NTV WebDesk
Author- NTV Telugu-
Ajaz Patel: వేలానికి ఆ బౌలర్ జెర్సీ.. తెరవెనుక అసలు కథ ఇది!
న్యూజిల్యాండ్ బౌలర్ అజాజ్ పటేల్ గుర్తున్నాడా? క్రికెట్ ప్రియులకు కచ్ఛితంగా గుర్తుంటాడు. గతేడాది డిసెంబర్లో వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భాగంగా మొదటి ఇన్నింగ్స్లో అజాజ్ పది వికెట్లు తీసి చరిత్రపుటలకెక్కాడు. ఏ జెర్సీతో అయితే అతడు ఆ ఫీట్ సాధించాడో, ఇప్పుడదే జెర్సీని వేలం వేయబోతున్నాడు. దీని వెనుక దాగి ఉన్న ఓ చిన్న కథను కూడా అతడు రివీల్ చేశాడు గతేడాది తన కూతురు ఆరోగ్య సమస్యతో బాధపడగా, న్యూజిల్యాండ్లోని స్టార్షిప్ […] -
MLA vs MP: విభేదాలకు చెక్.. ఇకపై అదే టార్గెట్
కొంతకాలం నుంచి విభేదాల కారణంగా వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్ రామ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు కూడా! ఇప్పుడు వాటన్నింటిని, తమ ఇగోని పక్కనపెట్టి.. వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయారు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి రాయబారం నడిపి, ఆ ఇద్దరి మధ్య ఉన్న విభేదాల్ని దూరం చేశారు. రాజమండ్రిలోని ఎంపీ భరత్ రామ్ ఇంట్లోనే ఈ సమస్య పరిష్కారమైంది. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. […] -
Talari Venkatrao: టీడీపీ నాయకులే నన్ను చంపాలని చూశారు.. సాక్ష్యాలివిగో!
వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యోదంతం రాష్ట్రంలో రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. పథకం ప్రకారమే నిందితులు ఆయన్ను హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలినా.. రాజకీయంగా ఇది ఊహించని మలుపులు తిరుగుతోంది. ఓవైపు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే తెరవెనుక ఉండి ఈ హత్య చేయించాడని గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ అనుమానంతోనే బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు, గంజి ప్రసాద్ కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు కూడా ఎమ్మెల్యేపై దాడికి దిగారు. అయితే, తనపై దాడి చేసింది […] -
Ambati Rambabu: చంద్రబాబే ఆ ప్రాజెక్ట్కి నష్టం కలిగించారు
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంబటి రాంబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించారు. ఈ ప్రాజెక్ట్పై అవగాహన పెంచుకోవడం కోసమే క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని ఆయనన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పెడెప్పుడు పూర్తవుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, అయితే వరద ఉధృతి కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోందని అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, తొందరపాటు చర్యల వల్ల ఆ వాల్ దెబ్బతిందని చెప్పిన రాంబాబు.. ఆ సమస్యని […] -
Pathipati Pullarao: దొడ్డిదారిలో ఎంపీపీ సీటుని వైసీపీ కొట్టేసింది
దుగ్గిరాల ఎంపీపీ పీఠం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. దాదాపు సంవత్సరంన్నర కాలం సాగిన ఈ పోరు, ఎట్టకేలకు ముగిసింది. ఈ పీఠం వైసీపీకే దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల నేతల మధ్య మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది. న్యాయబద్దంగా ఈ సీటు తమకు దక్కిందని వైసీపీ నేతలు చెప్తోంటే.. అప్రజాస్వామికంగా వైసీపీ ఈ సీటుని కొట్టేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత పత్తిపాటు పుల్లారావు అవే […] -
DGP Rajendranath: చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్
రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార ఘటనపై చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గి రాజేశాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో శాంతి – భద్రతలు కూడా లోపించాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జరిగిన సంఘటనల గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, ఒకట్రెండు సంఘటనలతో రాష్ట్రంలో శాంతి – భద్రతలులేవని వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నారు. దిశా చట్టం లేకపోయినప్పటికీ, ఆ స్ఫూర్తితో తాము జరుగుతున్న ఘటనలపై విచారణ […] -
Bandi Sanjay: సరూర్ నగర్ పరువుహత్యపై మండిపాటు
సరూర్ నగర్ పరువు హత్యపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నందుకే ఈ హత్య జరిగిందని ఆరోపించిన ఆయన.. ఈ హత్య చేసిన వ్యక్తుల్ని, అలాగే వారి వెనకున్న శక్తుల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా మతపరంగా జరిగిన హత్యగానే బీజేపీ భావిస్తోందన్నారు. ఈ కిరాతకమైన ఘటనపై సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లవ్ జిహాద్ […] -
Dhulipalla Narendra: పేదోడ్ని కొట్టి అదానీకి పెడుతున్న జగన్
కేసీఆర్ ప్రతి రోజూ ఉదయాన్నే సీఎం జగన్మోహన్ రెడ్డికి దండం పెడుతున్నారు. జగన్ వైఖరి వల్ల.. ఏపీలోని విద్యుత్ కోతల వల్ల ఏపీ నుంచి పరిశ్రమలు తెలంగాణకు తరలిపోతున్నాయన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నాయి.. ఇక కొత్త పరిశ్రమలు రావడానికే భయపడుతున్నాయి. ఏపీలోనే సోలార్ పవర్ రూ. 2కే లభ్యమవుతోంటే.. అదానీ దగ్గర నుంచి రూ. 4కు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమేంటి.?ఎక్కడైనా పెద్దోడ్ని కొట్టి.. పేదోడికి పెడతారు.. […] -
Dharmana Prasada Rao: తరతరాలకు స్ఫూర్తి జలగం వెంగళరావు
మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుని ఆకాశానికెత్తేశారు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు. శ్రీకాకుళంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శతజయంతి ఉత్సవాలు జరిగాయి. జలగం వెంగళరావు రాజాం దగ్గర సోపేరు అనే చిన్న గ్రామంలో జన్మించారన్నారు మంత్రి ధర్మాన. మొదట్లో జలగం వెంగళరావు శ్రీకాకుళంలో జన్మించారని చాలామందికి తెలియదు. జిల్లా నుండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వెంగళరావు ఒక్కరే అన్నారు. దేశంలో ముఖ్యమంత్రి పదవి కి వన్నె తెచ్చిన వ్యక్తి. గతంలో పనిచేసిన […] -
CM Jagan: రేపు తిరుపతిలో సీఎం జగన్ టూర్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు తిరుపతికి రానున్నారు. ఉదయం పది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు బయలుదేరతారు సీఎమ్ జగన్. అనంతరం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఎస్వీ యూనివర్శిటీకి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో మాట్లాడనున్నారు సీఎం జగన్. అనంతరం 12 గంటలకు సీఎమ్ ప్రసంగం వుంటుంది. ఒంటి గంటకు పద్మావతి పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కు భూమి పూజ, శంఖుస్థాపన […]
తాజావార్తలు
-
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!