కరోనా ఎఫెక్ట్.. కాంతుల్లేని దీపావళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిండివంటలు, స్వీట్లు ప్రతి పండుగలోనూ కనిపిస్తాయి. కానీ దీపావళి సమ్ థింగ్ స్పెషల్ పండుగ. ప్రజలకు వెలుగుల పండుగ కాగా వ్యాపారులకు కాసులు కురిపించే పండగ. ప్రతి ఇంటి ముందూ విరజిమ్మే టపాసుల వెలుగులు తగ్గనుందా..? అన్న ఆందోళనలో ప్రజలు వున్నారు.
టపాసుల అమ్మకం కోసం పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా? రాదా? అనే ఆందోళనలో వ్యాపారులు ఉన్నారు. మార్కెట్లో టపాసుల కొరత తీవ్రంగా వుంది. లాక్ డౌన్ లో ఉత్పత్తి లేకపోవడం… శివకాశీలో ప్రమాదం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దీపావళి టపాసులు అంతగా కనిపించడం లేదు. రెట్టింపు ఇన్వెస్టిమెంట్ పెట్టినా.. స్టాక్ దొరకడం లేదు అంటున్నారు వ్యాపారులు. లాక్ డౌన్ వల్ల షాపులకు జనం రావడం లేదంటున్నారు. యువత ఎక్కువగా కొనుగోలు చేసే 10 థౌసండ్ వాలా, 5 థౌసండ్ వాలాలు దొరకడం లేదు. గతేడాది కంటే 10 నుంచి 20 శాతం ధరలు పెరిగాయి. గత రెండురోజులుగా ధరల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
దీపావళి క్రాకర్స్ ధరలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో దీపావళి కాంతులు పెద్దగా కనిపించడం లేదు.బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండురోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటువంటి ముసురు వాతావరణం ఉన్నా, వర్షాలు పడుతున్నా టపాసులు పేలడం కష్టం. దీంతో ఈ సంవత్సరం అమ్మకాలు ఏ విధంగా ఉంటాయోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.ఏపీ అంతటా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి శివకాశి, చెన్నై, పర్లాకిమిడి నుంచి టపాసులను తెప్పించిన వ్యాపారులకు వాతావరణం కలవరపాటుకు గురవుతున్నారు. దీపావళి పండగకు వారం పది రోజుల ముందు నుంచే టపాసుల మోత వినిపించేది. అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితి మారిపోయింది. ప్రతి సంవత్సరమూ వీటి ధరలు పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం ఇందుకు కారణమని చెప్పొచ్చు.
గతంలో రూ.500లు ఖర్చు పెడితే ఒక మోస్తరుగా టపాసులు వచ్చేవి. ఈ ఏడాది ధరలు రెట్టింపు కావడంతో కొద్దిపాటి టపాసులు కావాలన్నా కనీసం రూ.1000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో టపాసుల సంగతి అలా ఉంచితే కొవ్వొత్తులతోనే సరిపెట్టుకుందామన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మరోవైపు గ్రీన్ టపాసులనే ఉపయోగించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!