Rishabh Pant: రిషబ్ పంత్ను రక్షించిన వారిని సన్మానించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: ఇటీవల ప్రమాదానికి గురైన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్వేస్ డ్రైవర్, ఆపరేటర్ను తమ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. “జనవరి 26న క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్వేస్ డ్రైవర్, ఆపరేటర్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం గౌరవిస్తుంది” అని ధామి అన్నారు. రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడటానికి డ్రైవర్, ఆపరేటర్ తమ ప్రాణాలను పణంగా పెట్టారని ముఖ్యమంత్రి అన్నారు. క్రికెటర్ కారు వారి కళ్ల ముందు రెండుసార్లు బోల్తా పడింది. అత్యవసర పరిస్థితిని పరిష్కరించడంలో హర్యానా రోడ్వేస్ సిబ్బంది తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. రిషబ్ పంత్ ఉత్తరాఖండ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
డిసెంబరు 30న ఉదయం 5.30 గంటల ప్రాంతంలో, పంత్ శుక్రవారం రూర్కీలోని నర్సన్ సరిహద్దులో డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తన తల్లిని సర్ప్రైజ్ చేసేందుకు ఢిల్లీ నుంచి రూర్కీకి తిరిగి వస్తుండగా తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో పంత్ కారులో ఒక్కడే డ్రైవింగ్ చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రమాదంలో పంత్ వీపు, నుదురు, కాలుపై గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం అయింది. పంత్ను డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చినట్లు హరిద్వార్ ఎస్పీ (రూరల్) స్వపన్ కిషోర్ శుక్రవారం తెలిపారు. రిషబ్ పంత్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని ఢిల్లీ క్రికెట్ బోర్టు డైరెక్టర్ వెల్లడించారు. అవసరమైతే అతడిని ఢిల్లీకి తరలించవచ్చని తెలిపారు.
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
Harrasment: లైంగిక ఆరోపణల నేపథ్యంలో హర్యానా క్రీడా శాఖ మంత్రి రాజీనామా
బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్ గురుకుల్ కారు డివైడర్ను ఢీకొట్టడాన్ని గుర్తించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కారులో పంత్కు సహాయం చేయడానికి వారు కారు వైపు పరుగులు తీశారని పానిపట్ బస్ డిపో జనరల్ మేనేజర్ కె.జాంగ్రా అన్నారు. హర్యానా ప్రభుత్వం డిసెంబర్ 30న వారు ప్రాణాలకు తెగించి రిషబ్ పంత్ను కాపాడినందుకు వారిని సత్కరించింది. తాము రిషబ్ పంత్ను కారులో నుంచి లాగినప్పుడు మంటలు వ్యాపించాయని.. 5-7 సెకన్లలో వాహనం కాలిపోయిందని రిషబ్ పంత్ను రక్షించిన బస్సు సిబ్బంది పరంజీత్ అన్నారు.
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!