Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకులో ఎంత డబ్బు దాచుకుంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావు? మన సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో జమ చేయడం సహజం. అయితే, ఎంత మొత్తానికి మించి జమ చేస్తే ట్యాక్స్ కట్టాలి లేదా ప్రభుత్వానికి లెక్క చెప్పాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా..
సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ అకౌంట్లో రూ.10 లక్షల వరకు నగదు జమ చేసుకోవచ్చు. అంతకు మించి జమ చేస్తే.. బ్యాంకులు ఆ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి. అదే మీరు వ్యాపారాల కోసం వాడే కరెంట్ అకౌంట్ అయితే.. ఈ పరిమితి రూ.50 లక్షల వరకు ఉంటుంది.
Also Read
- Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
- EXPLAINER: పెట్రోల్, ఇథనాల్లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
మీరు జమ చేసే డబ్బు రూ.10 లక్షల లోపే ఉన్నా, అది పన్ను పరిధిలోకి రాదని గ్యారెంటీ లేదు. ఒకవేళ మీ వార్షిక ఆదాయం తక్కువ ఉండి, అకౌంట్లో ఎక్కువ డబ్బు జమ అయితే అధికారులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే అవకాశం ఉంటుంది. మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
పాన్ కార్డు (PAN Card): ఒకే రోజులో రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేయాలంటే ఖచ్చితంగా పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. ఇది పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
వడ్డీపై పన్ను: మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బుపై వచ్చే వడ్డీ రూ.10,000 లోపు ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది. అంతకు మించి వచ్చే వడ్డీని మీ మొత్తం ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.
క్రెడిట్ కార్డ్ బిల్లులు: క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో రూ.1 లక్ష కంటే ఎక్కువ చెల్లించినా అది ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వెళ్తుంది.
Also Read:RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన LSG..
పెద్ద మొత్తంలో నగదును బ్యాంకులో జమ చేయడం నేరం కాదు, కానీ ఆ డబ్బుకు సరైన లెక్క ఉండాలి. ఒకవేళ ఆ డబ్బు ఎలా వచ్చిందో మీరు నిరూపించలేకపోతే, దానిని ‘లెక్క చూపని ఆదాయం’గా పరిగణించి భారీగా జరిమానాలు వేసే అవకాశం ఉంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు నగదు లావాదేవీల కంటే ఆన్లైన్ బదిలీలు (UPI, NEFT) లేదా చెక్కుల ద్వారా లావాదేవీలు చేయడం సురక్షితం. దీనివల్ల పారదర్శకత ఉంటుంది.. అనవసరమైన విచారణల నుంచి తప్పించుకోవచ్చు. మీరు పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన రశీదులు లేదా ఆధారాలను భద్రపరుచుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?