Rishabh Pant: రిషబ్ పంత్ను రక్షించిన వారిని సన్మానించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: ఇటీవల ప్రమాదానికి గురైన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్వేస్ డ్రైవర్, ఆపరేటర్ను తమ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. “జనవరి 26న క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్వేస్ డ్రైవర్, ఆపరేటర్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం గౌరవిస్తుంది” అని ధామి అన్నారు. రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడటానికి డ్రైవర్, ఆపరేటర్ తమ ప్రాణాలను పణంగా పెట్టారని ముఖ్యమంత్రి అన్నారు. క్రికెటర్ కారు వారి కళ్ల ముందు రెండుసార్లు బోల్తా పడింది. అత్యవసర పరిస్థితిని పరిష్కరించడంలో హర్యానా రోడ్వేస్ సిబ్బంది తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. రిషబ్ పంత్ ఉత్తరాఖండ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
డిసెంబరు 30న ఉదయం 5.30 గంటల ప్రాంతంలో, పంత్ శుక్రవారం రూర్కీలోని నర్సన్ సరిహద్దులో డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తన తల్లిని సర్ప్రైజ్ చేసేందుకు ఢిల్లీ నుంచి రూర్కీకి తిరిగి వస్తుండగా తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో పంత్ కారులో ఒక్కడే డ్రైవింగ్ చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రమాదంలో పంత్ వీపు, నుదురు, కాలుపై గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం అయింది. పంత్ను డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చినట్లు హరిద్వార్ ఎస్పీ (రూరల్) స్వపన్ కిషోర్ శుక్రవారం తెలిపారు. రిషబ్ పంత్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని ఢిల్లీ క్రికెట్ బోర్టు డైరెక్టర్ వెల్లడించారు. అవసరమైతే అతడిని ఢిల్లీకి తరలించవచ్చని తెలిపారు.
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
Harrasment: లైంగిక ఆరోపణల నేపథ్యంలో హర్యానా క్రీడా శాఖ మంత్రి రాజీనామా
బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్ గురుకుల్ కారు డివైడర్ను ఢీకొట్టడాన్ని గుర్తించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కారులో పంత్కు సహాయం చేయడానికి వారు కారు వైపు పరుగులు తీశారని పానిపట్ బస్ డిపో జనరల్ మేనేజర్ కె.జాంగ్రా అన్నారు. హర్యానా ప్రభుత్వం డిసెంబర్ 30న వారు ప్రాణాలకు తెగించి రిషబ్ పంత్ను కాపాడినందుకు వారిని సత్కరించింది. తాము రిషబ్ పంత్ను కారులో నుంచి లాగినప్పుడు మంటలు వ్యాపించాయని.. 5-7 సెకన్లలో వాహనం కాలిపోయిందని రిషబ్ పంత్ను రక్షించిన బస్సు సిబ్బంది పరంజీత్ అన్నారు.
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!