'గుజరాతీలు దుండగులు' అంటూ బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి అహ్మదాబాద్లోని మెట్రోపాలిటన్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.
యునైటెడ్ కింగ్డమ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సాంకేతిక సమస్యతో పోరాడుతోంది. కంపూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఆఫ్ఘనిస్థాన్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. ఉదయం 8.05 గంటలకు భూకంప ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సమాచారం ఇచ్చింది.
మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్డీ దేవెగౌడ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ నేతృత్వంలో పార్టీ కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించారు.
చంద్రయాన్-3 మిషన్లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై సంచరిస్తున్న సంగతి తెలిసిందే. అయిన ఆ రోవర్కు ఊహించని అడ్డంకి ఎదురైంది. రోవర్కు భారీ బిలం అడ్డుగా వచ్చినట్లు ఇస్రో తెలిపింది.
కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం గృహలక్ష్మి యోజన ద్వారా మహిళలకు బహుమతులు ఇవ్వబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గృహలక్ష్మి యోజనను ప్రారంభించనుంది.
సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లిన వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్లో లఖింపూర్ ఖేరీలోని ఫన్ మాల్కు సినిమా చూసేందుకు వెళ్లిన 35 ఏళ్ల వ్యక్తి శనివారం గుండెపోటుతో మృతి చెందాడు.
విమానంలో శ్వాస ఆగిపోయిన రెండేళ్ల చిన్నారి ఓ వైద్య బృందం రక్షించింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానంలో రెండేళ్ల చిన్నారి శ్వాస ఆగిపోగా.. విమానంలో ఉన్న వైద్యులు వచ్చి పాపకు చికిత్స చేయాలని సిబ్బంది అత్యవసర ప్రకటన చేశారు.
శివసేన (యూబీటి) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ను అమీబాతో పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని ఫ్రంట్కు ఖచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని అన్నారు.