NTV WebDesk
Author- NTV Telugu-
ప్రపంచదిశను మార్చేస్తున్న రోబోలు…
టెక్నాలజీ అభివృద్ది చెందిన తరువాత మనిషి తన అవసరాల కోసం, ప్రపంచం మనుగడ కోసం రోబోలను తయారు చేశాడు. ఈ రోబోలు మనిషికి అన్ని రంగాల్లోనూ సహకరిస్తున్నాయి. కృత్రిమ మేధతో తయారైన రోబోలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్తో సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా రోబోలకు ఉంటుందనడంలో సందేహం అవసరం లేదు. మనుషులు ఆలోచించిన విధంగానే రోబోలు కూడా ఆలోచించగలిగితే మనిషి మనుగడకే ప్రమాదం కావొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2021లో చాలా […] -
ఎలన్ మస్క్ కు ఆ భయం ఎక్కువ…అందుకే గొప్పవాడయ్యాడట…
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ బిజినెస్ మెన్ అయితే ఆయన అత్యంత కౄరుడు కావడంతో ఆయనంటే మస్క్కు నచ్చదు. అందుకే చిన్నతనం నుంచి కష్టపడి తన సొంతకాళ్లపై నిలబడుతూ చదువుకున్నాడు. చదువుకునే రోజుల నుంచే పనిచేయడం మొదలుపెట్టాడు. కష్టం విలువ తెలుసు కాబట్టే ఈరోజు ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదగగలిగాడు. అయితే, చిన్నతనం నుంచి మస్క్ నలుగురిలో మాట్లాడాలంటే భయపడిపోతాడు. చాలా భయస్తుడు. మస్క్కు ఆటిజం సమస్య ఉంది. ఆ భయం. […] -
మయన్మార్లో ఆగని మారణహోమం… 30 మంది కాల్చివేత…
మయన్మార్లో మారణహోమం ఆగడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసి ఆర్మీ పాలనను అధీనంలోకి తీసుకున్నది. వ్యతిరేకించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నది. కరోనా మహమ్మారి సమయంలో సైలెంట్గా ఉన్న సైన్యం మళ్లీ ఇప్పుడు రెచ్చిపోతున్నది. కహాయ్ రాష్ట్రంలోని మోసో గ్రామంలో సాయుధ బలగాలకు, సైన్యానికి మధ్య రడగ జరిగే సమయంలో మోసో గ్రామం నుంచి ప్రజలు శరణార్థి శిబిరాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులు జరిగాయి. Read: వింత దొంగ: చలిమంట కోసం వాహనాలను దొంగతనం […] -
వింత దొంగ: చలిమంట కోసం వాహనాలను దొంగతనం చేశాడట…
మహారాష్ట్రలోని నాగపూర్లోని యశోధరానగర్లో వరసగా వాహనాలు దొంగతనానికి గురవుతుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరసగా ఫిర్యాదులు అందుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు ఈకేసులో నలుగురికి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 వాహనాలును రికవరి చేసేశారు. అయితే, పదో వాహనం గురించి సర్పరాజ్ అనే దొంగను ప్రశ్నించగా, అతను చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. చలి బాగా పెరిగిపోవడంతో బైక్కు నిప్పు అంటించి చలికాసుకున్నామని చెప్పాడు. దొంగచెప్పన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. నలుగురు […] -
ఒమిక్రాన్ టెన్షన్: ఢిల్లీ, ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు…
దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకు పెరుగుతున్నది. ఒమిక్రాన్ కేసులు పెరిగే కొలది కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆరునెలల తరువాత మరలా ఢిల్లీ, ముంబై లో కేసులు పెరుగుతుండటంతో దేశం అప్రమత్తం అయింది. శనివారం రోజున ఢిల్లీలో 38శాతం కేసులు పెరగ్గా, ముంబైలో 10శాతం కేసులు పెరిగాయి. ఢిల్లీలో శనివారం రోజున 249 కొత్త కేసులు నమోదవ్వగా, ముంబైలో 757 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ముంబైలో నైట్ కర్ఫ్యూతో […] -
డిసెంబర్ 26, ఆదివారం దినఫలాలు
మేషం :- రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాల నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారముంది. స్త్రీల కోరికలు, మనోవాంఛలు నెరవేరుతాయి. వృషభం :- మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అయినవారి నుంచి అభిమానాన్ని, ప్రేమను మరింత పొందుతారు. మీ […] -
కోహ్లీ నుంచి నేను ఇదే కోరుకుంటున్నా: ద్రావిడ్
దక్షిణాఫ్రికా గడ్డపై కెప్టెన్ కోహ్లీ నుంచి తాను ఒక గొప్ప సిరీస్ ను కోరుకుంటున్నానని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. కోహ్లీ ఒక అద్భుతమైన ఆటగాడే కాకుండా, గొప్ప కెప్టెన్ అని కితాబిచ్చారు. టెస్టుల్లో మన జట్టు పురోగతిని కొనసాగించాలని తాము భావిస్తున్నామని చెప్పారు. జట్టు పురోగతిలో కోహ్లీ పోషించిన పాత్ర గొప్పదన్నారు. టెస్టు క్రికెట్ను అమితంగా ఇష్టపడే ఆటగాళ్లలో కోహ్లీ ఒక్కడని చెప్పారు. ఈ టెస్ట్ సిరీస్లో కూడా కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడనే […] -
48 గంటల్లో రూ.1.5కోట్ల జరిమానాలు.. ఎక్కడంటే..?
ఓవైపు కరోనా మహమ్మారి రూపం మార్చుకుని ఒమిక్రాన్తో విజృభింస్తుంటే చాలా మంది కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టా రాజ్యంగా తిరుగుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడ ఎవరూ మాస్క్ ధరించకపోయినా చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ కెమెరాలకు పని చెబుతున్నారు. ఫోటో తీయడం వారికి జరిమానా విధించడం .. ఎక్కడ లాఠీలకు పనిచెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన రెండు రోజుల్లో కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించిన వారి నుంచి సుమారు 1.5 కోట్ల […] -
తీన్మార్ మల్లన్నపై బీజేపీ సీరియస్
బిజెపి నేత చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు చెందిన ఓ మీడియా సంస్థ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ప్రస్తావనతో ట్విటర్లో ఓ పోల్ క్వశ్చన్ను పోస్ట్ చేసింది. బాడీషేమింగ్తో కూడిన ఆ పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. దీనిపై హిమాన్షు తండ్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్ సోదరి కవితతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తదితరులు ఖండించారు. […] -
బ్రేకింగ్:చిన్నారులకు భారత్ బయోటెక్ గుడ్ న్యూస్..వ్యాక్సిన్ రెడీ
కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న చిన్నారులకు భారత్ బయోటెక్ శుభవార్త వినిపించింది. 12నుంచి18 సంవత్సరాల వయసున్న పిల్లలకు భారత్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కరోనా మహమ్మారి నుంచి పిల్లల్ని రక్షించేందుకు మార్గం సుగమం కానుంది. దేశంలో 18 సంవత్సరాల లోపువారికి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ల సరఫరా జరుగుతోంది. చిన్నారుల వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడో పూర్తయ్యాయి. డీసీజీఐ అనుమతి వచ్చిన వెంటనే చిన్నారులకు వ్యాక్సిన్ కార్యక్రమం […]
తాజావార్తలు
-
Story Board : రాజధానిని రగిలించారు.. చట్టసభల్ని స్తంభింపజేశారు
-
Prabhas Sreenu: “ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా”.. సినియర్ యాక్టర్తో రూమర్స్పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
-
Prabhas: “నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి”
-
Ravi Bishnoi: రవి బిష్ణోయ్లో అంత చేంజ్ ఎలా వచ్చింది.. ఆ ఒక్క మార్పుతో ఫామ్లోకి వచ్చిన లెగ్ స్పిన్నర్..
-
Prabhas Sreenu: “ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!”
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!