నెల్లూరు జిల్లాలోని కందుకూరులో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా అదే చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది.
సరదాగా ఆడిన ఆట ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. విజయనగరంలో జిల్లాలోని పూసపాటిరేగ మండలం ఎరుకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం సందర్భంగా 4 గ్రామాల మధ్య కబడ్డీ పోటీలు జరిగాయి.
ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు బహిరంగ లేఖ రాశారు. ఏపీలో ఇప్పటివరకు ఐటీకి సంబంధించిన పాలసీ తప్ప పని జరగడం లేదని బీజేపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ పక్కనున్న ఏపీలో బీఆర్ఎస్ పాత్రపై రకరకాల ఉహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీలోని ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు.. బీఆర్ఎస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీలోని ముగ్గురు కీలక నేతలు రేపు బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు పీవీ చలపతిరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు.. ఆరిలోవ పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు ప్రాణాలు కోల్పోయారు.
ఇటీవల ప్రమాదానికి గురైన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్వేస్ డ్రైవర్, ఆపరేటర్ను తమ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు.
శుక్రవారం జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఫిర్యాదు మేరకు హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్పై చండీగఢ్ పోలీసులు లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపు కేసు నమోదు చేశారు. లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
'హత్య చేయడం ఎలా' అని గూగుల్లో సెర్చ్ చేసి భార్యను హత్య చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు వికాస్, వారిని తప్పుదారి పట్టించడానికి దోపిడీ గురించి తప్పుడు సమాచారం అందించగా.. పోలీసులు అతని ఫోన్లో అతని ప్రియురాలితో పాటు నేరారోపణ చేసే సాక్ష్యాలను కనుగొన్నారు.
మేఘాలయలోని స్నైఫర్ డాగ్లలో ఒకటి మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత సరిహద్దు భద్రతా దళం కోర్టు విచారణకు ఆదేశించింది. డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారి ఈ విషయంపై నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.