Deve Gowda: లోక్సభ ఎన్నికల కోసం దేవెగౌడ కీలక నిర్ణయం .. జేడీఎస్ కోర్ కమిటీ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deve Gowda: మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్డీ దేవెగౌడ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ నేతృత్వంలో పార్టీ కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించారు.సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమిటీ పర్యటించి అక్టోబర్లో పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీకి పార్టీ సంస్థాగత నివేదికను అందజేస్తుందని జేడీ(ఎస్) చీఫ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలో 19 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు జీటీ దేవెగౌడ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు మాజీ ప్రధాని తెలిపారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంది.
Read Also: Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్కు ఊహించని అడ్డంకి.. చంద్రునిపై భారీ బిలం!
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
- Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీలకు ఎన్నికల వ్యూహాన్ని కూడా ఈ కమిటీ నిర్ణయిస్తుందని హెచ్డీ దేవెగౌడ చెప్పారు. తాను 91 ఏళ్ల వయసులో అడుగు పెట్టానని చెప్పిన ఆయన.. ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీగా జేడీ(ఎస్)ని కాపాడుకోవడమే తన లక్ష్యమన్నారు.వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటానని సీనియర్ నేత చెప్పారు. 91 ఏళ్ల వయసులో తన అనుభవాన్ని ప్రజలతో పంచుకుంటానని చెప్పారు.
లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ, దేవెగౌడ పార్టీ నేతలను వేటాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో జేడీ(ఎస్) ఈ చర్య తీసుకుంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా.. 2019 ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా, పార్టీ బలపరిచిన అభ్యర్థి కూడా విజయం సాధించారు. కాంగ్రెస్, జేడీ(ఎస్లు) ఒక్కో సీటు గెలుచుకున్నాయి. జేడీ(ఎస్) కంచుకోట హసన్లో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరిలో జీటీ దేవెగౌడ చేతిలో ఓడిపోయారు. అయితే, అప్పుడు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన సిద్ధరామయ్య బాగల్కోట్ జిల్లా బాదామి నుంచి గెలిచారు.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!