాలజీని ఎదుర్కోవడానికి సరిపోవని వికాస్ నాయర్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. ప్రజాస్వామ్యానికి, సామాజిక శాంతికి ఇవి ముప్పుగా మారకముందే కఠినమైన నియమాలు తీసుకురావాలని ఆయన కోరారు.
సాంకేతికత వేగంగా మారుతున్న తరుణంలో, అందుకు తగ్గట్టుగా కొత్త నిబంధనలు ఉండాలని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది. సోషల్ మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టపరమైన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించింది. ప్రభుత్వం, ఈ టెక్ సంస్థల మధ్య సమన్వయం ఉంటేనే ఇలాంటి నకిలీ ముప్పులను అరికట్టడం సాధ్యమవుతుంది.
తాజావార్తలు
-
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
-
TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
-
Nandamuri Mokshagna : నేడు చిన్న సింబా బర్త్ డే.. ఎంట్రీ అప్డేట్ ఉంటుందా ?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!