Pathipati Pullarao: దొడ్డిదారిలో ఎంపీపీ సీటుని వైసీపీ కొట్టేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుగ్గిరాల ఎంపీపీ పీఠం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. దాదాపు సంవత్సరంన్నర కాలం సాగిన ఈ పోరు, ఎట్టకేలకు ముగిసింది. ఈ పీఠం వైసీపీకే దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల నేతల మధ్య మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది. న్యాయబద్దంగా ఈ సీటు తమకు దక్కిందని వైసీపీ నేతలు చెప్తోంటే.. అప్రజాస్వామికంగా వైసీపీ ఈ సీటుని కొట్టేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత పత్తిపాటు పుల్లారావు అవే విమర్శలు చేశారు.
దుగ్గిరాల ఎంపీపీ సీటు కోసం వైసీపీ న్యాయస్థానం ఆదేశాల్ని తుంగలో తొక్కి, అప్రజాస్వామికంగా దొడ్డిదారిలో వెళ్ళిందన్నారు. 18 ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ-9, జనసేన-1 స్థానాల్ని కైవసం చేసుకున్నప్పుడు.. వైసీపీకి ఎంపీపీ పీఠం ఎలా దక్కుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెరవెనుక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సొంత పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేయించి మరీ, ఈ పీఠాన్ని దక్కించుకున్నారన్నారు. న్యాయస్థానం ఆదేశాల్ని పట్టించుకోకుండా ఈ సీటు దోచుకున్న వైసీపీకి ప్రజలు కచ్ఛితంగా గుణపాఠం చెప్పే తీరుతారన్నారు.
Also Read
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ఇదే సమయంలో విద్యా దీవెన నిధుల్ని సక్రమంగా ఇవ్వకుండా.. విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాటమాడుతోందన్నారు. జగన్ నిర్వాకంతోనే 1,31,715 మంది దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారన్నారు. టీడీపీ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు రూ.2,132 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ అందగా, జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో కేవలం 10 లక్షల 82 వేల మందికి మాత్రమే ఇచ్చిందన్నారు. జగన్లో నిరాశ నిస్పృహలు, అసూయ ద్వేషాలు పెరగడం వల్లే ప్రతిపక్షంపై అక్కసు వెళ్ళగక్కుతున్నారని, ఆయన ప్రభుత్వం ఎంత గింజుకున్నా 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని నమ్మకం వెలిబుచ్చారు.
తాజావార్తలు
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..