NTV WebDesk
Author- NTV Telugu-
అమీర్ సారీ చెప్పాలి: పాక్ క్రికెటర్
క్రికెట్ అంటే ఎంతో అభిమానం ఉన్న దిగ్గజ క్రికెటర్లు అప్పుడప్పుడు మాటల తూటాలు పేల్చుతూ ఏదో ఒక ఘర్షణ వాతావరణానికి కారణం అవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కాకపోతే సోషల్ మీడియాలో .. భారత్, పాక్ మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, మహ్మద్ అమీర్ ట్విట్టర్ వార్పై పాక్ మాజీ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్ స్పందించాడు. “షోయబ్ అక్తర్, హర్భజన్ మధ్య జరగుతున్న చర్చలోకి అమీర్ దూరడం తప్పు. అనీ అందుకు అతడు […] -
రాకెట్ ఇంధనం అందిస్తున్న ఆంధ్రా షుగర్స్
తణుకులోనిలోని ఆంధ్రా షుగర్స్ భారతీయ అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేస్తున్న రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్రను పోషిస్తుంది. ఈ ప్రయోగా లకు కావాల్సిన ద్రవరూప ఇంధనాన్ని రూపొందించడంలో ఆంధ్రా షుగర్స్ విజయం సాధించింది. ఇస్రో- ఆంధ్రాషుగర్స్ సహ కారం 1984లో ప్రారంభం కాగా 1985లో మార్చిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారం భానికి పైలెట్ ప్రాజెక్టు స్థాపనకు ఇస్రో ఆంధ్రా షుగర్స్ కు మధ్య ఒప్పందం జరిగింది.1988 జూలై4 ప్లాంటును జాతికి అంకితం చేశా రు. కీలకమైన అంతరిక్ష పరిశోధన […] -
జర్మనీలో కోవిడ్ కొత్త కేసుల ఆల్టైం రికార్డ్
జర్మనీలో కరోనా కొత్త కేసుల్లో ఆల్టైం రికార్డు సృష్టించింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఎన్నడు రానన్ని కొత్త కేసులు నమోదు కావడం ఆ దేశాన్ని కలవర పెడుతుంది. గడిచిన 24గంటల వ్యవధి లోనే జర్మనీలో 33,949 కొత్త కేసులు నమోదైనట్టు అధికారలు వెల్ల డించారు. గతేడాది డిసెంబర్ 18నఅత్యధికంగా 33,777 కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పుడు ఆ సంఖ్యను మించిపోయాయి. దీంతో జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి జెన్స్స్పాన్ 16 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో […] -
కర్ణాటకలో తగ్గిన పెట్రోల్, డిజీల్ ధరలు ఎంతంటే..
పెట్రోలు, డిజీల్పై కేంద్రం వరుసగా రూ.10, రూ.5 తగ్గించిన నేపథ్యంలో, కర్ణాటకప్రభుత్వం పెట్రోల్, డిజీల్పై సేల్స్ ట్యాక్స్ రేటును రూ.7 తగ్గిస్తూ, దీపావళి సందర్భంగా ప్రజలకు తీపి కబురు నందించింది. రాష్ట్రంలో డీజిల్ ధర రూ.104.50 నుంచి రూ.85.03కి తగ్గింది, రూ.19.47 తగ్గింపు’’ అని జీవో జారీ చేసింది. పెట్రోలు ధర రూ. 113.93 నుంచి రూ. 100.63కి తగ్గింది, రూ. 13.30 తగ్గింపు’’ అని ఆ జీవోలో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. పెట్రోల్, డీజిల్పై పన్నుల్లో […] -
బీజేపీ డ్రామాలు ఆడుతుంది: లాలూ ప్రసాద్ యాదవ్
పెట్రోల్, డీజిల్ రేట్లు ఇష్టానుసారం పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులను దోపీడి చేస్తున్నాయని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. పెట్రోల్, డిజీల్ పై లీటర్ ధరపై కేంద్రం రూ.5, రూ.10 తగ్గించి బీజేపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. లీటర్పెట్రోల్పై రూ.50 తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే దేశ ప్రజలకు మేలు జరుగుతందని ఆయన అభిప్రాయ పడ్డారు. అయితే యూపీలో ఎన్నికలు పూర్తవ్వగానే కేంద్రం మళ్లీ […] -
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలి: రాజాసింగ్
దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పెట్రో ల్, డీజిల్ ధరల పెరుగుదలను అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రభు త్వం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. విమర్శించడం సులభమే.. కానీ ఆచరణలో పాటించడానికి బలముండాలన్నారు. పెట్రోల్పై రూ.41 పన్ను వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.8 నుంచి రూ.10 తగ్గించాలని […] -
గుజరాత్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంతంటే?
ఒకవైపు దీపావళి పండుగ.. మరోవైపు పండుగ సందడి వేళ గుజరాత్ లోని ద్వారక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ మధ్య కాలంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా దీపావళి పండుగనాడు గురువారం గుజరాత్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ద్వారకకు ఉత్తర వాయువ్య దిశగా 223 కిలోమీటర్ల […] -
సోషల్ మీడియాకు దూరంగా సమంత
సమంత-చైతూ విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంతను ఏదో రకంగా విమర్శిస్తున్నారు చైతూ అభిమానులు. దీంతో సమంత మరో షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైతూతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ట్విట్టర్, ఇన్స్టాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె ఏ పోస్టు పెట్టినా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమంత తీవ్ర మనోవేదనకు గురైంది. ఇక నుంచి ట్రోల్స్ నుంచి తప్పించుకునేందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే సామ్ […] -
ఒకవైపు క్రాకర్స్.. మరోవైపు స్వీట్స్.. దీపావళి వేళ సందడి
దీపావళి సందర్భంగా క్రాకర్స్ కి ఎంత హడావిడి వుంటుందో స్వీట్స్ కి కూడా అంతే. బంధు మిత్రులకు స్వీట్స్ పంచుతూ, తియ్య తియ్యని స్వీట్స్ తింటూ సందడి చేస్తారు. హైదరాబాద్ లో కరోనా భయం నుంచి కోలుకుంటోంది. దీపావళి సందర్భంగా స్వీట్ షాపుల్లో హడావిడి పెరిగింది. అన్ని వర్గాలకు అందుబాటులో వుండే విధంగా జంబో స్వీట్ ప్యాక్ లు అందుబాటులోకి తెచ్చారు నిర్వాహకులు. బొకేల తరహాలో స్వీట్స్ చేతితో తాకకుండా కరోనా నిబంధనలతో తయారుచేశారు. ఈ స్వీట్లు […] -
ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలి: సీపీఐ నేత రామకృష్ణ
ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.10 చొప్పున తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కాలంగా లీటర్ పెట్రోల్ పై రూ.36, డీజిల్ పై రూ.25 చొప్పున పెంచిందన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ.10 తగ్గించిందని, తెలంగాణతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాయని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 […]
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!