Sharath Kumar : విజయ్ రాజకీయ నాయకుడే కాదు.. హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ నటుడు, బీజేపీ నేత శరత్ కుమార్ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురై తిరుపరంకుండ్రం దీపం వివాదం మొదలుకొని, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు పలు అంశాలపై ఆయన కుండబద్దలు కొట్టారు. మదురై తిరుపరంకుండ్రం దీపం వెలిగించే విషయంలో తలెత్తిన వివాదంపై శరత్ కుమార్ స్పందిస్తూ.. ప్రస్తుత సమాజంలో హిందువుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. “నేడు హిందువులుగా ఉన్నవారు తాము హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారని, అసలు ‘హిందూ’ అనే పదాన్నే మర్చిపోయే పరిస్థితి వచ్చిందని” ఆయన కామెంట్ చేశారు. హిందూ ధర్మం పట్ల జరుగుతున్న వివక్షను ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు.
Also Read :Sharwa: డిజాస్టర్ డైరెక్టర్’తో శర్వా నెక్స్ట్?
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
వచ్చే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని శరత్ కుమార్ స్పష్టం చేశారు. అయితే రాజకీయాలకు దూరం కావడం లేదని, కేవలం ఎన్నికల బరిలో నిలబడబోనని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పార్టీ తరఫున తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తానని చెప్పారు. తమిళనాడులో ప్రస్తుత డిఎంకే (DMK) ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా శ్రమిస్తానని పేర్కొన్నారు. తనకు పోటీ చేసే అవకాశం వచ్చినా, దాన్ని ఇతరులకు ఇచ్చి ప్రోత్సహిస్తానని ఆయన వెల్లడించారు.
Also Read :Jana Nayagan: రివర్స్ రీమేక్.. దూరమైన సితార
తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ పార్టీ (TVK) స్థాపనపై శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “నేను విజయ్ను రాజకీయ నాయకుడిగా చూడటం లేదు. రాజకీయాల్లో ఎవరికి ఏది మంచో, ఏది చెడ్డదో ఆయనకు ఇంకా తెలియదు” అని శరత్ కుమార్ అభిప్రాయపడ్డారు. విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఆయన అప్పుడే ఒక అంచనాకు రాలేమని, రాజకీయ క్షేత్రంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో అనుభవం అవసరమని పరోక్షంగా కామెంట్ చేశారు. మొత్తానికి శరత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు హిందూత్వ రాజకీయాల పరంగా, ఇటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీకరణాల పరంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?