Tejashwi Yadav: ‘గుజరాతీలు దుండగులు’ అనే వ్యాఖ్యపై తేజస్వి యాదవ్కు కోర్టు సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav: ‘గుజరాతీలు దుండగులు’ అంటూ బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి అహ్మదాబాద్లోని మెట్రోపాలిటన్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డీజే పర్మార్ సెప్టెంబర్ 22న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ తేజస్వీ యాదవ్కు సమన్లు జారీ చేశారు. క్రిమినల్ పరువు నష్టం కలిగించే భారతీయ శిక్షాస్మృతిలోని 499, 500 సెక్షన్ల కింద దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ ఉత్తర్వు వచ్చింది.
Read Also: Mamata Banerjee: లోక్సభ ఎన్నికలపై దీదీ కీలక వ్యాఖ్యలు.. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే…
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- New T20 captain Shreyas Iyer: 'సింహాల్లా ఆడదాం'.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
‘సామాజిక కార్యకర్త’, వ్యాపారవేత్త హరేష్ మెహతా (69) ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. తాను వ్యాపారవేత్తనని, ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ ప్రివెంటివ్ కౌన్సిల్ (గుజరాత్ రాష్ట్రం) వైస్ ప్రెసిడెంట్ను అని ఆయన తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 202 ప్రకారం తేజస్వీ యాదవ్పై కోర్టు విచారణ చేపట్టింది. అహ్మదాబాద్లో ఉన్న సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త అయిన హరేష్ మెహతా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా తేజస్వీ యాదవ్కు సమన్లు ఇవ్వడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 21న బీహార్లోని పాట్నాలో తేజస్వీ యాదవ్ మీడియా ముందు చేసిన ప్రకటనకు సంబంధించిన రుజువుతో సహా హరేష్ మెహతా కోర్టులో తన ఫిర్యాదును దాఖలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్నందున తేజస్వీ యాదవ్ ఆ మాటలు అనరాదని మెహతా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!