Ambati Rambabu: చంద్రబాబే ఆ ప్రాజెక్ట్కి నష్టం కలిగించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంబటి రాంబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించారు. ఈ ప్రాజెక్ట్పై అవగాహన పెంచుకోవడం కోసమే క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని ఆయనన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పెడెప్పుడు పూర్తవుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, అయితే వరద ఉధృతి కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోందని అన్నారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, తొందరపాటు చర్యల వల్ల ఆ వాల్ దెబ్బతిందని చెప్పిన రాంబాబు.. ఆ సమస్యని పరిష్కరించిన వెంటనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం అవుతుందని అన్నారు. ప్రపంచంలో, దేశంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సందర్భాలు ఏవీ లేవని, ఒక్క పోలవరం విషయంలో మాత్రం ఇలా జరిగిందని తెలిపారు. ఆ వాల్ పునర్నిర్మాణం చేసే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం కావడంతో, వ్యయం మరింత పెరుగుతుందని వెల్లడించారు. అవగాహన లోపం, ఏదో చేయాలనే తాపత్రయంతో చంద్రబాబు ఈ ప్రాజెక్ట్కి నష్టం కలిగించారని ఆరోపించారు.
Also Read
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
కాగా.. గురువారం ఉదయమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న అంబటి రాంబాబు స్పిల్ వే మీద ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. మంత్రి వెంట పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ యం.వి.ఎస్.నాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఆర్డీవో ఝాన్సి రాణీ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!