ఎటు చూసినా గంజాయ్.. స్మగ్లర్లకు పోలీసుల చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా మూడు పువ్వులు-ఆరు కాయలుగా వర్థిల్తుతోంది. ఏదో ఒక చోట, ఏదో ఒక విధంగా గంజాయిని అక్రమరవాణా చేస్తూ కేటుగాళ్ళు పట్టుబడుతున్నారు. సంగారెడ్డిలో ప్రొహిబీషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. కంది, చేర్యాల గ్రామం ,రుద్రారం,భానూరు, వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో గంజాయి లభ్యం అయింది. చేర్యాల గ్రామానికి చెందిన సాయినాథ్ రెడ్డి , భానూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల నుండి 85డబ్బాల్లో, 425 గ్రాముల ఆశిష్ ఆయిల్, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1,70,000 అని అధికారులు తెలిపారు.
బీదర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న కర్ణాటక బస్సును ఆపి తనిఖీ చేయగా గంజాయిని రవాణా చేస్తున్న రుద్రారం గ్రామానికి చెందిన మధుకర్ పట్టుబడ్డాడు. అతని నుండి 18 పాకెట్స్ గల 90 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3600. ఈ ముగ్గురు నిందితులను కోర్టుముందు హాజరు పరిచారు పోలీసులు. విచారణలో అనేక విద్యాలయాల్లో మత్తు పదార్థాలు వాడుతున్నట్లు బయట పడింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు ఎక్సైజ్ శాఖ పోలీసులు.
Also Read
- UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ గంజాయి గుప్పుమంటోంది. ఛత్తీస్ గడ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారు. MP 09 HH 3684 లారీలో తరలిస్తున్న 34 బ్యాగుల 825కేజీల గంజాయిని సీజ్ చేశారు. సుమారు 1కోటి65లక్షల విలువగల గంజాయిని పట్టుకున్నారు చుంచుపల్లి పోలీసులు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని విలేకర్ల సమావేశంలో వెల్లడించారు జిల్లా ఎస్పీ సునీల్ దత్.
తాజావార్తలు
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!