Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Like Amoeba Nda Has No Definite Shape And Size Says Uddhav Thackeray

Uddav Thackeray: కేసీఆర్ దేశం కోసం పోరాడుతున్నారా?.. బీజేపీకి మద్దతిస్తున్నారా?.. ఉద్ధవ్ ప్రశ్నలు

Published Date :August 27, 2023 , 9:34 pm
By Mahesh Jakki
Uddav Thackeray: కేసీఆర్ దేశం కోసం పోరాడుతున్నారా?.. బీజేపీకి మద్దతిస్తున్నారా?.. ఉద్ధవ్ ప్రశ్నలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uddav Thackeray: శివసేన (యూబీటి) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)ను అమీబాతో పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని ఫ్రంట్‌కు ఖచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని అన్నారు. ఇండియా కూటమిని “ఘమండియా” (అహంకారంతో గుర్తించబడింది) , “ఇండియన్ ముజాహిదీన్” అని పిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే,.. ఎన్‌డీఏను “ఘమ-ఎన్‌డీఏ” (“ఘమండియే” అంటే అహంకారం) అని పిలవాలని అన్నారు. మహారాష్ట్రలోని హింగోలిలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కే చంద్రశేఖర్ రావు తాను ఇండియా కూటమికి మద్దతిస్తారా లేదా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మద్దతిస్తారా అని స్పష్టం చేయాలని కోరారు.

“ఇండియా కూటమిలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునే జాతీయవాద పార్టీలు ఉన్నాయి. కానీ ఎన్‌డీఏలోని చాలా పార్టీలలో దేశద్రోహులు, ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేసి బీజేపీతో మిత్రపక్షంగా చేరిన వారు ఉన్నారు” అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రస్తుత ఎన్డీయే అమీబా లాంటిదని, దానికి ఖచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని… ఇండియా కూటమి బీజేపీని ఓడిస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు దేశం కోసం పోరాడుతున్నారా.. లేక బీజేపీకి మద్దతిస్తున్నారా అనేది తేల్చుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కోరారు. “మీరు దేశంతో ఉంటే, ఇండియా కూటమిలో చేరండి లేదా బీజేపీతో మీ పొత్తును బహిరంగంగా ప్రకటించండి. ఓట్లను విభజించవద్దు” అని ఉద్ధవ్ థాకరే మహారాష్ట్రలో ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్ గురించి ప్రస్తావిస్తూ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఇండియా కూటమిలో చేరాలని ఉద్ధవ్ ఠాక్రే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష కూటమి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఒక్కటవ్వలేదు, దేశం కోసమేనని ఆయన అన్నారు.

Also Read

  • AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
  • DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోర్..
  • KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
  • LPG Crisis: గ్యాస్ టెన్షన్‌కు గుడ్‌బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!

Read Also: West Bengal: బాణాసంచా పేలుడుపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరిపించాలి.. అమిత్ షాకు లేఖ

ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో భారత కూటమి సమావేశం జరగనుంది. ఆగస్టు 31న నేతలకు ఉద్ధవ్ ఠాక్రే విందు ఇవ్వనున్నారు. అహ్మదాబాద్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌కు బీజేపీ ప్రభుత్వం అనుమతినిస్తోందని ఉద్ధవ్‌ ఠాక్రే విమర్శించారు.ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “శాసన్ అప్లయ దారి” (మీ ఇంటి వద్దే ప్రభుత్వం) కార్యక్రమాన్ని ఉద్ధవ్ ఠాక్రే ఎద్దేవా చేశారు. ఇది అబద్ధమే తప్ప మరొకటి కాదన్నారు. ప్రభుత్వ పథకాలను సామాన్యుల వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జపాన్ వెళ్లారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.”ఆయనకు జపాన్ నుంచి పెట్టుబడులు వస్తే బాగుంటుంది, అయితే మహారాష్ట్రకు రావాల్సిన ప్రాజెక్టులు కాకుండా గుజరాత్‌కు తీసుకువెళ్లడం ఏమిటి. తిరిగి తెస్తారా?” అని ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amoeba
  • bjp
  • BRS Party
  • INDIA Bloc
  • NDA

తాజావార్తలు

  • Beetroot Stains : బీట్‌రూట్ మరకలకు బై బై..! ఈ మ్యాజిక్ ట్రిక్ తెలుసా.?

  • AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి…

  • DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోర్..

  • Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!

  • KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions