IPL 2025కి ముందు నిర్వహించే మెగా వేలం కోసం ఆటగాళ్ల నిలుపుదల (Retention), విడుదల (Release) జాబితా విడుదల చేయబడింది. గురువారం మొత్తం 10 ఫ్రాంచైజీలు ఐపీఎల్ 2025 కోసం తమను కొనసాగించాలనుకుంటున్న పేర్లను ప్రకటించగా.. అదే సమయంలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు జట్లు వదిలేశాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలం నుండి టోర్నమెంట్లోని 10 జట్లు మొత్తం ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. చాలా మంది ఆటగాళ్లు విడుదలయ్యారు. విడుదలైన వారిలో స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సందడి కనిపిస్తోంది. అయితే.. దీపావళి రోజున మనమంతా కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే, దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో మోహరించి తమ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో.. దేశ ప్రధాని మోడీ సైనికులను ప్రోత్సహించారు. గుజరాత్లోని కచ్లో బీఎస్ఎఫ్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. మోడీ వారితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీపావళి.. ఒక్క మతానికో పరిమితం కాదు. చీకటిపై వెలుగు సాధించిన ఈ విజయాన్ని అందరూ జరుపుకుంటారు. వారణాసిలో ముస్లిం మహిళలు పూర్తి భక్తితో శ్రీరాముడికి హారతి ఇచ్చి.. ఆయన పేరిట దీపాలు వెలిగించడం దీనికి ఒక ప్రత్యేక ఉదాహరణ. వారణాసిలోని లాంహిలో ఉన్న ముస్లిం మహిళా ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇదే విధంగా జరుపుకుంటుంది.
పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో గంజాయిని తరలిస్తున్న ముఠాను కొమురం భీం జిల్లా వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్ర సరిహద్దు దాటే క్రమంలో పోలీసులు చాకచక్యంగా దొరకబట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా జిల్లా ఎస్పీకి సమాచారం వచ్చింది. దీంతో.. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ట్యాంకర్లో ఉన్న సుమారు 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో రెండు చోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నార పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హాష్ ఆయిల్ పట్టుకున్నారు. బండ్లగూడలో 300 ఎంఎల్ హాష్ ఆయిల్ను టీఎస్ఎన్ఏబీ (TSNAB) అధికారులు సీజ్ చేశారు. ఓ కిలేడీ లేడీ.. గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడీ ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమై ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇన్స్టాలో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (మం) జివంగి గ్రామానికి చెందిన చెందిన వినీల్ (19), న్యాల్కల్కి చెందిన ఓ బాలిక(16) పరిచయం ఏర్పడింది. ఏడు నెలలుగా ప్రేమ పేరుతో ఇన్స్టాలో బాలికతో చాటింగ్, కాల్స్ చేశాడు. కాగా.. ఇటీవల యువకుడు బాలిక గ్రామానికి వచ్చి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
సంగారెడ్డి జిల్లా నిజాంపేట (మం) ఖానాపూర్(బీ) గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒంటిపై ఉన్న బంగారు గుండ్ల కోసం అమ్మమ్మను హత్య చేశాడు మనవడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు, మెడలోని బంగారు గుండ్ల కోసం అమ్మమ్మ దుర్గమ్మ(60)తో గొడవపడ్డాడు మనవడు మహేష్(26).
హైదరాబాద్ గాంధీ భవన్లో ఇందిరా గాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎంపీ అనిల్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా బోకారోలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. సమావేశానికి ముందుగా ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించి.. అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు.