Rishabh Pant: రిషబ్ పంత్ను రక్షించిన వారిని సన్మానించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: ఇటీవల ప్రమాదానికి గురైన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్వేస్ డ్రైవర్, ఆపరేటర్ను తమ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. “జనవరి 26న క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్వేస్ డ్రైవర్, ఆపరేటర్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం గౌరవిస్తుంది” అని ధామి అన్నారు. రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడటానికి డ్రైవర్, ఆపరేటర్ తమ ప్రాణాలను పణంగా పెట్టారని ముఖ్యమంత్రి అన్నారు. క్రికెటర్ కారు వారి కళ్ల ముందు రెండుసార్లు బోల్తా పడింది. అత్యవసర పరిస్థితిని పరిష్కరించడంలో హర్యానా రోడ్వేస్ సిబ్బంది తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. రిషబ్ పంత్ ఉత్తరాఖండ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
డిసెంబరు 30న ఉదయం 5.30 గంటల ప్రాంతంలో, పంత్ శుక్రవారం రూర్కీలోని నర్సన్ సరిహద్దులో డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తన తల్లిని సర్ప్రైజ్ చేసేందుకు ఢిల్లీ నుంచి రూర్కీకి తిరిగి వస్తుండగా తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో పంత్ కారులో ఒక్కడే డ్రైవింగ్ చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రమాదంలో పంత్ వీపు, నుదురు, కాలుపై గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం అయింది. పంత్ను డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చినట్లు హరిద్వార్ ఎస్పీ (రూరల్) స్వపన్ కిషోర్ శుక్రవారం తెలిపారు. రిషబ్ పంత్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని ఢిల్లీ క్రికెట్ బోర్టు డైరెక్టర్ వెల్లడించారు. అవసరమైతే అతడిని ఢిల్లీకి తరలించవచ్చని తెలిపారు.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
Harrasment: లైంగిక ఆరోపణల నేపథ్యంలో హర్యానా క్రీడా శాఖ మంత్రి రాజీనామా
బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్ గురుకుల్ కారు డివైడర్ను ఢీకొట్టడాన్ని గుర్తించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కారులో పంత్కు సహాయం చేయడానికి వారు కారు వైపు పరుగులు తీశారని పానిపట్ బస్ డిపో జనరల్ మేనేజర్ కె.జాంగ్రా అన్నారు. హర్యానా ప్రభుత్వం డిసెంబర్ 30న వారు ప్రాణాలకు తెగించి రిషబ్ పంత్ను కాపాడినందుకు వారిని సత్కరించింది. తాము రిషబ్ పంత్ను కారులో నుంచి లాగినప్పుడు మంటలు వ్యాపించాయని.. 5-7 సెకన్లలో వాహనం కాలిపోయిందని రిషబ్ పంత్ను రక్షించిన బస్సు సిబ్బంది పరంజీత్ అన్నారు.
తాజావార్తలు
-
Tollywood : టాలీవుడ్ను ముంచేస్తున్న ‘మార్కెట్ మోడల్’.. అసలు క్రైసిస్ ఇక్కడే!
-
Gold Imports: బంగారంపై 15% దిగుమతి సుంకం ప్రభావం.. 70% తగ్గిన దిగుమతులు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..