Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- మే 8న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో M4M విడుదల
- టాలీవుడ్కు పరిచయమవుతున్న అమెరికన్ నటి జో శర్మ
- ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (మోటివ్ ఫర్ మర్డర్). ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ జో శర్మ.. M4M చిత్రంతో టాలీవుడ్కు పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో ఆమె రాధ అనే పవర్ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రను పోషించారు. కేవలం నటిగానే కాకుండా.. దర్శకుడు మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడవలలతో కలిసి ఈ చిత్రానికి కో-రైటర్గా కూడా పని చేయడం విశేషం. సినిమా రిలీజ్ సందర్భంగా జో శర్మ చిత్ర విశేషాలు, ఆమె సినీ ప్రయాణం గురించిన వివరాలు పంచుకున్నారు.
M4M సినిమా రిలీజ్ కాకముందే అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. లాస్ ఏంజెల్స్, లండన్, న్యూయార్క్, హాలీవుడ్ వంటి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్లో ఏకంగా 15 అవార్డులను గెలుచుకుంది. ముఖ్యంగా ‘కేన్స్’ ఫిలిం ఫెస్టివల్లో గ్లోబల్ ప్రీమియర్ వేసినప్పుడు విదేశీ ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం చిత్ర బృందానికి పెద్ద బూస్ట్ను ఇచ్చింది. జో శర్మ ఉత్తమ నటిగా, మోహన్ వడ్లపట్ల ఉత్తమ దర్శకుడిగా పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
M4M ఒక విభిన్నమైన సీరియల్ కిల్లర్ స్టోరీ అని జో శర్మ చెప్పారు. హంతకుడు హత్యలు చేసిన తర్వాత మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో వంటి సుప్రసిద్ధ చిత్రకారుల కళాఖండాల తరహాలో అలంకరించడం ఈ కథలోని ప్రధాన సస్పెన్స్ అని తెలిపారు. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇలాంటి కాన్సెప్ట్ రాలేదని ధీమా వ్యక్తం చేశారు. సినిమా చూసే ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన ఛాలెంజ్ కూడా జో శర్మ విసిరారు. విడుదల రోజున విలన్ ఎవరో గుర్తించిన వారికి లక్ష రూపాయల బహుమతి ప్రకటించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
జో శర్మ హైదరాబాద్లో జన్మించి.. నాగ్పూర్, ముంబైలలో పెరిగారు. ఆమె మూలాలు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉండటంతో.. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ భాషల్లో పట్టు ఉంది. మోహన్ మీడియా క్రియేషన్స్, మెక్ క్వీన్ గ్రూప్ అమెరికా వారు సంయుక్తంగా సుమారు ఒక లక్ష డాలర్ల బడ్జెట్తో M4Mను నిర్మించారు. షూటింగ్ ప్రధానంగా హైదరాబాద్ పరిసరాల్లో జరిగింది. చెన్నైకి చెందిన వసంత్ ఇసైపట్టాయ్ స్వరాలు అందించారు. పీవీఆర్ ఇనాక్స్ పిక్చర్స్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రం మే 8న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!