Griha Lakshmi Yojana: మహిళలకు గుడ్న్యూస్.. రక్షాబంధన్ కానుక ఇవ్వనున్న సిద్ధరామయ్య సర్కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Griha Lakshmi Yojana: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం గృహలక్ష్మి యోజన ద్వారా మహిళలకు బహుమతులు ఇవ్వబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గృహలక్ష్మి యోజనను ప్రారంభించనుంది. ఖర్గే, రాహుల్ సమక్షంలో కోటి మందికి పైగా మహిళలకు నెలకు రూ.2,000 భృతి ఇవ్వనున్నారు. మైసూర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు సమాచారం అందించారు. అధికారుల ప్రకారం, గృహ లక్ష్మి యోజన కోసం సుమారు 1.08 కోట్ల మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీల్లో ఈ పథకం ఒకటి. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంపై ఐదు హామీలు ఇచ్చింది.
Read Also: Mamata Banerjee: డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు..! సంచలన ప్రకటన
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
ఈ వేడుకలకు లక్ష మంది తరలివస్తారని సీఎం సిద్ధరామయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారని, ఆయన సమక్షంలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. దీంతో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. కార్యక్రమం గురించి సమాచారం ఇస్తూ.. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని, కాబట్టి ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆహ్వానించడం జరిగిందని సిద్ధరామయ్య చెప్పారు. ఇది పార్టీ కార్యక్రమం కాదని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా తమ ప్రభుత్వం ఇప్పటికే ఐదు హామీల్లో మూడింటిని అమలు చేసిందని, అందులో మూడు పథకాలు ‘శక్తి’, ‘గృహ జ్యోతి’, ‘అన్నభాగ్య’లను ఇప్పటికే అమలు చేశామని సీఎం సిద్ధరామయ్య గుర్తు చేశారు. కాగా ‘గృహలక్ష్మి’ నాలుగో పథకం.
గృహ లక్ష్మీ యోజన అంటే ఏమిటి?
రాష్ట్ర ప్రభుత్వ గృహలక్ష్మి పథకానికి 1.08 కోట్ల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని గతంలో సిద్ధరామయ్య కూడా గత వారం తెలియజేశారు. గృహ లక్ష్మి యోజన కింద నెలకు రూ. 2,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గృహ లక్ష్మీ యోజన కోసం రూ.17,500 కోట్ల బడ్జెట్ను కేటాయించింది.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!