NTV WebDesk
Author- NTV Telugu-
టోక్యో ఒలింపిక్స్: సెమీస్కు చేరిన ఇండియా మహిళల హాకీ టీమ్…
టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు దూసుకుపోతున్నది. నిన్నటి రోజున పురుషుల హాకీ జట్టు బ్రిటన్ను ఓడించి సెమీస్కు చేరుకున్నది. 3-1తేడాతో బ్రిటన్ను ఓడించి సెమీస్లో బెల్జియంతో తలపడేందుకు సిద్ధమైంది. కాగా, అదే బాటలో ఇప్పుడు మహిళల హాకీ టీమ్ కూడా పయనిస్తోంది. మహిళల హాకీ టీమ్ బలమైన ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో ఓడించి సెమీస్ కు చేరుకున్నది. మొదటి క్వార్టర్లో ఏ జట్టు కూడా గోల్ చేయలేదు. రెండో క్వార్టర్ 22 వ నిమిషం వద్ద […] -
ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే…
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా తీవ్రతమాత్రం తగ్గడంలేదు. ఒక్క కేరళరాష్ట్రంలోనే రోజువారీ కేసుల్లో సగానికి పైగా నమోదవుతున్నాయి. తాజాగా ఇండియాలో గడిచిన 24 గంటల్లో 40,134 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,95,958కి చేరింది. ఇందులో 3,08,57,467 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,13,718 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 422 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి […] -
పోలీసుశాఖ కీలక నిర్ణయం: రాళ్లు రువ్వితే ఉద్యోగాలకు అనర్హులు…
జమ్మూకశ్మీర్ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎవరైతే రాళ్లు రువ్వుతారో, విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొంటారో వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చేయాలని పోలీసుశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటుగా, దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యవహారాల్లో పాల్గొనే వ్యక్తులు విదేశాలకు వెళ్లకుండా చూడాలని, అలాంటి వారికి పాస్పోర్ట్ జారీ చేయకూడదని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాస్పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించి దృవీకరణ పత్రాల పరిశీలన సమయంలో వీటిని కూడా పరిశీలించాలని పోలీసు శాఖ […] -
హిమాచల్లో ప్రకృతి విలయం…213 మంది మృతి…భారీ నష్టం…
ప్రతి ఏడాది వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్లో ప్రకృతి విలయాన్ని సృష్టిస్తుంటుంది. కొండచరియలు విరిగిపడటం అక్కడ కామన్. అయితే, ఈ వర్షాకాలంలో మరింత విలయాన్ని సృష్టించింది. ఈ విలయం దెబ్బకు 213 మంది మృతి చెందారు. రూ.600 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. భారీ వరదలకు 12 మంది కనిపించకుండా పోయినట్టు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొన్నది. ఇప్పటికీ ఇంకా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షాలకు […] -
అలాంటి వ్యక్తులే తోటమాలి ఉద్యోగానికి అర్హులు… అదిరిపోయే రిప్లై ఇచ్చిన మహిళ…
ఆస్ట్రేలియాలో ఓ కంపెనీ తోటమాలి ఉద్యోగానికి ధరఖాస్తులు కోరింది. ఆ ఉద్యోగం కోసం ఓ మహిళ ధరఖాస్తు చేసుకున్నది. తోటమాలి ఉద్యోగానికి బాడీబిల్డర్ కావాలని, సున్నితమైన మగువలు ఆ పని చేయలేరని, మీరు ఈ ఉద్యోగానికి అనర్హులని కంపెనీ సమాధానం ఇచ్చింది. ఈ ఉద్యోగానికి ఆర్హులని మీరు భావిస్తే ఫలానా నెంబర్ కు కాల్ చేయమని కంపెనీ నుంచి సమాధానం వచ్చింది. దీనిపై సదరు మహిళ ఘాటుగా రిప్లై ఇచ్చింది. తనకు వ్యవసాయ పనుల్లో అనుభవం ఉందని, […] -
ఆగస్టు 2, సోమవారం దినఫలాలు
మేషం : కొత్త వ్యాపారాభివృద్ధికి శ్రమించాలి. విద్యార్థులకు కోరుకున్న టెక్నికల్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్వయంకృషితో రాణిస్తారు. వృషభం : ఆర్థికపరమైన విషయాలతో పాటు పనిలో కూడా రాజీపడవలసి వస్తుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. క్రీడా రంగాల వారికి చికాకులు తప్పవు. విద్యార్థులకు, విద్యా రంగాల […] -
ఇంజనీర్ బన్గయా చాయ్వాలా…
ఒకప్పుడు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుండేది. కానీ, ఇప్పుడు డిగ్రీలు, పీహెచ్డీలు చేసిన వారు కూడా క్లర్క్ జాబ్కోసం ట్రై చెయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత నిరుద్యోగం అనె లెక్కన మారిపోయింది. చదువుకున్న చదువు అక్కరకు రాకపోతే నచ్చిన వచ్చిన పనులు చేసుకుంటూ నాలుగు రూకలు సంపాదించి కుటుంబాన్ని నడుపుతున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు అమీర్ సోహైల్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి చిన్న ఉద్యోగం చేస్తున్నప్పటికీ […] -
అమెరికాను భయపెడుతున్న డెల్టా… కేసులు పెరిగినా…
ప్రపంచంలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నది. 130కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించింది. అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యాక జో బైడెన్ 100 రోజుల కార్యాచరణను తీసుకొచ్చారు. 100 రోజులు ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని, ఆ తరువాత అవసరం లేదని అన్నారు. 100 రోజుల కార్యచరణ తరువాత మాస్క్ను తప్పని సరి నుంచి తొలగించారు. ఆ తరువాత కథ మళ్లీ మొదటికి వచ్చింది. గత పది రోజుల నుంచి ఆ దేశంలో కేసులు […] -
బంపర్ ఆఫర్: టీకా వేసుకుంటే వ్యాక్సిన్ వోచర్లు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచ దేశాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. అన్ని దేశాల్లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. అయితే, అభివృద్ది చెందిన దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అక్కడి ప్రభుత్వాలు వ్యాక్సిన్ తీసుకునే వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. బ్రిటన్లో ఇప్పుడు ఇదే చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి షాపింగ్ వోచర్లు, పిజ్జా డిస్కౌంట్లు, ప్రయాణాల్లో రాయితీల పేరుతో వ్యాక్సిన్ వోచర్లను […] -
ఐరాసలో భారత్కు సరికొత్త బాధ్యత: భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో ఇండియా…
ఐక్యరాజ్యసమితిలో భారత్కు సరికొత్త బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇండియా భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగుతోంది. సభ్యదేశంగా కొనసాగుతున్న ఇండియాలకు ఇప్పుడు ఆ మండలి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ పదవిలో భారత్ నెలరోజులపాటు కొనసాగుతుంది. ఇంతకు ముందు ఫ్రాన్స్ ఆ హోదాలో కొనసాగింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిది టిఎస్ తిరుమూర్తి బాధ్యతలు చేపట్టారు. భారత్కు ఈ పదవి వచ్చేందుకు ఫ్రాన్స్ సహకరించింది. ఈ ఆగస్టు నెలలోనూ అదే విధంగా తాత్కాలిక సభ్యదేశంగా తప్పుకునే చివరి […]
తాజావార్తలు
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
-
Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!