NTV WebDesk
Author- NTV Telugu-
దేశంలో ఎన్ని డెల్టా ప్లస్ కేసులు ఉన్నాయో తెలుసా?
దేశంలో కరోనా కేసులు ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలో నమోదవుతున్న రోజువారి కరోనా కేసుల్లో సగానికి పైగా కేసులు కేరళ రాష్ట్రం నుంచే నమోదవుతున్నాయి. ఓనం పండుగ తరువాత నుంచి ఆ రాష్ట్రంలో కేసులు పెరగడం మొదలయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో దేశంలో జరుపుకునే పెద్దపండగలైన వినాయక చవితి, దసరా, దీపావళి వంటి వాటిపై కరోనా ప్రభావం పడే అవకాశం స్పష్టంగా ఉన్నది. పండుగల కోసం ఒక చోట పెద్ద సంఖ్యలో గుమిగూడితే కరోనా […] -
ఆఫ్ఘన్లో రోడ్డెక్కిన మహిళలు… మాకు అవకాశం ఇవ్వండి…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తప్పుకున్నాక తాలిబన్లు ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. రేపటి రోజున ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉన్నది. ఇప్పటికే కొన్ని తాత్కాలిక శాఖలు ఏర్పాటు చేసినా, రేపటి రోజున ప్రభుత్వం కొలువుదీరాక పూర్తిస్థాయి శాఖలు ఏర్పాటు చేయవచ్చు. అయితే, తాలిబన్ల పరిపాలనలో మహిళలకు రక్షణ ఉండదు. వారంతా ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. అంతేకాదు, మహిళలకు హక్కులు ఏ మాత్రం ఉండవు. ఎవరైనా ఎదిరించి బయటకు వస్తే వారికి ఎలాంటి […] -
అలా చేయడం మంచిది కాదు… ప్రధానికి లేఖ రాస్తా…
కేంద్రం ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం వంటివి చేయడం మంచిది కాదని దీనిపై ప్రధాని మోడికీ లేఖ రాస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ విధానంపై ఆయన ఈరోజు విమర్శలు చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజా ఆస్తులని, అవి దేశ భవిష్యత్తుకు, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటు చేశారని, వాటిని అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం వంటిది దేశప్రయోజనాలకు మంచిది కాదని […] -
9 మంది నేతలతో కాంగ్రెస్ కీలక కమిటీ… దేనికంటే…
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 మంది సీనియర్ నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ను చైర్మన్గా నియమించారు. జాతీయ స్థాయిలో పోరాటాలకు ప్రణాళికలను రూపోందించే ఈ కమిటీలో ప్రియాంక గాంధీ, ఉత్తమ్కుమార్ రెడ్డి, మనీశ్ ఛత్రత్, బీకే హరిప్రసాద్, రిపున్ బోరా, ఉదిత్ రాజ్, రాగిణి నాయక్, జుబిర్ ఖాన్ లు సభ్యులుగా ఉండబోతున్నారు. దేశంలోని […] -
తెలంగాణ కరోనా అప్డేట్: కొత్తగా కేసులు ఎన్నంటే…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,58,689కి చేరింది. ఇందులో 6,49,002 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,809 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 3,878 కి చేరింది. ఇక తెలంగాణలో వేగంగా […] -
ఆ రాష్ట్రాల్లో వందశాతం వ్యాక్సినేషన్లు…
దేశంలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. గత రెండు మూడు రోజులుగా రోజుకు కోటి వరకు వ్యాక్సినేషన్లను అందిస్తున్నారు. ఆర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని, అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లను అందిస్తున్నామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దేశంలో 66 […] -
ఆఫ్ఘన్ సరిహద్దులు దాటేందుకు… ప్రజలు ఏం చేశారంటే…!!
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రజలు బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టు 30 వరకు కాబూల్ ఎయిర్పోర్ట్ వైపు పరుగులు తీసిన ప్రజలు ఇప్పుడు అక్కడ ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు. అమెరికా దళాలు లేకపోవడంతో ప్రజలంతా ఏమయ్యారు… ఎటువెళ్లారు. తిరిగి ఇళ్లకు వెళ్లారా అనే డౌట్ రావొచ్చు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత ప్రజలు రూటు మార్చి ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దుల వైపు పరుగులు తీశారు. వేల సంఖ్యలో ఇరాన్ సరిహద్దులకు ప్రజలు చేరుకోవడంతో అక్కడ భద్రతను […] -
ఆ నగరంలో పుట్పాత్లపై అమ్మకం నిషేదం… ఉల్లంఘిస్తే…
నగరాల్లో చిరు వ్యాపారులు ఫుట్పాత్లపైనే వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ప్రత్యేకమైన వ్యాపార సముదాయాలు ఉండవు కాబట్టి వీరికి ఫుట్ పాత్లే వ్యాపార సముదాయాలుగా మారిపోతుంటాయి. నగరపాలక సంస్థలు, అధికారులు, పాలకులు వీటి గురించిపెద్దగా పట్టించుకోరు. అయితే, గత కొంత కాలంగా ఫుట్పాత్ వ్యాపారులపై నగరపాలక సంస్థలు దృష్టిసారించాయి. విశాఖ నగరపాలక సంస్థ దీనిపై ముఖ్యంగా దృష్టి సారించింది. నగరంలోని అనే ఫుట్పాత్లపై చిరు వ్యాపారులు చేపలను విక్రయిస్తుంటారు. నగరంలో ఏ ఫుట్పాత్లపై చూసిన చేపల విక్రయాలే కనిపిస్తుంటాయి. దీంతో […] -
రాజస్థాన్లో అద్భుతం: రెండు తలలతో వింత గేదె జననం… పూర్తి ఆరోగ్యంగా…
రాజస్థాన్లో ఓ అద్భుతం జరిగింది. రెండుతలలో ఓ వింత గేదే జన్మించింది. రెండు తలల, నాలుగు కాళ్లు ఉన్న ఇలాంటి గేదెలు సాధారణంగా పుట్టిన కాసేపటికి మరణిస్తుంటాయి. కానీ, ఈ గేదె మాత్రం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు పశువైద్యులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యంతో ఉండటంతో పాటుగా ఆహారం రెండు తలలకు ఉన్న నోటి నుంచి తీసుకుంటుందని దాని యజమానులు చెబుతున్నారు. రెండు తలలతో జన్మించిన గేదె పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఆహారం కూడా తీసుకుంటూ ఉండటంతో […] -
ఒకవైపు కరోనా… మరోవైపు భారీ వర్షాలు… ఆ నగరంలో ఎమర్జెన్సీ…
అమెరికాలో కరోనా కేసులు తగ్గినట్టుగానే తగ్గి తిరిగి భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఆ దేశంలో లక్ష వరకు కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఒకవైపు కరోనా కేసులతో అతలాకుతలం అవుతుంటే, ఇప్పుడు భారీ వర్షాలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. హరికేన్ ఇదా దెబ్బకు దేశం విలవిలలాడిపోతున్నది. న్యూయార్క్లో ఎప్పడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ప్రమాదకరమైన స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. రోడ్లన్ని సెలయేరులా మారిపోవడంతో ఎమర్జెన్నీని విధించారు. […]
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?