Virat Kohli: ఏంటి ‘కింగ్’ ఐపీఎల్లో అలా.. ఇక్కడేమో ఇలా..
ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చూపించిన కింగ్ విరాట్ కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్లోనే నిరాశపరిచాడు. మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీపై.. టీమిండియ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో.. నిన్న ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగాడు. కానీ.. అనుకున్నంత స్థాయిలో ఆడలేక అభిమానులను నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అది కూడా.. పెద్ద టీమ్ బౌలర్లు కూడా కాదు.. పసికూన ఐర్లాండ్ బౌలర్లకే కోహ్లీ తడబడ్డాడు. 5 బంతులు ఆడిన కోహ్లీ.. మార్క్ అడైర్ ఓవర్లో క్యాచ్ రూపంలో ఔట్ అయ్యాడు.
Brahmaji : వాళ్ళు తప్పు చేస్తే మీరు అదే తప్పు చేయకూడదు.. ఏపీ పాలిటిక్స్ పై బ్రహ్మాజీ హాట్ కామెంట్స్
Also Read
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఛేజింగ్లో విరాట్ కోహ్లీ 50 కంటే తక్కువ పరుగులు సాధించడం 8 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 2016లో న్యూజిలాండ్పై జరిగిన మ్యాచ్లో కోహ్లీ 23 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎప్పుడూ 50 కంటే తక్కువ పరుగులు చేయలేదు. అయితే.. ఐపీఎల్ లో అదరగొట్టి, ఇప్పుడు బెదరగొడుతున్నందుకు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ట్రోఫీని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న టీమిండియాతో పాటు అభిమానులు.. గేర్ మార్చాలని అంటున్నారు. కోహ్లీ బ్యాటింగ్ రికార్డు విషయానికొస్తే.. టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో అద్భుతంగా ఉంది. ఛేజింగ్లో అతడి సగటు ఏకంగా 180.66గా ఉంది. టీ20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 542 పరుగులు సాధించాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 82 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 134.49గా ఉండగా.. 49 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి.
Chandrababu: ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కాగా.. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ 2024కప్ న్యూయార్క్లో జరుగుతుంది. బుధవారం రాత్రి నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ బౌలర్లు చెలరేగడంతో.. టీమిండియా 8 వికెట్ల తేడాతో ప్రపంచ కప్లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కేవలం 96 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ రాణించడంతో భారత్ అలవోక విజయం సాధించింది.
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో