అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల పెళ్లి వయసు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయసు 21 సంవత్సరాల నుంచి.. 18 ఏళ్లకు తగ్గించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ పితృస్వామ్య విధానాలకు ఈ నిర్ణయమే నిదర్శనమని పేర్కొన్నారు.
Read Also:అగ్ని ప్రైమ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం
18 ఏళ్ల వయసున్న వారు ఒప్పందాలపై సంతకాలు చేయొచ్చు.. వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ప్రధానమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు కానీ పెళ్ళి మాత్రం చేసుకోకూడదా ? అని నిలదీశారు. సెక్స్ వల్ రిలేషన్ షిప్ లో ఉండేందుకు, లివింగ్ పార్ట్నర్ షిప్ తో ఉండడానికి నిర్ణయం తీసుకోవచ్చు కానీ.. వాళ్ళ జీవిత భాగస్వామిని ఎంచుకో కూడదా ? అంటూ ఓవైసీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
దేశంలో ప్రతి నలుగురు అమ్మాయిలలో ఒకరికి 18 ఏళ్ల లోపే పెళ్లి చేస్తున్నారని… కానీ వాటిపై కేవలం 785 క్రిమినల్ కేసులు మాత్రమే నమోదయ్యాయని గుర్తుచేశారు. నిజంగా మహిళలపై ప్రధాని మోడీకి ప్రేమ ఉంటే వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని మెరుగు పరిచేందుకు అవకాశాలు కల్పించాలని, ఉపాధి, ఉద్యోగాలు అందించాలని డిమాండ్ చేశారు. మహిళల ఓట్ల కోసమే ఇలాటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.