Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకులో ఎంత డబ్బు దాచుకుంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావు? మన సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో జమ చేయడం సహజం. అయితే, ఎంత మొత్తానికి మించి జమ చేస్తే ట్యాక్స్ కట్టాలి లేదా ప్రభుత్వానికి లెక్క చెప్పాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా..
సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ అకౌంట్లో రూ.10 లక్షల వరకు నగదు జమ చేసుకోవచ్చు. అంతకు మించి జమ చేస్తే.. బ్యాంకులు ఆ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి. అదే మీరు వ్యాపారాల కోసం వాడే కరెంట్ అకౌంట్ అయితే.. ఈ పరిమితి రూ.50 లక్షల వరకు ఉంటుంది.
Also Read
- ITR: ITR ఫైల్ చేస్తున్నారా? గుడ్డిగా ఈ పనులు చేయకండి.. లేదంటే తిప్పలు తప్పవు!
- Super Splendor: హీరో నుంచి కొత్త స్ల్పెండర్ బైక్ వచ్చేసింది.. అదరిపోయిన ఫీచర్స్.. తక్కువ ధరలోనే..
- Byjus Story: కోట్ల సామ్రాజ్యం నుంచి కోర్టు మెట్ల వరకు.. బైజూస్ రవీంద్రన్ పతనం వెనుక అసలు కథ ఇదే!
- Byju Raveendran: కటకటాల్లోకి బైజూస్ బాస్.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు, అసలు ఏం జరిగిందంటే?
మీరు జమ చేసే డబ్బు రూ.10 లక్షల లోపే ఉన్నా, అది పన్ను పరిధిలోకి రాదని గ్యారెంటీ లేదు. ఒకవేళ మీ వార్షిక ఆదాయం తక్కువ ఉండి, అకౌంట్లో ఎక్కువ డబ్బు జమ అయితే అధికారులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే అవకాశం ఉంటుంది. మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
పాన్ కార్డు (PAN Card): ఒకే రోజులో రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేయాలంటే ఖచ్చితంగా పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. ఇది పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
వడ్డీపై పన్ను: మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బుపై వచ్చే వడ్డీ రూ.10,000 లోపు ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది. అంతకు మించి వచ్చే వడ్డీని మీ మొత్తం ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.
క్రెడిట్ కార్డ్ బిల్లులు: క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో రూ.1 లక్ష కంటే ఎక్కువ చెల్లించినా అది ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వెళ్తుంది.
Also Read:RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన LSG..
పెద్ద మొత్తంలో నగదును బ్యాంకులో జమ చేయడం నేరం కాదు, కానీ ఆ డబ్బుకు సరైన లెక్క ఉండాలి. ఒకవేళ ఆ డబ్బు ఎలా వచ్చిందో మీరు నిరూపించలేకపోతే, దానిని ‘లెక్క చూపని ఆదాయం’గా పరిగణించి భారీగా జరిమానాలు వేసే అవకాశం ఉంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు నగదు లావాదేవీల కంటే ఆన్లైన్ బదిలీలు (UPI, NEFT) లేదా చెక్కుల ద్వారా లావాదేవీలు చేయడం సురక్షితం. దీనివల్ల పారదర్శకత ఉంటుంది.. అనవసరమైన విచారణల నుంచి తప్పించుకోవచ్చు. మీరు పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన రశీదులు లేదా ఆధారాలను భద్రపరుచుకోవడం మంచిది.
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!