ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు.. ఈ కార్యక్రమంలో తమిళనాడు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ గీతాలక్ష్మి, కొండాలక్ష్మణ్ యునివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు.
టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్లో భాగంగా.. పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఉగాండా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 2024 పురుషుల టీ20 ప్రపంచకప్లో ఉగాండా తన తొలి మ్యాచ్లో విజయం సాధించింది. రియాజత్ అలీ షా (33) పరుగులతో రాణించడంతో విజయాన్ని నమోదు చేసింది. 78 పరుగుల తక్కువ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా.. 3 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియాను ఓడించింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన ఉగాండా జట్టు ఘనంగా సంబరాలు చేసుకుంది. అందుకు సంబంధించిన…
దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళం అయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన మొత్తం 2,600 మంది కుక్లు, వాటర్ క్యారియర్లకు పదోన్నతి లభించింది. 1939లో ఏర్పాటైన 85 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సీఆర్పీఎఫ్ క్యాటరింగ్లో రెండు ప్రత్యేక కేటగిరీలకు చెందిన మొత్తం 12,250 మంది సిబ్బందిని కలిగి ఉన్నారు. వీరు దళంలోని సుమారు 3.25 లక్షల మంది పురుషులు, మహిళా సిబ్బంది కోసం.. వంటశాలలు, క్యాంటీన్లు, ఇతర పరిపాలనా విధులను నిర్వహిస్తున్నారు.
2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే విజయం సాధించారు. ఈ క్రమంలో.. రాష్ట్ర కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే వినూత్నంగా.. నానా పటోలేను లడ్డూలతో తూకం వేశారు కార్యకర్తలు. రాష్ట్రంలో ఇండియా కూటమి అద్భుతమైన పనితీరును సంబరాలు చేసుకుంటున్నారు. కాంటాకు బంతిపూలతో చక్కగా అలంకరించి.. అందులో ఒక పక్కకు నానా పటోల్ ను కూర్చోబెట్టారు. మరో పక్కకు లడ్డూలను పెట్టి తూకం వేశారు. ఇందుకోసం మొత్తం 96 కిలోల లడ్డూలను వినియోగించారు.
భార్యభర్తల మధ్య గొడవ.. కొడుకు ప్రాణం తీసింది. గొడవ పడొద్దని అడ్డుగా వచ్చిన తనయుడిపై తండ్రి కోపంతో దాడి చేశాడు. దీంతో.. కొడుకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ క్రమంలో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బుధవారం బెంగళూరులో జరిగింది.
ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చూపించిన కింగ్ విరాట్ కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్లోనే నిరాశపరిచాడు. మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీపై.. టీమిండియ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో.. నిన్న ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగాడు. కానీ.. అనుకున్నంత స్థాయిలో ఆడలేక అభిమానులను నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అది కూడా.. పెద్ద టీమ్ బౌలర్లు కూడా కాదు.. పసికూన ఐర్లాండ్ బౌలర్లకే కోహ్లీ తడబడ్డాడు. 5 బంతులు ఆడిన కోహ్లీ..…
దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్ భారీ పతనం నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ 692, నిఫ్టీ 201 పాయింట్లు పెరిగాయి. ఈ వారంలో షేర్ మార్కెట్ రెండు సార్లు రికార్డులు సృష్టించింది. సోమవారం రోజున మార్కెట్ సూచీలు ఆల్ టైమ్ హై వద్ద ముగిశాయి. మంగళవారం రోజున మార్కెట్లో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ఒడిదుడుకులకు ఎన్నికల ఫలితాలే కారణం. బుధ, గురువారాల సెషన్లలో స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు కొనసాగింది. కాగా.. భారీ పతనం నుంచి కొంతమేర మార్కెట్ కోలుకుంది.…
ఓ మహిళ ప్రయాణికురాలు రైలులో ప్రయాణిస్తున్న వేళ.. తాను పడిన బాధను రెడ్డిట్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత గురించి మరోసారి లేవనెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. వనాంచల్ ఎక్స్ప్రెస్ స్లీపర్ కోచ్లో వెళ్తున్న తనను.. ఓ వ్యక్తి ఎలా వేధించాడో తెలిపింది. తాను.. స్లీపర్ కోచ్లో ఒంటరిగా ప్రయాణించడం ఇదే తొలిసారి అని చెప్పింది. కోచ్లో ఇద్దరు మగ ప్రయాణికులు తన ముందు సీట్లోనే కూర్చున్నారని.. అంతా బాగానే ఉందని పేర్కొంది. అయితే.. ఓ వ్యక్తి తనను…
దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నడూ లేనంతగా 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో.. రాజధాని ప్రజలు అటు ఎండలతో పాటు, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో.. ఢిల్లీ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నీరు కావాలని కోరగా.. అందుకు ఒప్పుకున్నారు. మరోవైపు.. సుప్రీంకోర్టు కూడా, ఢిల్లీకి 137 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేయాలని.. ఆదేశించింది. హిమాచల్ నుండి ఢిల్లీకి నీటిని సులభతరం చేయాలని హర్యానాను కోరింది.