కరోనా ఎఫెక్ట్.. కాంతుల్లేని దీపావళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిండివంటలు, స్వీట్లు ప్రతి పండుగలోనూ కనిపిస్తాయి. కానీ దీపావళి సమ్ థింగ్ స్పెషల్ పండుగ. ప్రజలకు వెలుగుల పండుగ కాగా వ్యాపారులకు కాసులు కురిపించే పండగ. ప్రతి ఇంటి ముందూ విరజిమ్మే టపాసుల వెలుగులు తగ్గనుందా..? అన్న ఆందోళనలో ప్రజలు వున్నారు.
టపాసుల అమ్మకం కోసం పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా? రాదా? అనే ఆందోళనలో వ్యాపారులు ఉన్నారు. మార్కెట్లో టపాసుల కొరత తీవ్రంగా వుంది. లాక్ డౌన్ లో ఉత్పత్తి లేకపోవడం… శివకాశీలో ప్రమాదం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దీపావళి టపాసులు అంతగా కనిపించడం లేదు. రెట్టింపు ఇన్వెస్టిమెంట్ పెట్టినా.. స్టాక్ దొరకడం లేదు అంటున్నారు వ్యాపారులు. లాక్ డౌన్ వల్ల షాపులకు జనం రావడం లేదంటున్నారు. యువత ఎక్కువగా కొనుగోలు చేసే 10 థౌసండ్ వాలా, 5 థౌసండ్ వాలాలు దొరకడం లేదు. గతేడాది కంటే 10 నుంచి 20 శాతం ధరలు పెరిగాయి. గత రెండురోజులుగా ధరల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
దీపావళి క్రాకర్స్ ధరలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో దీపావళి కాంతులు పెద్దగా కనిపించడం లేదు.బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండురోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటువంటి ముసురు వాతావరణం ఉన్నా, వర్షాలు పడుతున్నా టపాసులు పేలడం కష్టం. దీంతో ఈ సంవత్సరం అమ్మకాలు ఏ విధంగా ఉంటాయోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.ఏపీ అంతటా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి శివకాశి, చెన్నై, పర్లాకిమిడి నుంచి టపాసులను తెప్పించిన వ్యాపారులకు వాతావరణం కలవరపాటుకు గురవుతున్నారు. దీపావళి పండగకు వారం పది రోజుల ముందు నుంచే టపాసుల మోత వినిపించేది. అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితి మారిపోయింది. ప్రతి సంవత్సరమూ వీటి ధరలు పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం ఇందుకు కారణమని చెప్పొచ్చు.
గతంలో రూ.500లు ఖర్చు పెడితే ఒక మోస్తరుగా టపాసులు వచ్చేవి. ఈ ఏడాది ధరలు రెట్టింపు కావడంతో కొద్దిపాటి టపాసులు కావాలన్నా కనీసం రూ.1000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో టపాసుల సంగతి అలా ఉంచితే కొవ్వొత్తులతోనే సరిపెట్టుకుందామన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మరోవైపు గ్రీన్ టపాసులనే ఉపయోగించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..