ఏపీ అభివృద్ధి కోసమే మూడు రాజధానులు: సుచరిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అభివృద్ధి కోసమే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. అమరావతిని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించి, కేవలం తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించిందన్నారు. అమరావతిపై బీజేపీ వైఖరి కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరోలా ఉందన్నారు. 3 రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రమే చెప్పిందని సుచరిత చెప్పారు.
Read Also: జనసేన ‘డిజిటల్’ ఉద్యమం ప్రారంభం.. స్పందన లభించేనా?
Also Read
కానీ ఇక్కడ మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని బీజేపీ చెబుతోందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఎందుకు యూటర్న్ తీసుకుందని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తుందో చెప్పాలని సుచరిత డిమాండ్ చేశారు. ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. తిరుపతి సభలో అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు. సింగిల్గా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదని హోంమంత్రి సుచరిత ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకుని అభివృద్ధిలో కలిసి రావాలని సూచించారు.
- Tags
- ap
- bjp
- mekathoti sucharitha
- tdp
- ycp
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..