Deve Gowda: లోక్సభ ఎన్నికల కోసం దేవెగౌడ కీలక నిర్ణయం .. జేడీఎస్ కోర్ కమిటీ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deve Gowda: మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్డీ దేవెగౌడ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ నేతృత్వంలో పార్టీ కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించారు.సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమిటీ పర్యటించి అక్టోబర్లో పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీకి పార్టీ సంస్థాగత నివేదికను అందజేస్తుందని జేడీ(ఎస్) చీఫ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలో 19 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు జీటీ దేవెగౌడ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు మాజీ ప్రధాని తెలిపారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంది.
Read Also: Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్కు ఊహించని అడ్డంకి.. చంద్రునిపై భారీ బిలం!
Also Read
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీలకు ఎన్నికల వ్యూహాన్ని కూడా ఈ కమిటీ నిర్ణయిస్తుందని హెచ్డీ దేవెగౌడ చెప్పారు. తాను 91 ఏళ్ల వయసులో అడుగు పెట్టానని చెప్పిన ఆయన.. ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీగా జేడీ(ఎస్)ని కాపాడుకోవడమే తన లక్ష్యమన్నారు.వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటానని సీనియర్ నేత చెప్పారు. 91 ఏళ్ల వయసులో తన అనుభవాన్ని ప్రజలతో పంచుకుంటానని చెప్పారు.
లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ, దేవెగౌడ పార్టీ నేతలను వేటాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో జేడీ(ఎస్) ఈ చర్య తీసుకుంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా.. 2019 ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా, పార్టీ బలపరిచిన అభ్యర్థి కూడా విజయం సాధించారు. కాంగ్రెస్, జేడీ(ఎస్లు) ఒక్కో సీటు గెలుచుకున్నాయి. జేడీ(ఎస్) కంచుకోట హసన్లో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరిలో జీటీ దేవెగౌడ చేతిలో ఓడిపోయారు. అయితే, అప్పుడు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన సిద్ధరామయ్య బాగల్కోట్ జిల్లా బాదామి నుంచి గెలిచారు.
తాజావార్తలు
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్రూమ్కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్సెట్పై ఉద్యోగి ఆవేదన
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!