Deve Gowda: లోక్సభ ఎన్నికల కోసం దేవెగౌడ కీలక నిర్ణయం .. జేడీఎస్ కోర్ కమిటీ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deve Gowda: మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్డీ దేవెగౌడ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ నేతృత్వంలో పార్టీ కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించారు.సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమిటీ పర్యటించి అక్టోబర్లో పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీకి పార్టీ సంస్థాగత నివేదికను అందజేస్తుందని జేడీ(ఎస్) చీఫ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలో 19 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు జీటీ దేవెగౌడ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు మాజీ ప్రధాని తెలిపారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంది.
Read Also: Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్కు ఊహించని అడ్డంకి.. చంద్రునిపై భారీ బిలం!
Also Read
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీలకు ఎన్నికల వ్యూహాన్ని కూడా ఈ కమిటీ నిర్ణయిస్తుందని హెచ్డీ దేవెగౌడ చెప్పారు. తాను 91 ఏళ్ల వయసులో అడుగు పెట్టానని చెప్పిన ఆయన.. ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీగా జేడీ(ఎస్)ని కాపాడుకోవడమే తన లక్ష్యమన్నారు.వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటానని సీనియర్ నేత చెప్పారు. 91 ఏళ్ల వయసులో తన అనుభవాన్ని ప్రజలతో పంచుకుంటానని చెప్పారు.
లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ, దేవెగౌడ పార్టీ నేతలను వేటాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో జేడీ(ఎస్) ఈ చర్య తీసుకుంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా.. 2019 ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా, పార్టీ బలపరిచిన అభ్యర్థి కూడా విజయం సాధించారు. కాంగ్రెస్, జేడీ(ఎస్లు) ఒక్కో సీటు గెలుచుకున్నాయి. జేడీ(ఎస్) కంచుకోట హసన్లో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరిలో జీటీ దేవెగౌడ చేతిలో ఓడిపోయారు. అయితే, అప్పుడు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన సిద్ధరామయ్య బాగల్కోట్ జిల్లా బాదామి నుంచి గెలిచారు.
తాజావార్తలు
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!